సాధారణంగా సినిమాలను చూడాలని అనుకునేవారు.. సినిమా హాళ్లకు వెళ్లి వీక్షిస్తారు. లేదా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫాంలు వచ్చిన తర్వాత.. ఇళ్లలోనే చూస్తున్నారు. అయితే..ఇది సాధారణ ప్రజలకు సౌల భ్యంగా ఉండే అవకాశం. కానీ,నిరంతరం ప్రభుత్వ పనులతో బిజీగా ఉండే ఐఏఎస్ అధికారులకు క్షణం తీరిక ఉండదు. ఎంత ఐఏఎస్ అధికారులైనా..వారికి కూడా కుటుంబాలు ఉంటాయి కాబట్టి.. వారిని కూడా సంతోష పెట్టాలికదా! దీంతో వారి ఆనందం కోసమైనా సినిమాలకు రావాల్సి ఉంటుంది.
కానీ, భద్రతా పరమైన చిక్కులు, సోషల్ మీడియా ప్రభావం .. ఇలా అనేక అంశాలు ఐఏఎస్లపైనా ప్రభావం చూపుతున్నాయి. దీంతో వారు గోప్యతను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు నేరుగా సినిమా హాళ్లకు వచ్చి వీక్షించే అవకాశం, సమయం రెండూ కనిపించడం లేదు. ఈ క్రమంలో విజయవాడలో ఐఏఎస్ అధికారుల సంఘం ఓ మిని సినిమాహాలును నిర్మించుకుంది. దీనిలో 48 మంది కూర్చుని హాయిగా సినిమాను వీక్షించే ఏర్పాట్లు చేశారు.
వీకెండ్లలో తమ తమకుటుంబాలతో ఐఏఎస్ అధికారులు ఈ సినిమా హాలుకు వచ్చి మూవీలను వీక్షించే లా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో వారు ఏపీ ఫిల్మ్ ఛాంబర్కు ఓ రిక్వెస్టు పంపించారు. “మీరు మాకు సహకరించాలి. కొత్తగా విడుదలయ్యే సినిమాలను మేం నిర్మించుకున్న మిని సినిమా థియేటర్లో ప్రదర్శించే ఏర్పాటు చేయాలి“ అని కోరారు. అయితే.. ఈ సినిమాలను తమకుఉచితంగా ప్రదర్శించాలని వారు కోరడం గమనార్హం. వారాంతపు సెలవుల్లో తమకుటుంబాలతో సహా ఆయా సినిమాలు వీక్షించేలా సహకరించాలని అభ్యర్థించారు. మరి దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి నిర్నయం తీసుకుంటుందో చూడాలి.
సహజంగానే ఐఏఎస్, ఐపీఎస్ సహా ఉన్నతస్థాయి అధికారులకు కాంప్లిమెంటరీ పాస్లు ఇస్తారు. అంటే..వారికి సాధారణ సినిమా హాళ్లలోనే ఉచితంగాఎంట్రీ ఉంటుంది. కానీ, వారు ప్రత్యేకంగా నిర్మించుకున్న మినీ థియేటర్లో ప్రదర్శించాలని కోరుతున్నారు కాబట్టి ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
This post was last modified on November 30, 2024 11:38 am
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…