కీర్తి సురేష్ పెళ్లి గురించి గతంలోనూ వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఆమె ఖండించింది. కొన్ని రోజుల కిందట మరోసారి ఆమె వివాహం గురించి ప్రచారం మొదలైతే.. కీర్తి మరోసారి వాటిని ఖండించడం మామూలేలే అని చాలామంది లైట్ తీసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ సినిమాలు చేస్తూ బాలీవుడ్లోనూ ఓ సినిమాలో నటించి.. కెరీర్ పీక్స్లో ఉండగా కీర్తి ఇప్పుడు పెళ్లెందుకు చేసుకుంటుందిలే అనుకున్నారు అందరూ. కానీ ఈసారి వచ్చింది జస్ట్ రూమర్ కాదని.. నిజంగానే ఆమె పెళ్లి చేసుకోబోతందని తేలిపోయింది. కీర్తి తండ్రి సురేషే స్వయంగా పెళ్లి గురించి ధ్రువీకరించాడు.
ఇప్పుడు కీర్తి కూడా ఓపెన్ అయిపోయింది. తనకు కాబోయే వరుడు ఆంటోనీతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తమది 15 ఏళ్ల బంధం అని ఆమె కామెంట్ చేయడం తెలిసిందే.ఇప్పుడు కీర్తి స్వయంగా తన పెళ్లి కబురును తన నోటి వెంట చెప్పేసింది. శుక్రవారం కార్తి తన తల్లిదండ్రులు మేనక, సురేష్లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దర్శనం పూర్తయ్యాక ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎందుకు తిరుమల వచ్చిందో వెల్లడించింది. ‘‘వచ్చే నెల నా పెళ్లండీ. అందుకే వచ్చాను’’ అని కీర్తి సిగ్గులొలుకుతూ చెప్పింది. పెళ్లి ఎక్కడ అని అడిగితే గోవా అని మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేసింది.
త్వరలో తన తొలి బాలీవుడ్ చిత్రం ‘బేబీ జాన్’ రిలీజవుతుండడం పట్ల ఆమె తన సంతోషాన్ని పంచుకుంది. మొత్తానికి ఈసారి మీడియాలో, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం నిజమే అన్నమాట. కీర్తి వయసు ప్రస్తుతం 32 ఏళ్లు. ఈ వయసులో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం సహజమే కానీ.. కీర్తి కెరీర్ ప్రస్తుతం మామూలు ఊపులో లేదు. అయినా ఆమె తన స్నేహితుడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఆంటోనీ.. కీర్తి కుటుంబానికి సన్నిహితుడైన ఒక వ్యాపార వేత్త.
This post was last modified on November 29, 2024 3:25 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…