Movie News

రివ్యూలపై కేసు : కోర్టు ఏమందంటే…

సినిమా రివ్యూల విషయంలో తమిళ సినీ పరిశ్రమ ఈ మధ్య చాలా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వేట్టయాన్, కంగువ లాంటి సినిమాలు ప్రతికూల ఫలితాన్ని అందుకోవడానికి రివ్యూలే కారణమని అక్కడి నిర్మాతలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే థియేటర్ల దగ్గర రివ్యూలు ఇవ్వడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని పట్ల మిశ్రమ స్పందన వచ్చింది. సినిమా టాక్ తెలుసుకునే హక్కు ప్రేక్షకులకు ఉందని.. రివ్యూలను ఆపాలనుకోవడం సమంజసం కాదని కొందరంటే.. షో పడీ పడగానే ఇన్‌స్టంట్ రివ్యూలు ఇచ్చి సినిమాను చంపేస్తున్నారని, బాగున్న సినిమాల గురించి కూడా ఎక్కువ నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని.. రివ్యూలకు ఇలా బ్రేక్ వేయడం సరైన నిర్ణయమే అని మరి కొందరన్నారు. ఐతే తమిళ నిర్మాతల మండలి ఇంతటితో ఆగకుండా ఇప్పుడు రివ్యూలను ఆపే విషయంలో మరో అడుగు ముందుకు వేసింది.

సినిమా రిలీజైన తొలి మూడు రోజులు ఇవ్వరూ రివ్యూలు ఇవ్వకుండా ఆపాలంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతూ మద్రాస్ హైకోర్టులో తమిళ నిర్మాతల మండలి పిటిషన్ వేసింది. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలోనూ రివ్యూలు రాకుండా నిషేధం విధించాలని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఐతే సోషల్ మీడియా అనేది ఒక పెద్ద సముద్రం. ఇక్కడ సినిమా టాక్, రివ్యూలు రాకుండా ఆపడం అన్నది అంత తేలికైన విషయం కాదు. సినిమా ఎలా ఉందో తెలుసుకుని థియేటర్లకు వెళ్లే హక్కు ప్రేక్షకులకు ఉంటుంది కాబట్టి రివ్యూలు రాకుండా ఆపడం అన్నది సమంజసంగా అనిపించకపోవచ్చు. కాబట్టి కోర్టు ఈ విషయంలో నిర్మాతల ఆలోచనలను అంగీకరిస్తుందో లేదో చూడాలి. ఈ పిటిషన్‌ను విచారించిన అనంతరం కోర్టు ఏం తీర్పు ఇస్తుందో అని కోలీవుడ్ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.

This post was last modified on December 3, 2024 6:01 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

31 minutes ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

1 hour ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

ఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లు ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. స‌మావేశాల‌ను వారు ప్ర‌త్య‌క్షంగా…

2 hours ago

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

2 hours ago

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

5 hours ago