ప్రస్తుతం దేశమంతా పుష్ప వైల్డ్ ఫైర్ రాజుకుంది. రేపు రాత్రి 9.30 గంటల స్పెషల్ షోతో పుష్పగాడి రూల్ మొదలు కాబోతోంది. భారీ అంచనాలతో విడుదలకు ముందే విపరీతమైన హైప్ తెచ్చుకున్న ఈ సినిమా టికెట్ల రేట్ల విషయంలో కూడా ఆ రేంజ్ లోనే హైప్ ఏర్పడింది. బెనిఫిట్ షో పేరుతో 800 రూపాయలు వసూలు చేయడం అన్యాయమని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో నిర్మాతలకు టెన్షన్ పట్టుకుంది. ఈ క్రమంలోనే పుష్ప టీంకు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది.
అధిక టికెట్ ఛార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. సినిమా విడుదలను చివరి నిమిషంలో ఆపలేమని తేల్చి చెప్పింది. దీంతో, పుష్ప టికెట్లు రేట్లు యథాతధంగా పెంచి అమ్ముకునే అవకాశం కలిగింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది. దీంతో, టికెట్ రేట్ల విషయంలో అయినా సరే అస్సలు తగ్గేదేలే అని పుష్పగాడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
బెనిఫిట్ షో పేరుతో 800 రూపాయలు వసూలు చేయడం అన్యాయమని, ఆ డబ్బును ఎక్కడికి మళ్లిస్తున్నారో తెలియాలని, సినిమా విడుదల ఆపాలని పిటిషనర్ సతీష్ కోరారు. దానిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు పుష్ప 2 సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే, బెనిఫిట్ ద్వారా వచ్చే కలెక్షన్ల వివరాలను 2 వారాల్లోపు తమకు తెలియజేయాలని నిర్మాతలను ఆదేశించింది. టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను పరిశీలిస్తామని తెలిపింది.
This post was last modified on December 4, 2024 9:12 am
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…