సరిగ్గా ఇంకో ఆరు రోజుల్లో పుష్ప 2 ది రూల్ సునామి మొదలైపోతుంది. దీపావళి తర్వాత సరైన ఫీడింగ్ లేక అల్లాడిపోతున్న థియేటర్లు హౌస్ ఫుల్స్ తో కిక్కిరిసిపోయే టైం వస్తోంది. ఖాళీగా పార్కింగ్ స్టాండుల్లో, క్యాంటీన్లలో హస్క్ వేసుకుంటున్న సిబ్బంది క్షణం తీరిక లేని పనులతో బిజీ కాబోతున్నారు. ముందస్తు సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ రేపు మొదలుపెట్టబోతున్నారు. అయితే టికెట్ రేట్లకు సంబంధించిన అనుమతుల కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఏ క్షణమైనా వచ్చే అవకాశముంది. రావడం ఆలస్యం బుక్ మై షో, పేటిఎం తదితర యాప్స్ ట్రాఫిక్ తో కిక్కిరిసిపోతాయి.
ఇప్పుడు అందరి చూపు టికెట్ రేట్ల పెంపు ఏ మోతాదులో ఉండబోతోందనే దాని మీదుంది. ఏపీ, తెలంగాణ రెండు ప్రభుత్వాలు పరిశ్రమ విన్నపాల పట్ల సానుకూలంగా ఉన్నాయి కాబట్టి హైక్ గురించి మైత్రి మేకర్స్ టెన్షన్ పడటం లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం తమ బ్యానర్ హీరో కావడంతో పాటు పరిశ్రమ తరఫున ఎవరు ఏది అడిగినా నో అనని మనిషి. కాబట్టి గరిష్టంగా దేవర కంటే ఎక్కువగా ఒక్కో టికెట్ మీద 150 నుంచి 200 మధ్యలో పెంపు తెచ్చుకోవచ్చని భావిస్తున్నారు. అంటే మల్టీప్లెక్స్ రేట్ 400 రూపాయలు తాకొచ్చు. తెలంగాణలో దేవరకిచ్చినంతే పెంచుతారనే టాక్ ఉంది కానీ ఎంత మొత్తమనేది చూడాలి.
రెండు రాష్ట్రాల్లో ఇంచుమించు ఒకటే రేట్ ఉండే అవకాశముందని ట్రేడ్ అంచనా. రెగ్యులర్ షోల సంగతి ఎలా ఉన్నా ప్రీమియర్ల డిమాండ్ మాత్రం మాములుగా లేదు. అర్ధరాత్రి ఒంటి గంట, తెల్లవారుఝామున షోలకు విపరీతమైన ఒత్తిడి నెలకొంటోంది. బిసి సెంటర్ల సింగల్ స్క్రీన్ల అధికారిక ధరే 750 దాకా పలుకుతోందట. ముందు రోజుకు ఇది ఎన్ని వేల రూపాయలకు చేరుతుందో ఊహించడం కష్టం. రెండు వారాలుగా థియేటర్లకు వెళ్లకుండా ఆదాచేసిన డబ్బంతా సినీ ప్రియులు పుష్ప 2 కోసం ఖర్చు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. సో టికెట్ దొరకాలే కానీ డోంట్ కేర్ అన్న తరహాలో బుకింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…