మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సి 16 కీలక షెడ్యూల్ పరుగులు పెడుతోంది. మైసూర్ లో జరుగుతున్న షూటింగ్ లో ప్రధాన తారాగణానికి సంబంధించిన సన్నివేశాలతో పాటు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. విడుదల ఇంకా చాలా దూరం ఉన్నప్పటికీ అప్డేట్స్ ఇవ్వడంలో బుచ్చిబాబు టైం తప్పడం లేదు. క్యాస్టింగ్ ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ అభిమానులకు జోష్ ఇస్తున్నాడు. తాజాగా విలన్లలో ఒకరిగా నటిస్తున్న దివ్యేందు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ద్వారా స్వీట్ షాక్ ఇచ్చాడు. ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉంది.
మిర్జాపూర్ వెబ్ సిరీస్ లో పరమ దుర్మార్గుడైన మున్నాగా నటించింది దివ్యేందునే. ముందు వెనుక చూడకుండా మనుషుల్ని చంపేస్తూ, పచ్చి బూతులతో అవతలి వాళ్ళ మీద విరుచుకుపడే క్యారెక్టర్ లో యూత్ కి పిచ్చిపిచ్చిగా నచ్చేశాడు. ముఖ్యంగా అతని మ్యానరిజంకి వీర ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడీ మున్నానే రామ్ చరణ్ కోసం విలన్ గా మారుతున్నాడు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం బుచ్చిబాబు ఫేవరేట్ క్యారెక్టర్ అనిపించుకునే రేంజ్ లో దివ్యేందుని డిజైన్ చేశారట. తనకు హీరోకు మధ్య వచ్చే ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఊరిస్తున్నారు. అయితే ఈ దివ్యేందు బ్యాక్ గ్రౌండ్ వెనుక ఆసక్తికరమైన సంగతులున్నాయి.
2007లో ఆజా నాచ్లే అనే ఫ్లాప్ మూవీతో పరిచయమైన దివ్యేందు ఆ తర్వాత బ్రేక్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూశాడు. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ లాంటి హిట్ సినిమాల్లో నటించినప్పటికీ కెరీర్ ఊపందుకోలేదు. 2018లో మిర్జాపూర్ ఒప్పుకున్నాక ఇతని జాతకమే మారిపోయింది. ఒక్కసారిగా మున్నాగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. దివ్యేందు ప్రధాన పాత్రలో అగ్ని అనే వెబ్ సిరీస్ కూడా రూపొందింది. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో మూవీలో అవకాశం దక్కించుకోవడం ద్వారా మంచి ప్రమోషన్ అందుకున్నాడు. ఇది కనుక క్లిక్ అయితే టాలీవుడ్ అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం.
This post was last modified on November 30, 2024 11:51 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…