సాధారణంగా సినిమాలను చూడాలని అనుకునేవారు.. సినిమా హాళ్లకు వెళ్లి వీక్షిస్తారు. లేదా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫాంలు వచ్చిన తర్వాత.. ఇళ్లలోనే చూస్తున్నారు. అయితే..ఇది సాధారణ ప్రజలకు సౌల భ్యంగా ఉండే అవకాశం. కానీ,నిరంతరం ప్రభుత్వ పనులతో బిజీగా ఉండే ఐఏఎస్ అధికారులకు క్షణం తీరిక ఉండదు. ఎంత ఐఏఎస్ అధికారులైనా..వారికి కూడా కుటుంబాలు ఉంటాయి కాబట్టి.. వారిని కూడా సంతోష పెట్టాలికదా! దీంతో వారి ఆనందం కోసమైనా సినిమాలకు రావాల్సి ఉంటుంది.
కానీ, భద్రతా పరమైన చిక్కులు, సోషల్ మీడియా ప్రభావం .. ఇలా అనేక అంశాలు ఐఏఎస్లపైనా ప్రభావం చూపుతున్నాయి. దీంతో వారు గోప్యతను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు నేరుగా సినిమా హాళ్లకు వచ్చి వీక్షించే అవకాశం, సమయం రెండూ కనిపించడం లేదు. ఈ క్రమంలో విజయవాడలో ఐఏఎస్ అధికారుల సంఘం ఓ మిని సినిమాహాలును నిర్మించుకుంది. దీనిలో 48 మంది కూర్చుని హాయిగా సినిమాను వీక్షించే ఏర్పాట్లు చేశారు.
వీకెండ్లలో తమ తమకుటుంబాలతో ఐఏఎస్ అధికారులు ఈ సినిమా హాలుకు వచ్చి మూవీలను వీక్షించే లా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో వారు ఏపీ ఫిల్మ్ ఛాంబర్కు ఓ రిక్వెస్టు పంపించారు. “మీరు మాకు సహకరించాలి. కొత్తగా విడుదలయ్యే సినిమాలను మేం నిర్మించుకున్న మిని సినిమా థియేటర్లో ప్రదర్శించే ఏర్పాటు చేయాలి“ అని కోరారు. అయితే.. ఈ సినిమాలను తమకుఉచితంగా ప్రదర్శించాలని వారు కోరడం గమనార్హం. వారాంతపు సెలవుల్లో తమకుటుంబాలతో సహా ఆయా సినిమాలు వీక్షించేలా సహకరించాలని అభ్యర్థించారు. మరి దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి నిర్నయం తీసుకుంటుందో చూడాలి.
సహజంగానే ఐఏఎస్, ఐపీఎస్ సహా ఉన్నతస్థాయి అధికారులకు కాంప్లిమెంటరీ పాస్లు ఇస్తారు. అంటే..వారికి సాధారణ సినిమా హాళ్లలోనే ఉచితంగాఎంట్రీ ఉంటుంది. కానీ, వారు ప్రత్యేకంగా నిర్మించుకున్న మినీ థియేటర్లో ప్రదర్శించాలని కోరుతున్నారు కాబట్టి ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
This post was last modified on November 30, 2024 11:38 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…