Movie News

పుష్ప 2 టికెట్ రేట్ల మీద కోర్టులో పిటీషన్

పెద్ద హీరోల సినిమాలు మొదటి రెండు వారాలు చూడటం కష్టమనిపించేలా పుష్ప 2 టికెట్ రేట్లకు విపరీతమైన హైక్ ఇవ్వడం గురించి అన్ని వర్గాల్లోనూ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్ కు ఏకంగా 800 రూపాయలు మంజూరు చేయగా ఆ తర్వాత రోజు నుంచి మల్టీప్లెక్సులకు 200, సింగల్ స్క్రీన్లకు 150 చొప్పున అనుమతి ఇవ్వడంతో ధరలు భారీగా కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉన్నప్పటికీ ఈ ధోరణి పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. అందుకే తాజాగా తెలంగాణ హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలయ్యింది.

ఇంత పెద్ద మొత్తంలో పెంపుని నిరసిస్తూ వేసిన పిటీషన్ రేపు హియరింగ్ కు రానుంది. న్యాయస్థానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే నైజామ్ లో టికెట్ల అమ్మకాలు ఆన్ లైన్ లో పెద్ద ఎత్తున జరిగాయి. వందలాది షోలు హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ కోర్టు ఏమైనా సవరించమని చెబితే పెద్ద ఇబ్బందే. కానీ అలాంటి పరిస్థితి రాకపోవచ్చని టాక్. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి సమస్య వస్తే సమాధానం చెప్పేందుకు అవసరమైన బడ్జెట్ లెక్కలు, ఆధారాలు అన్నీ మైత్రి రెడీగా ఉంచుకుందట. అవి కన్విన్సింగ్ గా ఉంటే చిక్కు లేదు.

ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ ఉండటంతో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో బుకింగ్స్ మొదలుపెట్టలేదు. ఏ క్షణమైనా జిఓ వస్తుందని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. అక్కడా ఇవే రేట్లు ఉంటాయని నిర్మాత నవీన్ చెప్పడం చూస్తే సాంకేతిక ఆలస్యం తప్ప రేట్లు ఫిక్స్ అయిపోయాయని అర్థమవుతోంది. దేవరకు పెంపు ఇచ్చినప్పుడు ఏపీ కోర్టులో పిటీషన్ నమోదయ్యింది. హైక్ ఇచ్చిన రోజులను తగ్గించి తీర్పు వచ్చింది. మరి పుష్ప 2కి అలా ఏమైనా జరుగుతుందో లేక కొట్టివేస్తారో చూడాలి. ప్రతి ప్యాన్ ఇండియా మూవీకి ఇలాంటి చిక్కులు ఇకపై తప్పేలా లేవు.

This post was last modified on December 2, 2024 9:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

5 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

6 hours ago