ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ నుంచి మరో పాట వచ్చేసింది. కోచిలో జరిగిన ఈవెంట్ లో అల్లు అర్జున్ దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అన్ని భాషల్లో తొలి కొన్ని లైన్లు మలయాళంలోనే ఉంటాయని, ఇది కేరళ ఆర్మీ ఫ్యాన్స్ కి ఇస్తున్న కానుకని చెప్పడంతో అంచనాలు మరింత పెరిగాయి. సూసేకి అగ్గిరవ్వను మించి ఈ పీలింగ్స్ ఉంటుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా కనిపించింది. మొన్న వదిలిన ప్రోమో కొన్ని సెకండ్లే అయినప్పటికీ సోషల్ మీడియాలో ఇట్టే వైరలైపోయింది. ఇప్పుడీ పీలింగ్స్ అనే ఊతపదం ఫుల్ మీల్స్ ఫీలింగ్ ఇచ్చేలా ఉంది.
ఆరింటికి ఓసారి, ఏడింటికోసారి, ఇలా గంటగంటకు వెంటపడే ప్రేమించే మొగుడితో పడే తిప్పల్ని గీత రచయిత చంద్రబోస్ వర్ణించిన తీరు వెరైటీగా ఉంది. మాములుగా లిరికల్ వీడియోలంటే కేవలం స్టిల్స్ మాత్రమే పొందుపరుస్తారు. దానికి భిన్నంగా ఏకంగా రెండు నిమిషాల పాటు ఒరిజినల్ వీడియోని ఇవ్వడం పుష్ప 2 మీద టీమ్ కున్న నమ్మకానికి నిదర్శనం. రష్మిక మందన్నను ఎత్తుకుని అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు బాగున్నాయి. రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన నృత్యరీతులు కనెక్టయ్యేలా ఉన్నాయి. అయితే వినగానే ఎక్స్ ట్రాడినరి కాదు కానీ స్లో పాయిజన్ లా ఎక్కడం జరగుతుంది.
జాతర పాట మినహాయించి పుష్ప 2 ఆడియో ఆల్బమ్ లోని అన్ని పాటలు వచ్చేసినట్టే. దాన్ని స్పెషల్ సర్ప్రైజ్ గా థియేటర్లోనే ఎక్స్ పీరియన్స్ చేయాలి కాబోలు. పుష్ప 1 ది రైజ్ తో పోలిస్తే దాని స్థాయిలో ఇందులో సాంగ్స్ ఉన్నాయా అంటే పెద్ద తెరమీద అనుభూతి చెందాక కానీ చెప్పలేం కాబట్టి కొంచెం వేచి చూడాలి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే వైల్డ్ ఫైర్ అనిపిస్తున్న పుష్ప 2 కోసం డిసెంబర్ 4 రాత్రి సెకండ్ షో ప్రీమియర్లు రెడీ అవుతున్నాయి. దేవర తర్వాత మళ్ళీ అంతకుమించిన జనాల హడావిడి థియేటర్ల దగ్గర కనిపించనుంది. ఏడాది చివర్లో పుష్పరాజ్ చేయబోయే అరాచకం మాములుగా అయితే ఉండదు.
This post was last modified on December 1, 2024 6:40 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…