మనకు సంక్రాంతి ఎంత కీలకమో అదే పండగను పొంగల్ గా వ్యవహరించే కోలీవుడ్ కు కూడా అంతే ముఖ్యం. అందుకే స్టార్ హీరోల సినిమాలు ఈ టైంలో రిలీజ్ చేస్తే ఎంత యావరేజ్ ఉన్నా సరే రికార్డులు సృష్టించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వీలైనంత వరకు నిర్మాతలు ఈ ఛాన్స్ వదులుకోవడానికి ఇష్టపడరు. మైత్రి మూవీ మేకర్స్ కూడా అదే ప్లాన్ తోనే అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీని జనవరి పది రిలీజ్ చేసేందుకు ఆఘమేఘాల మీద పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. అజిత్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీగా దీని మీద ఇతర భాషల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి.
కట్ చేస్తే నిన్న రాత్రి హఠాత్తుగా అజిత్ మరో మూవీ విదాముయార్చి టీజర్ ని వదిలింది లైకా సంస్థ. అందులో స్పష్టంగా పొంగల్ రిలీజని పేర్కొనడంతో మైత్రి వర్గాలు షాక్ తిన్నాయి. నిజానికీ సినిమా చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. దసరా, దీపావళికు వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఇండియన్ 2 ఇచ్చిన స్ట్రోక్ కి వాయిదా వేసుకున్నారు. దానికి తోడు షూటింగ్ మధ్యలో అజిత్ పలుమార్లు గాయాల పాలు కావడంతో పోస్టు పోన్లు తప్పలేదు. ఇప్పుడు చివరి దశకు వచ్చిన నేపథ్యంలో లైకా ప్రొడక్షన్స్ చెప్పా పెట్టకుండా టీజర్ వదిలింది. నిమిషంన్నర వీడియోలో కథను చెప్పలేదు కానీ కీలక విజువల్స్ చూపించారు.
ఇదో యాక్షన్ డ్రామానే క్లారిటీ అయితే వచ్చింది. తమిళం నుంచి పొంగల్ కు చెప్పుకోదగ్గ సినిమా ప్రస్తుతానికి విక్రమ్ వీరధీర శూరన్ ఒక్కటే. దీనికి విదాముయార్చి తోడయ్యింది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఉన్నప్పటికీ కోలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలకిచ్చే ప్రాధాన్యం తెలిసిందే కాబట్టి ఎక్కువ ఆశించలేం కానీ ఇప్పుడు లైకా ఇచ్చిన ట్విస్టుకు మైత్రి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ రెండు అజిత్ సినిమాలు ఒకేసారి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఇండస్ట్రీలో లేకపోలేదు. గతంలో నాని (జెండాపై కపిరాజు – ఎవడే సుబ్రహ్మణ్యం), బాలకృష్ణ (బంగారు బుల్లోడు – నిప్పురవ్వ) ఒకే రోజు రెండు రిలీజులతో వచ్చారు.
This post was last modified on November 29, 2024 10:35 am
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…