టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేనంత టికెట్ రేట్ల హైక్ తెచ్చుకున్న పుష్ప 2 ఓపెనింగ్స్ పరంగా రికార్డులు సృష్టించడం ఖాయమనే మాటలో అనుమానం అక్కర్లేదు. నైజామ్ లో సగటు మల్టీప్లెక్స్ టికెట్ రేట్ 530 రూపాయలు ఉన్నా సరే మొదటి రోజు దాదాపు అడ్వాన్స్ హౌస్ ఫుల్స్ కావడం బన్నీ క్రేజ్ కు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ జీవో ఏ క్షణమైనా రావొచ్చు కానీ అది కూడా ఇంచుమించు తెలంగాణ ఇచ్చిన పెంపుకి దగ్గరగా ఉంటుందని ట్రేడ్ టాక్. హిట్ టాక్ వస్తే మాత్రం పుష్పరాజ్ ని పట్టుకోవడం కష్టం. కలెక్షన్ల సునామితో విరుచుకుపడతాడు. ఇప్పుడు సంక్రాంతి సినిమాల కనెక్షన్ ఏంటో చూద్దాం.
పుష్ప 2కి ఇంత వెసులుబాటు దక్కాక ఇకపై రాబోయే ప్యాన్ ఇండియా రిలీజులు అంతే మొత్తాన్ని ఆశిస్తాయి. ఈ వరసలో ముందొచ్చేది గేమ్ ఛేంజర్. నిర్మాత దిల్ రాజు, జీ స్టూడియోస్ దీని మీద మూడు వందల కోట్లకు పైనే ఖర్చు పెట్టారు. ఇంత మొత్తమని బయటికి చెప్పడం లేదు టీజర్ శాంపిల్స్ లోనే ఎంత గ్రాండియరో అర్థమైపోయింది. సో టికెట్ రేట్ల పెంపుకి పర్మిషన్లు అడిగినప్పుడు పుష్ప 2కి ఇచ్చినంతే మాకూ ఇమ్మని అడిగే అవకాశాన్ని కొట్టి పారేయలేం. బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంకు అంత భారీగా కాకపోయినా రెగ్యులర్ గా ఇచ్చే పెంపు కన్నా ఎక్కువే ఇచ్చే ఛాన్స్ ఉంది.
కాకపోతే పుష్ప 2 ఫలితం, ఫైనల్ గా ఎంత వసూలు చేస్తుందనే లెక్కల మీద ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఒకవేళ రాజమౌళి రికార్డులు కనక బద్దలైతే ఇకపై టయర్ 1 హీరోలు వాటి మీద కన్నేస్తారు. రేట్ల పెంపు కలెక్షన్ ఫిగర్ల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి అది ఎంత మొత్తమనేది భవిష్యత్తులో డిస్ట్రిబ్యూటర్లు పెట్టే పెట్టుబడిని శాశిస్తుంది. మూడు టికెట్ల సొమ్ముని ఇప్పుడు ఒక్క ప్రేక్షకుడి నుంచే రాబట్టుకోవడం ద్వారా మొదటి రోజు నెంబర్లు ఊహలకు అందని విధంగా ఉండబోతున్నాయి. సంక్రాంతి రిలీజులకు సైతం ఇదే తరహాలో ప్రభుత్వాలు వరాలు కురిపిస్తే నిర్మాతలకు పండగే పండగ.
This post was last modified on December 2, 2024 5:35 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…