కీర్తి సురేష్ పెళ్లి గురించి గతంలోనూ వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఆమె ఖండించింది. కొన్ని రోజుల కిందట మరోసారి ఆమె వివాహం గురించి ప్రచారం మొదలైతే.. కీర్తి మరోసారి వాటిని ఖండించడం మామూలేలే అని చాలామంది లైట్ తీసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ సినిమాలు చేస్తూ బాలీవుడ్లోనూ ఓ సినిమాలో నటించి.. కెరీర్ పీక్స్లో ఉండగా కీర్తి ఇప్పుడు పెళ్లెందుకు చేసుకుంటుందిలే అనుకున్నారు అందరూ. కానీ ఈసారి వచ్చింది జస్ట్ రూమర్ కాదని.. నిజంగానే ఆమె పెళ్లి చేసుకోబోతందని తేలిపోయింది. కీర్తి తండ్రి సురేషే స్వయంగా పెళ్లి గురించి ధ్రువీకరించాడు.
ఇప్పుడు కీర్తి కూడా ఓపెన్ అయిపోయింది. తనకు కాబోయే వరుడు ఆంటోనీతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తమది 15 ఏళ్ల బంధం అని ఆమె కామెంట్ చేయడం తెలిసిందే.ఇప్పుడు కీర్తి స్వయంగా తన పెళ్లి కబురును తన నోటి వెంట చెప్పేసింది. శుక్రవారం కార్తి తన తల్లిదండ్రులు మేనక, సురేష్లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దర్శనం పూర్తయ్యాక ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎందుకు తిరుమల వచ్చిందో వెల్లడించింది. ‘‘వచ్చే నెల నా పెళ్లండీ. అందుకే వచ్చాను’’ అని కీర్తి సిగ్గులొలుకుతూ చెప్పింది. పెళ్లి ఎక్కడ అని అడిగితే గోవా అని మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేసింది.
త్వరలో తన తొలి బాలీవుడ్ చిత్రం ‘బేబీ జాన్’ రిలీజవుతుండడం పట్ల ఆమె తన సంతోషాన్ని పంచుకుంది. మొత్తానికి ఈసారి మీడియాలో, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం నిజమే అన్నమాట. కీర్తి వయసు ప్రస్తుతం 32 ఏళ్లు. ఈ వయసులో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం సహజమే కానీ.. కీర్తి కెరీర్ ప్రస్తుతం మామూలు ఊపులో లేదు. అయినా ఆమె తన స్నేహితుడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఆంటోనీ.. కీర్తి కుటుంబానికి సన్నిహితుడైన ఒక వ్యాపార వేత్త.
This post was last modified on November 29, 2024 3:25 pm
సినీ రంగంలో ఒకరు చేయాల్సిన పాత్ర ఇంకొకరికి వెళ్లడం చాలా కామన్ విషయం. కొన్నిసార్లు కొందరు ఆర్టిస్టులను ఎంచుకుని, వారు…
కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ…
తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ…
గత వారం రోజులకు పైగా తిరుగుతున్న లీకులకు అధికారిక ముద్ర పడిపోయింది. టాక్సిక్ జూన్ 4 నుంచి వాయిదా వేస్తున్నట్టు…
నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు…
లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…