Movie News

పుష్ప 2 టికెట్ రేట్ల మీద కోర్టులో పిటీషన్

పెద్ద హీరోల సినిమాలు మొదటి రెండు వారాలు చూడటం కష్టమనిపించేలా పుష్ప 2 టికెట్ రేట్లకు విపరీతమైన హైక్ ఇవ్వడం గురించి అన్ని వర్గాల్లోనూ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్ కు ఏకంగా 800 రూపాయలు మంజూరు చేయగా ఆ తర్వాత రోజు నుంచి మల్టీప్లెక్సులకు 200, సింగల్ స్క్రీన్లకు 150 చొప్పున అనుమతి ఇవ్వడంతో ధరలు భారీగా కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉన్నప్పటికీ ఈ ధోరణి పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. అందుకే తాజాగా తెలంగాణ హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలయ్యింది.

ఇంత పెద్ద మొత్తంలో పెంపుని నిరసిస్తూ వేసిన పిటీషన్ రేపు హియరింగ్ కు రానుంది. న్యాయస్థానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే నైజామ్ లో టికెట్ల అమ్మకాలు ఆన్ లైన్ లో పెద్ద ఎత్తున జరిగాయి. వందలాది షోలు హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ కోర్టు ఏమైనా సవరించమని చెబితే పెద్ద ఇబ్బందే. కానీ అలాంటి పరిస్థితి రాకపోవచ్చని టాక్. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి సమస్య వస్తే సమాధానం చెప్పేందుకు అవసరమైన బడ్జెట్ లెక్కలు, ఆధారాలు అన్నీ మైత్రి రెడీగా ఉంచుకుందట. అవి కన్విన్సింగ్ గా ఉంటే చిక్కు లేదు.

ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ ఉండటంతో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో బుకింగ్స్ మొదలుపెట్టలేదు. ఏ క్షణమైనా జిఓ వస్తుందని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. అక్కడా ఇవే రేట్లు ఉంటాయని నిర్మాత నవీన్ చెప్పడం చూస్తే సాంకేతిక ఆలస్యం తప్ప రేట్లు ఫిక్స్ అయిపోయాయని అర్థమవుతోంది. దేవరకు పెంపు ఇచ్చినప్పుడు ఏపీ కోర్టులో పిటీషన్ నమోదయ్యింది. హైక్ ఇచ్చిన రోజులను తగ్గించి తీర్పు వచ్చింది. మరి పుష్ప 2కి అలా ఏమైనా జరుగుతుందో లేక కొట్టివేస్తారో చూడాలి. ప్రతి ప్యాన్ ఇండియా మూవీకి ఇలాంటి చిక్కులు ఇకపై తప్పేలా లేవు.

This post was last modified on December 2, 2024 9:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

19 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago