తెలుగు సినిమాల్లో హీరోకు శారీరక లోపం ఉన్నట్లు కానీ.. అంద విహీనంగా కానీ చూపించేవారు కాదు ఒకప్పుడు. కానీ గత దశాబ్ద కాలంలో అంతా మారిపోయింది. హీరోకు లోపం పెట్టడం కూడా ఒక ట్రెండుగా మారింది. రామ్ చరణ్ లాంటి టాప్ హీరోను రంగస్థలం సినిమాలో చెవిటివాడిగా చూపించి పెద్ద షాకే ఇచ్చాడు సుకుమార్. కథలో ఆ లోపం కీలకంగా మారడం.. సినిమాకు కూడా ఓవరాల్గా ప్లస్ కావడం.. ప్రేక్షకులూ బాగా రిసీవ్ చేసుకోవడంతో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని జరిగాయి. తన తర్వాతి చిత్రం పుష్పలో హీరోను గూనివాడిలాగా చూపించాడు సుక్కు. చిన్నతనంలో ఓ చేదు అనుభవం వల్ల హీరో భుజం పైకి వెళ్తుంది. సినిమా అంతా కూడా అలాగే కనిపిస్తాడు అల్లు అర్జున్.
ముందు హీరోను ఇలా చూపించడం ఆడ్గా అనిపించినా.. తర్వాత అలవాటు పడిపోయారు. పాటల్లో ఫైట్లలో.. ఇంకా ప్రతి సీన్లోనూ ఆ లోపాన్ని మెయింటైన్ చేస్తూ చాలానే కష్టపడ్డాడు బన్నీ.ఐతే పుష్ప-2 నుంచి లేటెస్ట్గా రిలీజ్ చేసిన పీలింగ్స్ పాటలో బన్నీలో ఆ లోపం కనిపించలేదు. భుజం కిందికి వచ్చేసి.. మామూలుగానే దర్శనమిచ్చాడు. ఒకప్పట్లా ఈజ్తో స్టెప్స్ వేశారు. మరి ఉన్నట్లుండి ఈ మార్పు ఏంటి అన్నది జనాలకు అర్థం కావడం లేదు. హీరోకు కథలో భాగంగానే ఈ లోపం పోయి మామూలు అయిపోతాడా.. లేక ఇది డ్రీమ్ సాంగ్ కాబట్టి నార్మల్గా కనిపిస్తాడా అన్నది తెలియడం లేదు.
మొత్తంగా టీం హీరోకు ఈ లోపం ఉన్న విషయాన్ని మరిచిపోయి పీలింగ్స్ పాటలో నార్మల్గా చూపించేసిందా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. సుకుమార్ ఇలాంటి విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటాడు. మైన్యూట్ డీటైల్స్ కూడా మరిచిపోడు. సినిమా అంతా క్యారెక్టర్లు ఒకే రకంగా కనిపించేలా.. ప్రవర్తించేలా చూసుకుంటాడు. కంటిన్యుటీ మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. మరి పుష్ప-2 పాటలో మాత్రం ఆ మార్కు ఎలా మిస్ అయిందన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. దీని వెనుక ట్విస్ట్ ఏంటో సినిమాలోనే చూడాలి మరి.
This post was last modified on December 2, 2024 7:06 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…