తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి వచ్చిన ఎందరో హీరోయిన్లు తమ లక్కు ట్రై చేసుకొని బాగా సక్సెస్ అయ్యారు. బాలీవుడ్లో ‘మున్నా మైఖేల్’ అనే మూవీతో తన సినీ కెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్ 2018లో నాగచైతన్య సవ్యసాచి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అక్కినేని యంగ్ హీరోతో మూవీ మంచి లక్ తెస్తుంది అనుకున్న ఈ బ్యూటీకి సవ్యసాచి నిరాశ మిగిల్చింది. ఆ తర్వాత మరొక అక్కినేని హీరో అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను మూవీ లో నటించింది. అయితే ఈ చిత్రం కూడా ఆమె అనుకున్న రేంజ్ సక్సెస్ను అంది ఇవ్వలేకపోయింది.
అయితే 2019లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఈ బ్యూటీ సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఆమె అందాలు అందరినీ ఆకట్టుకున్నాయి.. దీంతో తెలుగుతోపాటు తమిళ్లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. శింబు, జయం రవి లాంటి తమిళ్ స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ మూవీ లో కూడా నటించింది. ఇక ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిస్టారిక్ డ్రామా ‘హరిహరవీరమల్లు’, ‘ప్రభాస్ రాజా సాబ్’ మూవీలలో మంచి ఛాన్స్ పట్టింది ఈ బ్యూటీ.
ఈ సినిమాలు ఆమెకు మంచి సక్సెస్ అందిస్తాయని అందరూ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో నిధి తనును అడిగిన ఒక ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.”మేడం మీకు తెలుగు వచ్చా?”అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నిధి తన స్టైల్లో సూపర్ రిప్లై ఇచ్చింది.”నాకు తెలుగు వస్తుందండి.. అయినా మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను ‘అందరికీ నమస్కారం’అనే బ్యాచ్ అయితే కాదు.”అని రిప్లై ఇచ్చింది నిధి.
అంతేకాదు, ఆమె ప్రభాస్ తో నటిస్తున్న రాజా సాబ్ సినిమా సెట్స్ లో కూడా ఎన్నో ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయని పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అని అభిమానులు అడిగినప్పుడు.. “ఆయన గురించి ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం.. అందరూ ఆయన్ని ఓ లెజెండ్ అంటారు, ఆయనకు చాలా పవర్ఫుల్ కళ్లు ఉన్నాయి.. ఇలా చెబుతూ పోతే ఆయన గురించి చాలా ఉంది.” అని చాలా తెలివిగా మెగా అభిమానుల మనసు దోచుకుంది నిధి.
This post was last modified on December 4, 2024 4:07 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…