మనకు సంక్రాంతి ఎంత కీలకమో అదే పండగను పొంగల్ గా వ్యవహరించే కోలీవుడ్ కు కూడా అంతే ముఖ్యం. అందుకే స్టార్ హీరోల సినిమాలు ఈ టైంలో రిలీజ్ చేస్తే ఎంత యావరేజ్ ఉన్నా సరే రికార్డులు సృష్టించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వీలైనంత వరకు నిర్మాతలు ఈ ఛాన్స్ వదులుకోవడానికి ఇష్టపడరు. మైత్రి మూవీ మేకర్స్ కూడా అదే ప్లాన్ తోనే అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీని జనవరి పది రిలీజ్ చేసేందుకు ఆఘమేఘాల మీద పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. అజిత్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీగా దీని మీద ఇతర భాషల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి.
కట్ చేస్తే నిన్న రాత్రి హఠాత్తుగా అజిత్ మరో మూవీ విదాముయార్చి టీజర్ ని వదిలింది లైకా సంస్థ. అందులో స్పష్టంగా పొంగల్ రిలీజని పేర్కొనడంతో మైత్రి వర్గాలు షాక్ తిన్నాయి. నిజానికీ సినిమా చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. దసరా, దీపావళికు వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఇండియన్ 2 ఇచ్చిన స్ట్రోక్ కి వాయిదా వేసుకున్నారు. దానికి తోడు షూటింగ్ మధ్యలో అజిత్ పలుమార్లు గాయాల పాలు కావడంతో పోస్టు పోన్లు తప్పలేదు. ఇప్పుడు చివరి దశకు వచ్చిన నేపథ్యంలో లైకా ప్రొడక్షన్స్ చెప్పా పెట్టకుండా టీజర్ వదిలింది. నిమిషంన్నర వీడియోలో కథను చెప్పలేదు కానీ కీలక విజువల్స్ చూపించారు.
ఇదో యాక్షన్ డ్రామానే క్లారిటీ అయితే వచ్చింది. తమిళం నుంచి పొంగల్ కు చెప్పుకోదగ్గ సినిమా ప్రస్తుతానికి విక్రమ్ వీరధీర శూరన్ ఒక్కటే. దీనికి విదాముయార్చి తోడయ్యింది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఉన్నప్పటికీ కోలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలకిచ్చే ప్రాధాన్యం తెలిసిందే కాబట్టి ఎక్కువ ఆశించలేం కానీ ఇప్పుడు లైకా ఇచ్చిన ట్విస్టుకు మైత్రి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ రెండు అజిత్ సినిమాలు ఒకేసారి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఇండస్ట్రీలో లేకపోలేదు. గతంలో నాని (జెండాపై కపిరాజు – ఎవడే సుబ్రహ్మణ్యం), బాలకృష్ణ (బంగారు బుల్లోడు – నిప్పురవ్వ) ఒకే రోజు రెండు రిలీజులతో వచ్చారు.
This post was last modified on November 29, 2024 10:35 am
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…