టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జోసెఫ్ ఈ రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సిటాడెల్ ప్రమోషన్స్ కోసం ముంబైలో ఉన్న సమంత తన తండ్రి మరణ వార్త తెలియగానే హూటాహుటిన చెన్నై బయలుదేరింది.
తన తండ్రి మరణించిన విషయాన్ని సమంత తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ‘ మళ్లీ నిన్ను కలిసే దాకా నాన్నా…’ అంటూ సమంత హార్ట్ బ్రేకింగ్ ఎమోజీతో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో, సమంతకు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియాలో సానుభూతి తెలియజేస్తున్నారు.
సిటాడెల్ ప్రమోషన్స్ సందర్భంగా సమంత తన తండ్రి గురించి సమంత ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఆయన తన జీవితాన్ని ఛాలెంజింగ్ గా మలిచేవారని సామ్ గుర్తు చేసుకుంది. చదువులో ఫస్ట్ వచ్చినంత మాత్రాన గ్రేట్ కాదని, స్మార్ట్, ఇంటెలిజెంట్ అని ఎప్పుడూ భావించకు అని తనకు చెప్పేవారని సామ్ షేర్ చేసుకుంది. తనకున్న సామర్ధ్యాలను ఆయన దాచే ప్రయత్నం చేసేవారని, అప్పుడే మరింత కష్టపడేతత్వం అలవడుతుందని ఆయన నమ్మేవారని సామ్ చెప్పింది.
This post was last modified on November 29, 2024 6:17 pm
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…