ప్రస్తుతం దేశమంతా పుష్ప వైల్డ్ ఫైర్ రాజుకుంది. రేపు రాత్రి 9.30 గంటల స్పెషల్ షోతో పుష్పగాడి రూల్ మొదలు కాబోతోంది. భారీ అంచనాలతో విడుదలకు ముందే విపరీతమైన హైప్ తెచ్చుకున్న ఈ సినిమా టికెట్ల రేట్ల విషయంలో కూడా ఆ రేంజ్ లోనే హైప్ ఏర్పడింది. బెనిఫిట్ షో పేరుతో 800 రూపాయలు వసూలు చేయడం అన్యాయమని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో నిర్మాతలకు టెన్షన్ పట్టుకుంది. ఈ క్రమంలోనే పుష్ప టీంకు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది.
అధిక టికెట్ ఛార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. సినిమా విడుదలను చివరి నిమిషంలో ఆపలేమని తేల్చి చెప్పింది. దీంతో, పుష్ప టికెట్లు రేట్లు యథాతధంగా పెంచి అమ్ముకునే అవకాశం కలిగింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది. దీంతో, టికెట్ రేట్ల విషయంలో అయినా సరే అస్సలు తగ్గేదేలే అని పుష్పగాడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
బెనిఫిట్ షో పేరుతో 800 రూపాయలు వసూలు చేయడం అన్యాయమని, ఆ డబ్బును ఎక్కడికి మళ్లిస్తున్నారో తెలియాలని, సినిమా విడుదల ఆపాలని పిటిషనర్ సతీష్ కోరారు. దానిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు పుష్ప 2 సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే, బెనిఫిట్ ద్వారా వచ్చే కలెక్షన్ల వివరాలను 2 వారాల్లోపు తమకు తెలియజేయాలని నిర్మాతలను ఆదేశించింది. టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను పరిశీలిస్తామని తెలిపింది.
This post was last modified on December 4, 2024 9:12 am
షూటింగ్ అయిపోయింది ఇంకే టెన్షన్ లేదని హరిహర వీరమల్లు వెంటనే రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అసలైన సవాల్ విడుదల…
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిపతి, మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి సహా మరికొందరికి తాజాగా నాంపల్లిలోని సీబీఐకోర్టు 7 ఏళ్ల…
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే.…
హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్లో…
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…
పెహల్గామ్ దుర్ఘటన తర్వాత ఇండియా, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో ఊహించడం కష్టంగా ఉంది.…