దేశమంతా ప్రధాన భాషల్లో విడుదల చేసినంత మాత్రాన ఏ సినిమా అయినా ప్యాన్ ఇండియా అయిపోదు. దాన్ని అన్ని రాష్ట్రాల ప్రేక్షకులకు దగ్గర చేయాలి. దాని గురించి మాట్లాడుకునేలా చేయాలి. అప్పుడే జనాల దృష్టి ఇటువైపు మళ్ళి మొదటి రోజు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు. పుష్ప 2 ఈ విషయంలో ఒక రోల్ మోడల్ గా నిలుస్తోంది. ముంబై, బెంగళూరు, చెన్నై వెళ్లి అక్కడి మీడియాతో ప్రెస్ మీట్లు పెట్టి, వాళ్ళడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేసి, ఫ్లైట్ ఎక్కి దిగేస్తే పనైపోదని నిరూపిస్తోంది. ఎంత ఖర్చు పెట్టినా సరే దానికి తగ్గ ఫలితం ఎలా అందుకోవాలో సాక్ష్యాలతో సహా నిరూపిస్తోంది.
బీహార్ లాంటి చోట ట్రైలర్ లాంచ్ చేయాలనే ఆలోచన దగ్గర పుష్ప 2 వేసిన మొదటి అడుగు బ్రహ్మాండంగా పేలింది. సౌత్ సినిమాలను అంతగా పట్టించుకోని చోట రెండులక్షల పైగా జనాలను స్వచ్చందంగా పోగయ్యేలా చేయడం మాములు విషయం కాదు. ఇక చెన్నైలో జరిగిన ఈవెంట్ కు బ్లాక్ బస్టర్ అనే మాట చిన్నది. కోలీవుడ్ మీడియా సైతం ఇంత స్పందన రావడం ఊహించలేదు. ఇక కోచిలో జరిగింది చూశాం. మళయాళీల మీద తనకున్న ప్రేమను అల్లు అర్జున్ వ్యక్తపరిచిన తీరు ఆల్రెడీ ఉన్న ఫాలోయింగ్ ని మరింత పెంచింది. కేరళ ఓపెనింగ్స్ గురించి ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.
గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు బన్నీ వెళ్లలేకపోయినా రష్మిక మందన్నను తీసుకెళ్లడం ద్వారా మైత్రి అనుసరించిన మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యింది. బెంగళూరు, హైదరాబాద్ ఈవెంట్లు చేస్తారా లేక అనుమతులు లేక వద్దనుకుంటారా ఇంకొద్ది గంటల్లో తేలుతుంది కానీ పుష్ప 2కి ఇప్పటికిప్పుడు అదనంగా రావాల్సిన బజ్ అయితే ఏమి లేదు. కెజిఎఫ్ 2, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ టైంలో కనిపించిన ఫీవర్ మళ్ళీ ఇప్పుడు ట్రేడ్ చూస్తోంది. డిసెంబర్ 5న థియేటర్ల దగ్గర జరగబోయే జాతర మాటలకందేలా లేదు. రష్మిక అన్నట్టు పుష్ప ఇప్పుడు కేవలం పేరు కాదు ఒక బ్రాండ్.
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…