మూవీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ప్రీమియర్ షోలు, టికెట్ రేట్లకు సంబంధించిన తెలంగాణ అనుమతులు, పెంపులు వచ్చేసాయి. ఈ మేరకు అధికారిక జిఓ విడుదల చేశారు. ఇప్పటిదాకా ఏ టాలీవుడ్ మూవీకి ఇవ్వనంత హైక్ ఇవ్వడం విశేషం. బడ్జెట్, హైప్, ప్యాన్ ఇండియా క్రేజ్ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న సర్కార్ ధారాళంగా ఆలోచించింది. డిసెంబర్ 4 రాత్రి 9.30 కే తొలి షో వేసుకోవడానికి పర్మిషన్ వచ్చింది. అయితే ఈ ఒక్క ఆటకు మాత్రం 800 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే సగటున సింగల్ స్క్రీన్ కు 1121 రూపాయలు, మల్టీప్లెక్సుకు 1239 రూపాయలు కావొచ్చు.
డిసెంబర్ 5 అర్ధరాత్రి 1 గంట ఆపై తెల్లవారుఝామున 4 గంటలకు కలిపి ఎక్స్ ట్రా రెండు షోలకు అనుమతి ఇచ్చారు. మొదటి నాలుగు రోజులు అంటే ఎనిమిదో తేదీ దాకా సింగల్ స్క్రీన్లు అదనంగా 150 మల్టీప్లెక్సులు 200 రూపాయలు, తొమ్మిదో తేదీ నుంచి పదహారు వరకు సింగల్ స్క్రీన్లు అదనంగా 105 మల్టీప్లెక్సులు 150 రూపాయలు వసూలు చేసుకోవచ్చు. ఆ తర్వాత పదిహేడు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు సింగల్ స్క్రీన్లు అదనంగా 20 మల్టీప్లెక్సులు అదనంగా 50 రూపాయలు తీసుకోవచ్చు. అంటే పంతొమ్మిది రోజుల పాటు పుష్ప 2ని రెగ్యులర్ గా ఉండే రేట్లతో చూడటం సాధ్యం కాదన్న మాట. సో రికార్డు నెంబర్లు ఖాయం.
ఏ క్షణమైనా బుకింగ్స్ తెరిచేందుకు పేటిఎం, బుక్ మై షోతో పాటు కొత్తగా జొమాటో ప్రారంభించిన డిస్ట్రిక్ట్ యాప్ సిద్ధమవుతున్నాయి. రేట్లను సవరించిన వెంటనే అమ్మకాలు మొదలుపెట్టబోతున్నారు. హిందీలో ఇప్పటికే అమ్మకాలు షురూ కాగా గంటకు 8 వేల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. నిమిషాల వ్యవధిలోనే కోటి గ్రాస్ నమోదైపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముందు రోజు షో చూసే ఛాన్స్ ఉండటంతో అల్లు అర్జున్ అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఇకపై రోజుల తరబడి సోషల్ మీడియాలో రికార్డుల గురించి మాట్లాడుకుంటూ అలసిపోయేలా ఉన్నారు.
This post was last modified on November 30, 2024 4:39 pm
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా…
ఓజిలో విలన్ గా పరిచయమైన ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు బాలీవుడ్ సోలో హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన వైనం…
కొందరు నిర్మాతలకు కాకతాళీయంగా జరిగేవే అయినా కొన్ని సంఘటనల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. నాగవంశీకి ఇది బాగా అనుభవం. లక్కీ…