చెన్నైలో డ్రగ్స్ కేసులు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. విలన్ గా పలు సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ గురించి అందరికి తెలిసిందే. అయితే అతని కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్టవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మన్సూర్ అలీఖాన్ కొడుకు అలీఖాన్ తుగ్లక్ గతంలోనే పలు వివాదాలతో ఇండస్ట్రీలో విమర్శలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
తిరుమంగళం పోలీసులు ఇటీవల నడిపిన ఆపరేషన్లో అలీఖాన్ తుగ్లక్తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. గంజాయి, మ్యాజిక్ మష్రూమ్స్, మెథాంఫెటమిన్ వంటి డ్రగ్స్ అమ్మినట్లు నిర్ధారించారు. పోలీసుల విచారణలో, ఈ ముఠా ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ అమ్మినట్లు తేలింది. కార్తికేయన్ అనే వ్యక్తి ఫోన్ ఆధారంగా డ్రగ్స్ వ్యాపారంలోకి అలీఖాన్ తుగ్లక్ సంబంధం వెలుగులోకి వచ్చింది.
మొదట కాలేజీ విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి ఫోన్ రికార్డుల ద్వారా అలీఖాన్ తుగ్లక్ పేరు గుర్తించారు. అతను కార్తికేయన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ ధరకు అమ్మినట్లు తెలిపారు. వైద్య పరీక్షల్లో అలీఖాన్ తుగ్లక్ డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయింది. అతని స్నేహితులు సయ్యద్ షాహి, మొహమ్మద్ రియాజ్ అలీ, ఫైసల్ అహ్మద్లు కూడా ఈ డ్రగ్స్ చైన్లో భాగమైనట్లు తేలింది.
ఈ కేసులో నిందితులను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు, వారి కస్టడీ కోసం అభ్యర్థించారు. డ్రగ్స్ అమ్మకం, వాడకం నేపథ్యంలో అలీఖాన్ తుగ్లక్ వంటి ప్రముఖుల సంబంధం బయటపడడంతో, ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ దందాలో ఇంకా పలువురి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
This post was last modified on December 4, 2024 2:31 pm
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…