చెన్నైలో డ్రగ్స్ కేసులు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. విలన్ గా పలు సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ గురించి అందరికి తెలిసిందే. అయితే అతని కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్టవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మన్సూర్ అలీఖాన్ కొడుకు అలీఖాన్ తుగ్లక్ గతంలోనే పలు వివాదాలతో ఇండస్ట్రీలో విమర్శలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
తిరుమంగళం పోలీసులు ఇటీవల నడిపిన ఆపరేషన్లో అలీఖాన్ తుగ్లక్తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. గంజాయి, మ్యాజిక్ మష్రూమ్స్, మెథాంఫెటమిన్ వంటి డ్రగ్స్ అమ్మినట్లు నిర్ధారించారు. పోలీసుల విచారణలో, ఈ ముఠా ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ అమ్మినట్లు తేలింది. కార్తికేయన్ అనే వ్యక్తి ఫోన్ ఆధారంగా డ్రగ్స్ వ్యాపారంలోకి అలీఖాన్ తుగ్లక్ సంబంధం వెలుగులోకి వచ్చింది.
మొదట కాలేజీ విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి ఫోన్ రికార్డుల ద్వారా అలీఖాన్ తుగ్లక్ పేరు గుర్తించారు. అతను కార్తికేయన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ ధరకు అమ్మినట్లు తెలిపారు. వైద్య పరీక్షల్లో అలీఖాన్ తుగ్లక్ డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయింది. అతని స్నేహితులు సయ్యద్ షాహి, మొహమ్మద్ రియాజ్ అలీ, ఫైసల్ అహ్మద్లు కూడా ఈ డ్రగ్స్ చైన్లో భాగమైనట్లు తేలింది.
ఈ కేసులో నిందితులను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు, వారి కస్టడీ కోసం అభ్యర్థించారు. డ్రగ్స్ అమ్మకం, వాడకం నేపథ్యంలో అలీఖాన్ తుగ్లక్ వంటి ప్రముఖుల సంబంధం బయటపడడంతో, ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ దందాలో ఇంకా పలువురి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
This post was last modified on December 4, 2024 2:31 pm
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…