Movie News

డ్రగ్స్ కేసులో విలన్ కొడుకు అరెస్ట్!

చెన్నైలో డ్రగ్స్ కేసులు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. విలన్ గా పలు సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ గురించి అందరికి తెలిసిందే. అయితే అతని కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్టవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మన్సూర్ అలీఖాన్ కొడుకు అలీఖాన్ తుగ్లక్ గతంలోనే పలు వివాదాలతో ఇండస్ట్రీలో విమర్శలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

తిరుమంగళం పోలీసులు ఇటీవల నడిపిన ఆపరేషన్‌లో అలీఖాన్ తుగ్లక్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. గంజాయి, మ్యాజిక్ మష్రూమ్స్, మెథాంఫెటమిన్ వంటి డ్రగ్స్ అమ్మినట్లు నిర్ధారించారు. పోలీసుల విచారణలో, ఈ ముఠా ఆన్‌లైన్ ద్వారా డ్రగ్స్ అమ్మినట్లు తేలింది. కార్తికేయన్ అనే వ్యక్తి ఫోన్ ఆధారంగా డ్రగ్స్ వ్యాపారంలోకి అలీఖాన్ తుగ్లక్ సంబంధం వెలుగులోకి వచ్చింది.

మొదట కాలేజీ విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి ఫోన్ రికార్డుల ద్వారా అలీఖాన్ తుగ్లక్ పేరు గుర్తించారు. అతను కార్తికేయన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ ధరకు అమ్మినట్లు తెలిపారు. వైద్య పరీక్షల్లో అలీఖాన్ తుగ్లక్ డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయింది. అతని స్నేహితులు సయ్యద్ షాహి, మొహమ్మద్ రియాజ్ అలీ, ఫైసల్ అహ్మద్‌లు కూడా ఈ డ్రగ్స్ చైన్‌లో భాగమైనట్లు తేలింది.

ఈ కేసులో నిందితులను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు, వారి కస్టడీ కోసం అభ్యర్థించారు. డ్రగ్స్ అమ్మకం, వాడకం నేపథ్యంలో అలీఖాన్ తుగ్లక్ వంటి ప్రముఖుల సంబంధం బయటపడడంతో, ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ దందాలో ఇంకా పలువురి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

This post was last modified on December 4, 2024 2:31 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్… జైలుకు తరలింపు

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…

2 hours ago

అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. స్టాలిన్ కు కష్టమే

దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా కొనసాగుతున్న తమిళనాడులో శుక్రవారం రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న…

3 hours ago

కూట‌మికి నేటితో ప‌ది నెల‌లు.. ఏం సాధించారంటే!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి శుక్ర‌వారంతో 10 మాసాలు గ‌డిచాయి. గ‌త ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి స‌ర్కారుకొలువు…

4 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బహుమతిగా రూ.4 కోట్లు ఇచ్చిన బీజేపీ

హర్యానా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే…

4 hours ago

అధికారం కూటమి వద్ద.. జనం జగన్ వద్ద: పేర్ని నాని

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ…

4 hours ago

పోలీసులపై వైసీపీ మాజీ ఎంపీ ఫైరింగ్ చూశారా?

వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే…

5 hours ago