ఈ మధ్య కాలంలో తమిళంలో ఊహించని విజయం సాధించిన సినిమా అంటే.. ‘అమరన్‘యే. శివకార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ పెరియస్వామి రూపొందించిన చిత్రమిది. ముకుంద్ వరదరాజన్ అనే దివంగత సైనికుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు వదిలిన అమర వీరుడాయన. ఇలాంటి కథలో బాలీవుడ్లోనే కాక సౌత్ ఇండియాలోనూ వచ్చాయి. ‘మేజర్’ కూడా ఆ కోవలోనిదే. ఐతే ‘అమరన్’ చిత్రాన్ని చాలా హృద్యంగా, ఎమోషనల్గా తీర్చిదిద్దిన రాజ్ కుమార్ ప్రేక్షకుల మనసులు దోచాడు.
శివకార్తికేయన్, సాయిపల్లవిల అద్భుత నటన కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. మామూలుగా ఇలాంటి రియల్ లైఫ్ బయోపిక్లకు ఓ మోస్తరు వసూళ్లే వస్తుంటాయి. కానీ ‘అమరన్’ ఏకంగా రూ.300 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది. దర్శకుడి మీద సర్వత్రా ప్రశంసలు కురిశాయి.తాజాగా దళపతి విజయ్ కూడా రాజ్ కుమార్ను పిలిచి అభినందించాడు. విజయ్ స్థాయి హీరో ఇలా చేయడం ఆసక్తి రేకెత్తించింది. ఈ కలయిక గురించి రాజ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘అయరన్’ సినిమా కనుక ముందు రిలీజై ఉంటే.. మన ఇద్దరం కలిసి సినిమా చేసేవాళ్లమని విజయ్ అన్నట్లు అతను వెల్లడించాడు.
పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్న తాను.. చివరి చిత్రాన్ని ఇప్పటికే కన్ఫమ్ చేసేశానని.. కాబట్టి ఇప్పుడు కలిసి సినిమా చేయడానికి అవకాశం లేదని విజయ్ చెప్పినట్లు రాజ్ కుమార్ తెలిపాడు. ఆ మాట చెప్పాక తనతో ఫొటో దిగి, ప్రౌడ్ ఆఫ్ యు అని చెప్పానని.. విజయ్తో కలిసి సినిమా చేసే అవకాశం వచ్చి ఉంటే గొప్పగా ఉండేదని రాజ్ కుమార్ తెలిపాడు. ‘అమరన్’ ఇంకో నాలుగు రోజుల్లో నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్కు రాబోతోంది.
This post was last modified on November 30, 2024 5:17 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…