పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్ అజ్ఞాతవాసి విడుదలకు ముందు ఒక ఫ్రెంచ్ మూవీ నుంచి స్ఫూర్తి పొంది త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రాసుకున్నారనే దాని పెద్ద దుమారమే రేగింది. 2008లో వచ్చిన లార్గో వించ్ నే పవన్ ఇమేజ్ కి తగ్గట్టు మార్చి తీశారనే ప్రచారం చాలా జోరుగా సాగింది. ఇది ఎంత దాకా వెళ్లిందంటే దర్శకుడు జరోమ్ సల్లే సోషల్ మీడియా వేదికగా వరసబెట్టి కామెంట్లు పెట్టేదాకా. రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న టి సిరీస్ సైతం హారిక హాసినికి నోటీసు పంపిందనే వార్త రావడం అప్పట్లో హాట్ టాపిక్. తర్వాత సమస్య పరిష్కారం కావడం, బొమ్మ ఫ్లాప్ కావడం ఇదంతా గడిచిపోయిన స్టోరీ.
ఇప్పుడు అచ్చం ఇదే సమస్య అజిత్ విదాముయర్చికి వచ్చినట్టు చెన్నై టాక్. 2025 సంక్రాంతి విడుదలకు ఆఘమేఘల మీద రెడీ అవుతున్న ఈ చిత్రం 1997లో వచ్చిన హాలీవుడ్ మూవీ బ్రేక్ డౌన్ కు ఫ్రీ మేకట. ఈ మేరకు ఒరిజినల్ వెర్షన్ నిర్మించిన ప్రొడక్షన్ కంపెనీ నుంచి లైకా సంస్థకు 150 కోట్ల దాకా నష్టపరిహారం డిమాండ్ చేస్తూ నోటీసు వచ్చిందని కోలీవుడ్ రిపోర్ట్స్. అధికారికంగా దీన్ని చెప్పలేదు కానీ పరిశ్రమ వర్గాల్లో దీని గురించి చర్చ జరుగుతోంది. అయితే రోజులు గడుస్తున్నా ఇప్పటిదాకా ఇది అబద్ధమంటూ లేదా నిజమంటూ ఇరువైపులా ఎలాంటి అఫీషియల్ నోట్స్ రాకపోవడం అనుమానం పెంచింది.
ముందు బ్రేక్ డౌన్ కథ చూద్దాం. లాంగ్ డ్రైవ్ వెళ్తున్న హీరో కారు బ్రేక్ డౌన్ అవుతుంది. భార్యను అందులోనే ఉంచి రిపేర్ కోసం వెళ్తాడు. కానీ ఆమె తప్పిపోతుంది. దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి పూనుకుంటాడు. ఈ క్రమంలో అనూహ్య సంఘటనలు జరుగుతాయి. ఊహించని ట్విస్టులు ఎదురవుతాయి. విదాముయర్చి టీజర్ గమనిస్తే ఈ లైన్ కు దగ్గరి పోలికలు కొన్ని కనిపిస్తాయి. మరి ప్రచారం జరుగుతున్నట్టు నిజంగా బ్రేక్ డౌన్ నే విదాముయర్చిగా మార్చారా లేక ఫోటోలు, టీజర్ చూసి ఇలా అనుకున్నారా వేచి చూడాలి. మొత్తం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకున్న విదాముయర్చిలో భార్య పాత్రలో త్రిష నటించింది.
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…