కెరీర్ పరంగా గుంటూరు కారం, ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం ప్రయోజనం కలిగించనప్పటికీ లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బస్టర్ లో హీరోయిన్ గా నటించడం మీనాక్షి చౌదరి మార్కెట్ ని పెంచింది. అయితే ఇందులో పోషించిన పాత్రే తనను ఇప్పుడు భయపెడుతోందట. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ప్రశ్నకు సమాధానమిస్తూ లక్కీ భాస్కర్ లో భార్య, పిల్లాడి తల్లిగా నటించడం పట్ల స్నేహితులు, బంధువులు భయపెట్టారని, ఇంత తక్కువ వయసులో ఇలాంటివి చేస్తే రాబోయే రోజుల్లో ఈ తరహా క్యారెక్టర్లే వస్తాయని చెప్పారట. దీంతో ఇకపై కథ ఎంత నచ్చినా సరే వైఫ్, మదర్ రోల్స్ కి ససేమిరా నో చెప్పేస్తానని అంటోంది.
ఇది కొంత వరకు కరెక్టే అయినా మరీ అంత గుడ్డిగా ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహానటి లాంటి హెవీ ఎమోషనల్ మూవీలో కీర్తి సురేష్ ఏకంగా వయసు మళ్ళాక చనిపోయే పాత్ర చేసింది. అలాని స్టార్ హీరోలు పిలవకుండా లేరు. ఇది హిట్టయ్యాకే మహేష్ బాబు, విక్రమ్, వరుణ్ ధావన్ లాంటివాళ్ళతో జట్టుకట్టే ఆఫర్లు వచ్చాయి. గతంలో సౌందర్య పెళ్లి చేసుకుందాంలో రేప్ బాధితురాలిగా చేశాక కూడా చిరంజీవి, రజనీకాంత్ ఆఫర్లు వచ్చాయి. సో మీనాక్షి చౌదరి భయంలో న్యాయముంది కానీ కెరీర్ ప్రారంభంలో కొంత ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన అవసరముంది.
ఇటీవలే రిలీజైన రెండు సినిమాలు మీనాక్షి చౌదరికి నిరాశే మిగిల్చాయి. వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ కనీసం యావరేజ్ అనిపించుకోలేకపోయాయి. ఇప్పుడు తన దృష్టి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మీద ఉంది. అయితే ఇందులో సీనియర్ హీరో మాజీ ప్రియురాలిగా నటించడం ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కాబట్టి దర్శకుఢు అనిల్ రావిపూడి ఇచ్చే కామెడీ మాస్ కోటింగ్ తన మీద ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. జనవరి 14 థియేటర్లలో అడుగు పెట్టబోతున్న ఈ ఎంటర్ టైనర్ కనక బ్లాక్ బస్టర్ అయితే తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేయొచ్చు.
This post was last modified on December 1, 2024 5:14 pm
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…