తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి వచ్చిన ఎందరో హీరోయిన్లు తమ లక్కు ట్రై చేసుకొని బాగా సక్సెస్ అయ్యారు. బాలీవుడ్లో ‘మున్నా మైఖేల్’ అనే మూవీతో తన సినీ కెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్ 2018లో నాగచైతన్య సవ్యసాచి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అక్కినేని యంగ్ హీరోతో మూవీ మంచి లక్ తెస్తుంది అనుకున్న ఈ బ్యూటీకి సవ్యసాచి నిరాశ మిగిల్చింది. ఆ తర్వాత మరొక అక్కినేని హీరో అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను మూవీ లో నటించింది. అయితే ఈ చిత్రం కూడా ఆమె అనుకున్న రేంజ్ సక్సెస్ను అంది ఇవ్వలేకపోయింది.
అయితే 2019లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఈ బ్యూటీ సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఆమె అందాలు అందరినీ ఆకట్టుకున్నాయి.. దీంతో తెలుగుతోపాటు తమిళ్లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. శింబు, జయం రవి లాంటి తమిళ్ స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ మూవీ లో కూడా నటించింది. ఇక ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిస్టారిక్ డ్రామా ‘హరిహరవీరమల్లు’, ‘ప్రభాస్ రాజా సాబ్’ మూవీలలో మంచి ఛాన్స్ పట్టింది ఈ బ్యూటీ.
ఈ సినిమాలు ఆమెకు మంచి సక్సెస్ అందిస్తాయని అందరూ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో నిధి తనును అడిగిన ఒక ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.”మేడం మీకు తెలుగు వచ్చా?”అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నిధి తన స్టైల్లో సూపర్ రిప్లై ఇచ్చింది.”నాకు తెలుగు వస్తుందండి.. అయినా మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను ‘అందరికీ నమస్కారం’అనే బ్యాచ్ అయితే కాదు.”అని రిప్లై ఇచ్చింది నిధి.
అంతేకాదు, ఆమె ప్రభాస్ తో నటిస్తున్న రాజా సాబ్ సినిమా సెట్స్ లో కూడా ఎన్నో ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయని పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అని అభిమానులు అడిగినప్పుడు.. “ఆయన గురించి ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం.. అందరూ ఆయన్ని ఓ లెజెండ్ అంటారు, ఆయనకు చాలా పవర్ఫుల్ కళ్లు ఉన్నాయి.. ఇలా చెబుతూ పోతే ఆయన గురించి చాలా ఉంది.” అని చాలా తెలివిగా మెగా అభిమానుల మనసు దోచుకుంది నిధి.
This post was last modified on December 4, 2024 4:07 pm
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర…
ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…
యాంకర్గా మొదలై, హీరోయిన్గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…