మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సి 16 కీలక షెడ్యూల్ పరుగులు పెడుతోంది. మైసూర్ లో జరుగుతున్న షూటింగ్ లో ప్రధాన తారాగణానికి సంబంధించిన సన్నివేశాలతో పాటు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. విడుదల ఇంకా చాలా దూరం ఉన్నప్పటికీ అప్డేట్స్ ఇవ్వడంలో బుచ్చిబాబు టైం తప్పడం లేదు. క్యాస్టింగ్ ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ అభిమానులకు జోష్ ఇస్తున్నాడు. తాజాగా విలన్లలో ఒకరిగా నటిస్తున్న దివ్యేందు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ద్వారా స్వీట్ షాక్ ఇచ్చాడు. ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉంది.
మిర్జాపూర్ వెబ్ సిరీస్ లో పరమ దుర్మార్గుడైన మున్నాగా నటించింది దివ్యేందునే. ముందు వెనుక చూడకుండా మనుషుల్ని చంపేస్తూ, పచ్చి బూతులతో అవతలి వాళ్ళ మీద విరుచుకుపడే క్యారెక్టర్ లో యూత్ కి పిచ్చిపిచ్చిగా నచ్చేశాడు. ముఖ్యంగా అతని మ్యానరిజంకి వీర ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడీ మున్నానే రామ్ చరణ్ కోసం విలన్ గా మారుతున్నాడు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం బుచ్చిబాబు ఫేవరేట్ క్యారెక్టర్ అనిపించుకునే రేంజ్ లో దివ్యేందుని డిజైన్ చేశారట. తనకు హీరోకు మధ్య వచ్చే ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఊరిస్తున్నారు. అయితే ఈ దివ్యేందు బ్యాక్ గ్రౌండ్ వెనుక ఆసక్తికరమైన సంగతులున్నాయి.
2007లో ఆజా నాచ్లే అనే ఫ్లాప్ మూవీతో పరిచయమైన దివ్యేందు ఆ తర్వాత బ్రేక్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూశాడు. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ లాంటి హిట్ సినిమాల్లో నటించినప్పటికీ కెరీర్ ఊపందుకోలేదు. 2018లో మిర్జాపూర్ ఒప్పుకున్నాక ఇతని జాతకమే మారిపోయింది. ఒక్కసారిగా మున్నాగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. దివ్యేందు ప్రధాన పాత్రలో అగ్ని అనే వెబ్ సిరీస్ కూడా రూపొందింది. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో మూవీలో అవకాశం దక్కించుకోవడం ద్వారా మంచి ప్రమోషన్ అందుకున్నాడు. ఇది కనుక క్లిక్ అయితే టాలీవుడ్ అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం.
This post was last modified on November 30, 2024 11:51 am
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…