పవన్ కళ్యాణ్ను దాదాపు ఏడాది నుంచి ఎవ్వరూ పవర్ స్టార్ అని పిలవట్లేదు. ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నపుడే పేరు పక్కన ఆ ట్యాగ్ కనిపిస్తుంది. ఐతే ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసమని ఆయన ఏడాది కిందటే సినిమాలన్నీ పక్కన పెట్టేశారు. పూర్తి స్థాయిలో జనసేనానిగా మారిపోయి ఎన్నికల రణరంగంలో తలపడ్డారు. ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడు. దీంతో ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర్నుంచి ఆయన్ని డీసీఎం అనే ట్యాగ్తోనే పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు పవన్ మళ్లీ ‘పవర్ స్టార్’ అవతారం ఎత్తుతున్నాడు. రాజకీయాల కోసం పక్కన పెట్టేసిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయడానికి పవన్ నిర్ణయించుకున్నారు.
ముందుగా ఆయన ‘హరిహర వీరమల్లు’ సినిమా పనిని పున:ప్రారంభిస్తున్నారు. పవన్ ఈ సినిమా చివరి దశ షూటింగ్లో పాల్గొంటున్నట్లు ఈ చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. నిన్నటిదాకా కనిపించిన గడ్డం లుక్లోనే పవన్ షూటింగ్కు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ విడుదల కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైంది క్రిష్ దర్శకత్వంలో కాగా.. పవన్ రాజకీయాలు, వేరే చిత్రాల్లో బిజీ అవడం, ఈ సినిమా మరీ ఆలస్యం అవుతుండడంతో ఆయన చివరి దశలో తప్పుకున్నాడు.
మిగతా సినిమాను పూర్తి చేసే బాధ్యతను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. తన దర్శకత్వంలోనే చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చూస్తూనే కొంత వీలు చేసుకుని పవన్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. మరో పెండింగ్ మూవీ ‘ఓజీ’ని కూడా త్వరగానే పూర్తి చేయాలని పవన్ చూస్తున్నాడు. హరీష్ శంకర్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు మాత్రం ఇప్పట్లో డేట్లు ఇచ్చేలా కనిపించడం లేదు పవన్.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…