Movie News

పుష్ప 2 టికెట్ రేట్ల మీద కోర్టులో పిటీషన్

పెద్ద హీరోల సినిమాలు మొదటి రెండు వారాలు చూడటం కష్టమనిపించేలా పుష్ప 2 టికెట్ రేట్లకు విపరీతమైన హైక్ ఇవ్వడం గురించి అన్ని వర్గాల్లోనూ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్ కు ఏకంగా 800 రూపాయలు మంజూరు చేయగా ఆ తర్వాత రోజు నుంచి మల్టీప్లెక్సులకు 200, సింగల్ స్క్రీన్లకు 150 చొప్పున అనుమతి ఇవ్వడంతో ధరలు భారీగా కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉన్నప్పటికీ ఈ ధోరణి పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. అందుకే తాజాగా తెలంగాణ హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలయ్యింది.

ఇంత పెద్ద మొత్తంలో పెంపుని నిరసిస్తూ వేసిన పిటీషన్ రేపు హియరింగ్ కు రానుంది. న్యాయస్థానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే నైజామ్ లో టికెట్ల అమ్మకాలు ఆన్ లైన్ లో పెద్ద ఎత్తున జరిగాయి. వందలాది షోలు హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ కోర్టు ఏమైనా సవరించమని చెబితే పెద్ద ఇబ్బందే. కానీ అలాంటి పరిస్థితి రాకపోవచ్చని టాక్. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి సమస్య వస్తే సమాధానం చెప్పేందుకు అవసరమైన బడ్జెట్ లెక్కలు, ఆధారాలు అన్నీ మైత్రి రెడీగా ఉంచుకుందట. అవి కన్విన్సింగ్ గా ఉంటే చిక్కు లేదు.

ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ ఉండటంతో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో బుకింగ్స్ మొదలుపెట్టలేదు. ఏ క్షణమైనా జిఓ వస్తుందని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. అక్కడా ఇవే రేట్లు ఉంటాయని నిర్మాత నవీన్ చెప్పడం చూస్తే సాంకేతిక ఆలస్యం తప్ప రేట్లు ఫిక్స్ అయిపోయాయని అర్థమవుతోంది. దేవరకు పెంపు ఇచ్చినప్పుడు ఏపీ కోర్టులో పిటీషన్ నమోదయ్యింది. హైక్ ఇచ్చిన రోజులను తగ్గించి తీర్పు వచ్చింది. మరి పుష్ప 2కి అలా ఏమైనా జరుగుతుందో లేక కొట్టివేస్తారో చూడాలి. ప్రతి ప్యాన్ ఇండియా మూవీకి ఇలాంటి చిక్కులు ఇకపై తప్పేలా లేవు.

This post was last modified on December 2, 2024 9:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

2 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

3 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

3 hours ago

లోకేశ్ పై జోగి వివాదాస్పద కామెంట్లు

కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…

4 hours ago

అంబటి ఇంటిపై దాడి… హై టెన్షన్

ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…

4 hours ago

భాగ్య‌న‌గ‌రంలో గ‌న్ క‌ల్చ‌ర్.. డేంజ‌రే!

తెలంగాణ ప్ర‌భుత్వం... పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారుస్తామ‌ని చెబుతున్న హైద‌రాబాద్‌లో గ‌న్ క‌ల్చ‌ర్ పెరుగుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వ్య‌క్తిగ‌తంగా…

4 hours ago