టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జోసెఫ్ ఈ రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సిటాడెల్ ప్రమోషన్స్ కోసం ముంబైలో ఉన్న సమంత తన తండ్రి మరణ వార్త తెలియగానే హూటాహుటిన చెన్నై బయలుదేరింది.
తన తండ్రి మరణించిన విషయాన్ని సమంత తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ‘ మళ్లీ నిన్ను కలిసే దాకా నాన్నా…’ అంటూ సమంత హార్ట్ బ్రేకింగ్ ఎమోజీతో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో, సమంతకు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియాలో సానుభూతి తెలియజేస్తున్నారు.
సిటాడెల్ ప్రమోషన్స్ సందర్భంగా సమంత తన తండ్రి గురించి సమంత ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఆయన తన జీవితాన్ని ఛాలెంజింగ్ గా మలిచేవారని సామ్ గుర్తు చేసుకుంది. చదువులో ఫస్ట్ వచ్చినంత మాత్రాన గ్రేట్ కాదని, స్మార్ట్, ఇంటెలిజెంట్ అని ఎప్పుడూ భావించకు అని తనకు చెప్పేవారని సామ్ షేర్ చేసుకుంది. తనకున్న సామర్ధ్యాలను ఆయన దాచే ప్రయత్నం చేసేవారని, అప్పుడే మరింత కష్టపడేతత్వం అలవడుతుందని ఆయన నమ్మేవారని సామ్ చెప్పింది.
This post was last modified on November 29, 2024 6:17 pm
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…
నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా…