సంవత్సరంలో ప్రతి నెల కనీసం ఏదో ఒక హిట్టు ఉంటే థియేటర్ల ఫీడింగ్ కు బాగుంటుంది. అలా కాకుండా ముప్పై రోజులు ఫ్లాపులతో నిండిపోతే అంతకు ముందు దీపావళి సినిమాలతో సరుకోవాల్సి ఉంటుంది. ఈసారి అదే జరిగింది. నవంబర్ మరీ నీరసంగా గడిచిపోవడం బయ్యర్లను కుదిపేసింది. అక్టోబర్ చివర్లో వచ్చిన అమరన్, క, లక్కీ భాస్కర్ లు వేసుకున్న థియేటర్లలు రెండు మూడు వారాలు నిక్షేపంగా గడిపేశాయి కానీ మిగిలిన స్క్రీన్లు మాత్రం కలెక్షన్ల కోసం ఆలో లక్ష్మణా అనాల్సి వచ్చింది. దీనికి తోడు పుష్ప 2 ది రూల్ ఫీవర్ ముందే మొదలైపోవడంతో జనాలు థియేటర్లకు దూరంగా ఉన్నారు.
ముందు బోణీ జరిగింది నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’తో. ఏళ్ళ తరబడి లేట్ అవుతూ వచ్చిన చివరికి అసలు రిలీజైన సంగతే గుర్తు లేనంతగా డిజాస్టరై వెళ్ళిపోయింది. ఆపై వారం ‘కంగువా’ అంచనాలు పూర్తిగా నీరుగార్చేసి సూర్య కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. వరుణ్ తేజ్ ‘మట్కా’ మరీ అన్యాయం. హీరోని మోసం చేసిన డైరెక్టర్లు హిట్టవ్వలేదంటూ పెద్ద కామెంట్ చేసిన దర్శకుడు కరుణ కుమార్ ఆయన అదే రిపీట్ చేయడం ట్రాజెడీ. మూడో వారంలో విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ ప్రమోషన్లలో చాలా సౌండ్ చేశాడు కానీ కేవలం సెకండాఫ్ ట్విస్టులను నమ్ముకోవడం ప్రేక్షకులను మెప్పించలేదు.
మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా ‘దేవకీనందన వాసుదేవ’ రెండో రోజే చేతులు ఎత్తేయగా సత్యదేవ్ ‘జీబ్రా’ కొంచెం డీసెంట్ అనిపించుకుంది కానీ అదరహో అనిపించే స్థాయిలో పికప్, కలెక్షన్లు చూపించలేదు. ఉన్నంతలో కొంచెం బెటర్ అంతే. నెలాఖరులో వచ్చిన చిన్న సినిమాలేవీ ఆడియన్స్ దృష్టిలో పడలేదు. యూత్ లో ‘రోటి కపడా రొమాన్స్’ కొంత సౌండ్ చేసినా సక్సెస్ కొట్టడానికి అది సరిపోలేదు. ఇదంతా పుష్ప 2 ప్రభావమా లేక సరైన కంటెంట్ లేని ఫలితామా అంటే రెండూ పేర్కొనక తప్పదు. సాధారణంగా డ్రైగా ఉండే నవంబర్ కు ఈసారి సరైన సినిమా లేకపోవడం శరాఘాతంగా మారింది.
This post was last modified on December 1, 2024 5:09 pm
'ఫౌజీ' సినిమా నుంచి ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్లు చూస్తుంటే మేకర్స్ ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమవుతోంది. ప్రభాస్ ను సాఫ్ట్…
ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…