భోళా శంకర్ ఇచ్చిన షాక్ దెబ్బకు ముందు ఒప్పుకున్న సినిమాను పక్కనపెట్టి మరీ విశ్వంభర ఒప్పుకున్న చిరంజీవి ఈసారి కథలను ఓకే చేసే విషయంలో దూకుడు చూపించడం లేదు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అయిదారుగురు మార్కెట్ ఉన్న దర్శకులు కలిసినప్పటికీ స్క్రిప్ట్ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే 5జి జనరేషన్ కుర్ర డైరెక్టర్లతో మెగాస్టార్ చేతులు కలపాలన్న ఫ్యాన్స్ కోరిక తీరేలా ఉంది. నాని దసరాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలకు చిరు ఆమోదం తెలిపినట్టు ఫిలిం నగర్ అప్డేట్. ప్యారడైజ్ అయ్యాక ఇది సెట్స్ పైకి వెళ్తుందట.
వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినిదత్ నిర్మిస్తారని టాక్. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ అంతర్గతంగా అంగీకారం జరిగిందని సమాచారం. శ్రీకాంత్ ఓదెల చిరుకి వీరాభిమాని. ఎంతగా ఆంటే మెగాస్టార్ పుట్టినరోజు ట్వీట్లు, ఇంటర్వ్యూలు చూస్తే అర్థమైపోతుంది. దసరా ఓపెనింగ్ సీన్ లో వచ్చే కల్లు కాంపౌండ్ ఎపిసోడ్ టీవీలో చూపించేది చిరంజీవి పాటే. పలు చోట్ల రెఫరెన్సులు వాడుతూనే వచ్చాడు. అంత ఫ్యానిజం ఉన్న శ్రీకాంత్ ఓదెల నిజంగా తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఏ స్థాయిలో ఎలివేట్ చేస్తాడో వేరే చెప్పాలా. కాకపోతే ప్రాజెక్టు మొదలవ్వడానికి ఆరేడు నెలలు పైనే పడుతుంది.
విశ్వంభర తప్ప చిరంజీవి ఇప్పటిదాకా ఏ కొత్త సినిమా ప్రకటించలేదు. నెమ్మదిగా అయినా పర్వాలేదు బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ ఓదెల చెప్పిన ఒక లైన్ బ్రహ్మాండంగా నచ్చి డెవలప్ చేయమని చెప్పారట. మాస్ టేకింగ్ తో కొత్తగా ఆలోచించే శ్రీకాంత్ ఎలాంటి స్టోరీ రాసుకున్నాడో వేచి చూడాలి. ది ప్యారడైజ్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ కుర్ర దర్శకుడు ఎప్పుడూ చూడనంత వయొలెంట్ అవతారంలో నానిని ప్రెజెంట్ చేయబోతున్నాడు. బడ్జెట్ కూడా వంద కోట్లపైనే ఖర్చు పెడుతున్నారు. వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి రిలీజ్ అనుకుంటున్నారు.
This post was last modified on December 1, 2024 4:06 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…