తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి వచ్చిన ఎందరో హీరోయిన్లు తమ లక్కు ట్రై చేసుకొని బాగా సక్సెస్ అయ్యారు. బాలీవుడ్లో ‘మున్నా మైఖేల్’ అనే మూవీతో తన సినీ కెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్ 2018లో నాగచైతన్య సవ్యసాచి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అక్కినేని యంగ్ హీరోతో మూవీ మంచి లక్ తెస్తుంది అనుకున్న ఈ బ్యూటీకి సవ్యసాచి నిరాశ మిగిల్చింది. ఆ తర్వాత మరొక అక్కినేని హీరో అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను మూవీ లో నటించింది. అయితే ఈ చిత్రం కూడా ఆమె అనుకున్న రేంజ్ సక్సెస్ను అంది ఇవ్వలేకపోయింది.
అయితే 2019లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఈ బ్యూటీ సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఆమె అందాలు అందరినీ ఆకట్టుకున్నాయి.. దీంతో తెలుగుతోపాటు తమిళ్లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. శింబు, జయం రవి లాంటి తమిళ్ స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ మూవీ లో కూడా నటించింది. ఇక ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిస్టారిక్ డ్రామా ‘హరిహరవీరమల్లు’, ‘ప్రభాస్ రాజా సాబ్’ మూవీలలో మంచి ఛాన్స్ పట్టింది ఈ బ్యూటీ.
ఈ సినిమాలు ఆమెకు మంచి సక్సెస్ అందిస్తాయని అందరూ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో నిధి తనును అడిగిన ఒక ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.”మేడం మీకు తెలుగు వచ్చా?”అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నిధి తన స్టైల్లో సూపర్ రిప్లై ఇచ్చింది.”నాకు తెలుగు వస్తుందండి.. అయినా మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను ‘అందరికీ నమస్కారం’అనే బ్యాచ్ అయితే కాదు.”అని రిప్లై ఇచ్చింది నిధి.
అంతేకాదు, ఆమె ప్రభాస్ తో నటిస్తున్న రాజా సాబ్ సినిమా సెట్స్ లో కూడా ఎన్నో ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయని పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అని అభిమానులు అడిగినప్పుడు.. “ఆయన గురించి ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం.. అందరూ ఆయన్ని ఓ లెజెండ్ అంటారు, ఆయనకు చాలా పవర్ఫుల్ కళ్లు ఉన్నాయి.. ఇలా చెబుతూ పోతే ఆయన గురించి చాలా ఉంది.” అని చాలా తెలివిగా మెగా అభిమానుల మనసు దోచుకుంది నిధి.
టాలీవుడ్లో చాలామంది వారసులు సక్సెస్ ఫుల్ హీరోలుగా నిలదొక్కుకున్నారు. వారిలో కొందరికి ఆరంభం నుంచే కలిసొచ్చింది. కొందరు కాస్త తడబడి…
నేచురల్ స్టార్ నాని కెరీర్ ఆరంభంలో పెద్ద హిట్ అయిన చిత్రాల్లో ‘పిల్ల జమీందార్’ ఒకటి. ఈ చిత్రంతోనే అశోక్ బాబు…
సినీ ఇండస్ట్రీలో స్టార్స్ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా సరే.. ఒకరి ప్రొఫెషన్ ను మరొకరు గౌరవించుకోవడం ఎప్పుడూ పాజిటివ్…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఏముందన్న…
రాజకీయ నేతలు...ప్రత్యేకించి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతరత్రా ప్రముఖులపై తనదైన శైలి దూషణ భాషతో పేట్రేగిపోయిన జోసెఫ్…
డైరెక్టర్ కావాలన్న ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్లకు ఏళ్ళు కష్టపడి కొంత అనుభవం సంపాదించాక.. కథలు తయారు చేసుకుని హీరోలు,…