‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్కు పెద్ద షాకే ఇచ్చాడు బుచ్చిబాబు సానా. షాకింగ్ ట్విస్టుతో లవ్ స్టోరీ తీసి.. ప్రేక్షకులను ఉర్రూతలూగించి.. కొత్త హీరో హీరోయిన్లు నటించిన సినిమాతో ఏకంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొట్టి అతను సంచలనం రేపాడు. ఇలా పెద్ద హిట్టుతో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడికి వెంటనే అవకాశాలు వస్తాయి. హడావుడిగా ఏ ఛాన్స్ వస్తే దాన్ని ఒప్పేసుకుని సినిమా చేసేస్తుంటారు. కానీ బుచ్చిబాబు మాత్రం ఆలస్యమైనా సరే.. ఒక పెద్ద స్టార్తోనే సినిమా చేయాలని చాన్నాళ్లు ఎదురు చూశాడు.
ముందు ఎన్టీఆర్తో సినిమా అనుకుంటే కొన్ని కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. అది మిస్సయినా సరే.. రామ్ చరణ్తో సినిమా ఓకే అయి తన కెరీర్ను ఒకేసారి చాలా మెట్లు ఎక్కించేసింది. ‘గేమ్ చేంజర్’ ఆలస్యం కావడం వల్ల ఈ చిత్రం పట్టాలెక్కడంలో ఆలస్యం జరిగిప్పటికీ ఈ మూవీ మీద ప్రేక్షకుల్లో అంచనాలు మాత్రం మామూలుగా లేవు. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్లబోతోంది.చిత్రీకరణ మొదలు కాబోతుండగా.. కాస్టింగ్ కూడా దాదాపుగా ఓకే అయిపోయింది. ‘మీర్జా పూర్’ సిరీస్లో మున్నా పాత్రతో మాంచి పాపులారిటీ సంపాదించిన దివ్యేందు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బహుశా అతడిది నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టరే కావచ్చు. అంతకంటే ముందు జగపతిబాబును కూడా ముఖ్య పాత్రకు తీసుకున్నాడు బుచ్చి. ఆయనే మెయిన్ విలన్ కావచ్చు.
ఇక ‘దేవర’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్.. ఈ చిత్రంలో కథానాయికగా చాన్నాళ్ల ముందే ఖరారైంది. ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్థాయిలో చరణ్ మంచి పాపులారిటీ సంపాదించాడు. ఇప్పుడు జాన్వి, దివ్యేందు లాంటి ఆర్టిస్టులు తోడవడం.. దేశం మొత్తానికి తెలిసిన ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడంతో ఈ చిత్రానికి అసలైన పాన్ ఇండియా రంగు వచ్చేసింది. ఇది పక్కా మాస్ సినిమా అని.. కానీ కథ మాత్రం కొత్తగా ఉంటుందని.. చరణ్ కెరీర్ను వేరే లెవెల్కు తీసుకెళ్లే సినిమా అని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ ఉమ్మడిగా నిర్మించనున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కావచ్చని తెలుస్తోంది.
This post was last modified on November 30, 2024 2:00 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…