సోషల్ మీడియా జమానాలో హీరోలు దర్శకులు ఒకరిమీద ఒకరు పంచులు, జోకులు వేసుకోవడానికి నేరుగా కలుసుకోనవసరం లేదు. ఎక్స్ లో అకౌంట్ ఉంటే చాలు. కాకపోతే కొన్నిసార్లు ట్రెండ్ కు తగ్గట్టు వాళ్ళు చేసే హాస్యం అభిమానులకు మంచి టైం పాసవుతుంది. విషయానికి వస్తే తేజ సజ్జ తనకు హనుమాన్ విషయంలో వచ్చిన గొప్ప ప్రశంస రణ్వీర్ సింగ్ నుంచి వచ్చిందంటూ అతనితో కలిసి దిగిన ఒక ఫోటో పెట్టాడు. దానికి ప్రశాంత్ వర్మ బదులిస్తూ పిక్ క్రెడిట్స్ ఎక్కడని అడిగాడు. అంటే అక్కడ ఉద్దేశం ఫోన్ లో ఫోటో తీసింది నేనే కదా, దర్శకుడిగా నా గురించి చెప్పాలి కదాని. తేజ వెంటనే రెస్పాండ్ అయ్యాడు.
హుష్ వచ్చేశాడు అంటూ బ్రహ్మానందం ఎమోజి ఒకటి ట్వీట్ చేశాడు. తిరిగి ప్రశాంత్ వర్మ స్పందిస్తూ మనకి ఏం కావాలన్నా మనమే అడిగి తీసుకోవాలని ఒక తెలివైన మనిషి చెప్పాడని కోట్ చేస్తూ పంచు వేశాడు. వెంటనే నెటిజెన్లకు ఇది దేవిశ్రీ ప్రసాద్ ని ఉద్దేశించేనని అర్థమైపోయింది. పుష్ప 2 సాంగ్ లాంచ్ ఈవెంట్ లో క్రెడిట్స్ గురించి దేవి మాట్లాడుతూ ఏదైనా సరే అడిగి తీసుకోవాలంటూ అతను చేసిన కామెంట్స్ ఎంత వైరలయ్యాయో చూశాం. దేవికి నిర్మాతలకు మధ్య విభేదాలు ఉన్నాయనే తరహాలో చాలా కథనాలు వచ్చాయి. తర్వాత నిర్మాత రవిశంకర్ అదేమీ లేదంటూ క్లారిటీ ఇవ్వడం తర్వాత స్టోరీ.
మొత్తానికి ప్రశాంత్ వర్మ కౌంటరనాలో లేక పంచనాలో కానీ బాగానే పేలింది. హనుమాన్ తర్వాత మోక్షజ్ఞ డెబ్యూ మూవీ మీద పని చేస్తున్న ఈ క్రేజీ దర్శకుడు ఇటీవలే రిషబ్ శెట్టి జై హనుమాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవి కాకుండా సినిమాటిక్ యునివర్స్ ని విస్తరించే క్రమంలో ఇతర దర్శకులతో కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్నాడు. ప్రభాస్ తో హోంబాలే ఫిలింస్ ఒక ప్యాన్ ఇండియా మూవీ చేస్తుందనే ప్రచారం జరిగింది కానీ తర్వాత దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఉండకపోవచ్చనే టాక్ కూడా ఉంది. దేని సంగతి ఎలా ఉన్నా మోక్షజ్ఞ మూవీ మీద మాత్రం అంచనాలు తీవ్రంగా ఉన్నాయి.
This post was last modified on December 1, 2024 6:11 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…