అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన పుష్ప-2 `దిరూలర్` క్యాప్షన్తో డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగావిడుదల కానున్న సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చారు నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ సమయం నుంచే పెద్ద ఎత్తున టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని నెలల కిందట అల్లు అర్జున బర్త్ డే సందర్భంగా విడుదల చేసి ఆరు సెకన్ల షార్ట్ టీజర్.. అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక, ఇటీవల విడుదల చేసిన ఫుల్ లెంగ్ద్ టీజర్ మరింతగా సినిమాపై అంచనాలు పెంచింది.
ఇక, శ్రీలలతో చేసిన ఐటం సాంగ్ `కిసిక్` పాట కూడా నెమ్మది నెమ్మదిగా మాస్లోకి వెళ్తోంది. ఇక, ఈ సిని మా ప్రమోషన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. బిహార్ రాజధాని పట్నాలో కొన్ని రోజుల కిందట ప్రారంభించిన ఈ ప్రమోషన్.. తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లోనూ అభిమానుల మనసు దోచుకుంటోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టికెట్ల విక్రయాలు అయిపోయాయని కూడా ఒక టాక్.ఈ నేపథ్యంలో ఎవరు ఎక్కడ ఈ సినిమా చూసినా ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా.. ఓ యాప్ను తీసుకువచ్చారు.
ఈ విషయాన్ని పుష్ప-2 ప్రమోషన్లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 12000 స్క్రీన్స్పై పుష్ప 2ను రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. భాషా సౌలభ్యం కోసం.. `సినీ డబ్స్` అనే యాప్ను తీసుకువచ్చామన్నారు. ఈ యాప్ద్వారా ఎంపిక చేసి ఆరు భాషల్లో ఏ భాషను ప్రేక్షకులు ఇష్టపడితే దానిలోనే ఈ సినిమాను వీక్షించవచ్చని చెప్పారు. తద్వారా భాషా పరమైన ఇబ్బందులు కూడా లేకుండా.. సినిమాను ఆస్వాదించే అవకాశం కల్పించామన్నారు. సో.. మొత్తానికి ఇప్పటికే.. అన్ని హంగుల పరంగా ప్రేక్షకులను కట్టి పడేస్తున్న పుష్ప-2 ఇప్పుడు మరింతగా మనసులు దోచుకోనుంది.
This post was last modified on November 30, 2024 9:34 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…