ప్రస్తుతం దేశమంతా పుష్ప వైల్డ్ ఫైర్ రాజుకుంది. రేపు రాత్రి 9.30 గంటల స్పెషల్ షోతో పుష్పగాడి రూల్ మొదలు కాబోతోంది. భారీ అంచనాలతో విడుదలకు ముందే విపరీతమైన హైప్ తెచ్చుకున్న ఈ సినిమా టికెట్ల రేట్ల విషయంలో కూడా ఆ రేంజ్ లోనే హైప్ ఏర్పడింది. బెనిఫిట్ షో పేరుతో 800 రూపాయలు వసూలు చేయడం అన్యాయమని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో నిర్మాతలకు టెన్షన్ పట్టుకుంది. ఈ క్రమంలోనే పుష్ప టీంకు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది.
అధిక టికెట్ ఛార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. సినిమా విడుదలను చివరి నిమిషంలో ఆపలేమని తేల్చి చెప్పింది. దీంతో, పుష్ప టికెట్లు రేట్లు యథాతధంగా పెంచి అమ్ముకునే అవకాశం కలిగింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది. దీంతో, టికెట్ రేట్ల విషయంలో అయినా సరే అస్సలు తగ్గేదేలే అని పుష్పగాడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
బెనిఫిట్ షో పేరుతో 800 రూపాయలు వసూలు చేయడం అన్యాయమని, ఆ డబ్బును ఎక్కడికి మళ్లిస్తున్నారో తెలియాలని, సినిమా విడుదల ఆపాలని పిటిషనర్ సతీష్ కోరారు. దానిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు పుష్ప 2 సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే, బెనిఫిట్ ద్వారా వచ్చే కలెక్షన్ల వివరాలను 2 వారాల్లోపు తమకు తెలియజేయాలని నిర్మాతలను ఆదేశించింది. టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను పరిశీలిస్తామని తెలిపింది.
This post was last modified on December 4, 2024 9:12 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…