పవన్ కళ్యాణ్ను దాదాపు ఏడాది నుంచి ఎవ్వరూ పవర్ స్టార్ అని పిలవట్లేదు. ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నపుడే పేరు పక్కన ఆ ట్యాగ్ కనిపిస్తుంది. ఐతే ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసమని ఆయన ఏడాది కిందటే సినిమాలన్నీ పక్కన పెట్టేశారు. పూర్తి స్థాయిలో జనసేనానిగా మారిపోయి ఎన్నికల రణరంగంలో తలపడ్డారు. ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడు. దీంతో ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర్నుంచి ఆయన్ని డీసీఎం అనే ట్యాగ్తోనే పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు పవన్ మళ్లీ ‘పవర్ స్టార్’ అవతారం ఎత్తుతున్నాడు. రాజకీయాల కోసం పక్కన పెట్టేసిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయడానికి పవన్ నిర్ణయించుకున్నారు.
ముందుగా ఆయన ‘హరిహర వీరమల్లు’ సినిమా పనిని పున:ప్రారంభిస్తున్నారు. పవన్ ఈ సినిమా చివరి దశ షూటింగ్లో పాల్గొంటున్నట్లు ఈ చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. నిన్నటిదాకా కనిపించిన గడ్డం లుక్లోనే పవన్ షూటింగ్కు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ విడుదల కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైంది క్రిష్ దర్శకత్వంలో కాగా.. పవన్ రాజకీయాలు, వేరే చిత్రాల్లో బిజీ అవడం, ఈ సినిమా మరీ ఆలస్యం అవుతుండడంతో ఆయన చివరి దశలో తప్పుకున్నాడు.
మిగతా సినిమాను పూర్తి చేసే బాధ్యతను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. తన దర్శకత్వంలోనే చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చూస్తూనే కొంత వీలు చేసుకుని పవన్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. మరో పెండింగ్ మూవీ ‘ఓజీ’ని కూడా త్వరగానే పూర్తి చేయాలని పవన్ చూస్తున్నాడు. హరీష్ శంకర్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు మాత్రం ఇప్పట్లో డేట్లు ఇచ్చేలా కనిపించడం లేదు పవన్.
వైసిపి నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరిన మాజీమంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పరిస్థితి అగమ్య గోచరంగా…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో…
పెద్ది వీకెండ్ ఘనంగా పూర్తి చేసుకుంది. టాక్స్, రివ్యూస్, కాంట్రావర్సీ సంగతి ఎలా ఉన్నా జనం థియేటర్లకు పోటెత్తిన మాట…
అందరూ సవాళ్లు రువ్వుతున్నారు.. తాను మాత్రం తక్కువ తిన్నానా.. అని అనుకున్నారో ఏమో.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు.. ఆసక్తికర…
ఇంకో మూడు రోజుల్లో జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు రానుంది. ఈసారి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు రెడీ…
బాహుబలి సినిమాను అప్పట్లో టాలీవుడ్ను మించి బాలీవుడ్యే ఎక్కువగా మోసింది. అందుక్కారణం అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ఆ చిత్రాన్ని…