బాలీవుడ్లో ప్రముఖ దంపతులుగా పేరుగాంచిన శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా జంట ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారారు. అయితే, ఈసారి వారి విలాసవంతమైన జీవనశైలి కాదు, ఆస్తుల లెక్కలతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం వీరి ఆస్తుల విలువ దాదాపు రూ. 3,000 కోట్లు ఉంటుందని సమాచారం. దీనితో పాటు, ఇటీవల జరిగిన ఈడీ దాడులు వీరి పేరును మరింత హాట్ టాపిక్గా మార్చేశాయి.
ఇటీవల మనీ లాండరింగ్ కేసులో ఈడీ వీరి నివాసాలపై దాడులు చేయడం చర్చనీయాంశమైంది. ముంబై, ఉత్తరప్రదేశ్లో మొత్తం 15 ప్రదేశాల్లో దాడులు జరిగాయి. అశ్లీల చిత్రాల పంపిణీ కేసులో రాజ్ కుంద్రాపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ వివాదాలు వీరి హోదాకు చెడు పేరు తెచ్చినప్పటికీ, శిల్పా మాత్రం వాటిని నిర్ధాక్షిణ్యంగా తిప్పికొట్టారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతుల దగ్గర రూ. 3,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ముంబైలో అరేబియా సముద్ర తీరాన ఉన్న రూ. 100 కోట్ల విలువైన బంగ్లా వీరి జీవనశైలికి అద్దం పడుతుంది.
అంతేకాదు, పూణేలో మరో విలాసవంతమైన నివాసం కూడా వీరి సొంతం. లగ్జరీ కార్ల జాబితాలో బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, లంబోర్ఘిని అవెంటడార్, BMW X5 వంటి కార్లు ఉన్నాయి. ప్రైవేట్ జెట్ సౌకర్యం ఈ జంటకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఇది ఒక లగ్జరీ స్టూడియో అపార్ట్మెంట్ను తలపిస్తుంది. షూటింగ్లు, వ్యక్తిగత ప్రయాణాల కోసం ఈ జెట్ను తరచూ ఉపయోగిస్తున్నారు. ఈ విలాసవంతమైన జీవనశైలి వీరిని బీ-టౌన్లో ప్రత్యేకంగా నిలిపింది.
రాజ్ కుంద్రా దాదాపు రూ. 2,800 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉన్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తన సంపదను పెంచుకున్నారు. ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్కు సహ యజమానిగా ఉండటంతో పాటు, స్టీల్, రియల్ ఎస్టేట్, ఫారెక్స్ ట్రేడింగ్లలో విస్తృతంగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇక నటిగా, టీవీ షోల ద్వారా శిల్పా శెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. దాదాపు రూ. 150 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉన్న శిల్పా ఇప్పటికీ బాలీవుడ్లో ప్రముఖంగా ఉన్నారు.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…