బాలీవుడ్లో ప్రముఖ దంపతులుగా పేరుగాంచిన శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా జంట ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారారు. అయితే, ఈసారి వారి విలాసవంతమైన జీవనశైలి కాదు, ఆస్తుల లెక్కలతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం వీరి ఆస్తుల విలువ దాదాపు రూ. 3,000 కోట్లు ఉంటుందని సమాచారం. దీనితో పాటు, ఇటీవల జరిగిన ఈడీ దాడులు వీరి పేరును మరింత హాట్ టాపిక్గా మార్చేశాయి.
ఇటీవల మనీ లాండరింగ్ కేసులో ఈడీ వీరి నివాసాలపై దాడులు చేయడం చర్చనీయాంశమైంది. ముంబై, ఉత్తరప్రదేశ్లో మొత్తం 15 ప్రదేశాల్లో దాడులు జరిగాయి. అశ్లీల చిత్రాల పంపిణీ కేసులో రాజ్ కుంద్రాపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ వివాదాలు వీరి హోదాకు చెడు పేరు తెచ్చినప్పటికీ, శిల్పా మాత్రం వాటిని నిర్ధాక్షిణ్యంగా తిప్పికొట్టారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతుల దగ్గర రూ. 3,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ముంబైలో అరేబియా సముద్ర తీరాన ఉన్న రూ. 100 కోట్ల విలువైన బంగ్లా వీరి జీవనశైలికి అద్దం పడుతుంది.
అంతేకాదు, పూణేలో మరో విలాసవంతమైన నివాసం కూడా వీరి సొంతం. లగ్జరీ కార్ల జాబితాలో బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, లంబోర్ఘిని అవెంటడార్, BMW X5 వంటి కార్లు ఉన్నాయి. ప్రైవేట్ జెట్ సౌకర్యం ఈ జంటకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఇది ఒక లగ్జరీ స్టూడియో అపార్ట్మెంట్ను తలపిస్తుంది. షూటింగ్లు, వ్యక్తిగత ప్రయాణాల కోసం ఈ జెట్ను తరచూ ఉపయోగిస్తున్నారు. ఈ విలాసవంతమైన జీవనశైలి వీరిని బీ-టౌన్లో ప్రత్యేకంగా నిలిపింది.
రాజ్ కుంద్రా దాదాపు రూ. 2,800 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉన్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తన సంపదను పెంచుకున్నారు. ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్కు సహ యజమానిగా ఉండటంతో పాటు, స్టీల్, రియల్ ఎస్టేట్, ఫారెక్స్ ట్రేడింగ్లలో విస్తృతంగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇక నటిగా, టీవీ షోల ద్వారా శిల్పా శెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. దాదాపు రూ. 150 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉన్న శిల్పా ఇప్పటికీ బాలీవుడ్లో ప్రముఖంగా ఉన్నారు.
This post was last modified on November 29, 2024 4:00 pm
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…
నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా…