ఖాళీ సమయం దొరికితే చాలు కొందరి మేధాశక్తిని ఋజువు చేసుకోవడానికి సినిమాలు తప్ప వేరే సబ్జెక్టు ఉండదు. సరైన వాళ్ళు తగిలితే తప్ప వీళ్ళ నోటికి అడ్డుకట్ట వేయలేం. ఎక్స్ లో ది బ్యాడ్ డాక్టర్ అనే హ్యాండిల్ కు లక్షకుపైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఈయనకు హఠాత్తుగా సౌత్ ఇండియన్ సినిమాల మీద చులకన అభిప్రాయం కలిగింది. వెంటనే ట్వీట్ పెట్టాడు. దాని సారాంశం ఇది. దక్షిణాది చిత్రాల్లో ఫార్ములా ఏంటంటే శుచీ శుభ్రత లేని చిన్న వ్యక్తి ఆత్మనూన్యతతో బాధపడుతూ ప్రేమించిన అమ్మాయి కోసం పది వేల మల్లయోధులను మట్టి కరిపిస్తాడు. దేనికయ్యా అంటే స్వంత తెలివి లేని అందమైన ప్రియురాలిని పడగొట్టేందుకు.
ఇది సదరు ఇంటలెక్చువల్ గారి తెలివి. దీన్ని చూసిన అడివి శేష్ స్పందిస్తూ ఇలా వివక్షతో కామెంట్ చేయొద్దంటూ, కావాలంటే తమ సినిమాలకు అమెరికా,జపాన్ లాంటి దేశాల్లో వస్తున్న స్పందన చూసి తెలుసుకోమని చురక వేశాడు. నిజానికి పైన చెప్పిన సదరు వ్యక్తి పుష్ప 2 ది రూల్ కొస్తున్న మేనియా చూస్తూ దుగ్ధతోనే పెట్టినట్టు అర్థమవుతోంది. దీనికి కామెంట్లు కూడా గట్టిగానే వస్తున్నాయి. కేవలం దెయ్యాలను నమ్ముకుని మాస్ సినిమాని చంపేసిన బాలీవుడ్ డొల్లతనం విస్మరించి ఇలా తెలుగు తమిళ దర్శకులు హీరోల మీద ఏడుపు ఎందుకంటూ ఫుల్లుగా ఎదురుదాడి కౌంటర్లు వేస్తున్నారు.
ఈ రకమైన అసూయ ఇప్పటిది కాదు. బాహుబలి నుంచే మొదలైంది. ఒక డబ్బింగ్ వెర్షన్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం ముంబై పెద్దలకు జీర్ణం కాలేదు. తర్వాత ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, కాంతారలాంటివి సరికొత్త మైలురాళ్ళు సృష్టించాయి. పుష్ప 2కి హిందీలో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ మెంటల్ మాసనిపించేలా ఉన్నాయి. రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. హనుమాన్ కి దేశదేశాల్లో జేజేలు పలికారు. మహారాజా చైనాలో మతిపోయే కలెక్షన్లు సాధిస్తోంది. ఈ ఫీట్లేవి ఉత్తరాది మేకర్స్ కి సాధ్యం కావడం లేదు. ఏదేమైనా అడివి శేష్ ఇచ్చిన స్లిప్పర్ షాట్ మాత్రం పేలిపోయేలా ఉంది.
This post was last modified on December 2, 2024 1:48 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…