చెన్నైలో డ్రగ్స్ కేసులు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. విలన్ గా పలు సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ గురించి అందరికి తెలిసిందే. అయితే అతని కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్టవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మన్సూర్ అలీఖాన్ కొడుకు అలీఖాన్ తుగ్లక్ గతంలోనే పలు వివాదాలతో ఇండస్ట్రీలో విమర్శలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
తిరుమంగళం పోలీసులు ఇటీవల నడిపిన ఆపరేషన్లో అలీఖాన్ తుగ్లక్తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. గంజాయి, మ్యాజిక్ మష్రూమ్స్, మెథాంఫెటమిన్ వంటి డ్రగ్స్ అమ్మినట్లు నిర్ధారించారు. పోలీసుల విచారణలో, ఈ ముఠా ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ అమ్మినట్లు తేలింది. కార్తికేయన్ అనే వ్యక్తి ఫోన్ ఆధారంగా డ్రగ్స్ వ్యాపారంలోకి అలీఖాన్ తుగ్లక్ సంబంధం వెలుగులోకి వచ్చింది.
మొదట కాలేజీ విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి ఫోన్ రికార్డుల ద్వారా అలీఖాన్ తుగ్లక్ పేరు గుర్తించారు. అతను కార్తికేయన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ ధరకు అమ్మినట్లు తెలిపారు. వైద్య పరీక్షల్లో అలీఖాన్ తుగ్లక్ డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయింది. అతని స్నేహితులు సయ్యద్ షాహి, మొహమ్మద్ రియాజ్ అలీ, ఫైసల్ అహ్మద్లు కూడా ఈ డ్రగ్స్ చైన్లో భాగమైనట్లు తేలింది.
ఈ కేసులో నిందితులను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు, వారి కస్టడీ కోసం అభ్యర్థించారు. డ్రగ్స్ అమ్మకం, వాడకం నేపథ్యంలో అలీఖాన్ తుగ్లక్ వంటి ప్రముఖుల సంబంధం బయటపడడంతో, ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ దందాలో ఇంకా పలువురి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…