టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జోసెఫ్ ఈ రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సిటాడెల్ ప్రమోషన్స్ కోసం ముంబైలో ఉన్న సమంత తన తండ్రి మరణ వార్త తెలియగానే హూటాహుటిన చెన్నై బయలుదేరింది.
తన తండ్రి మరణించిన విషయాన్ని సమంత తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ‘ మళ్లీ నిన్ను కలిసే దాకా నాన్నా…’ అంటూ సమంత హార్ట్ బ్రేకింగ్ ఎమోజీతో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో, సమంతకు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియాలో సానుభూతి తెలియజేస్తున్నారు.
సిటాడెల్ ప్రమోషన్స్ సందర్భంగా సమంత తన తండ్రి గురించి సమంత ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఆయన తన జీవితాన్ని ఛాలెంజింగ్ గా మలిచేవారని సామ్ గుర్తు చేసుకుంది. చదువులో ఫస్ట్ వచ్చినంత మాత్రాన గ్రేట్ కాదని, స్మార్ట్, ఇంటెలిజెంట్ అని ఎప్పుడూ భావించకు అని తనకు చెప్పేవారని సామ్ షేర్ చేసుకుంది. తనకున్న సామర్ధ్యాలను ఆయన దాచే ప్రయత్నం చేసేవారని, అప్పుడే మరింత కష్టపడేతత్వం అలవడుతుందని ఆయన నమ్మేవారని సామ్ చెప్పింది.
This post was last modified on November 29, 2024 6:17 pm
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…