చియాన్ విక్రమ్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. అపరిచితుడు తర్వాత టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్న ఈ విలక్షణ నటుడు ఆ తర్వాత వరస ఫ్లాపులతో దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కానీ అతను పడే కష్టానికి విపరీతమైన అభిమానం చూపించే వాళ్ళు ఏపీ, తెలంగాణలో బోలెడున్నారు. పొన్నియిన్ సెల్వన్ కు మన దగ్గర క్రేజ్ రావడంలో మణిరత్నం బ్రాండ్ కన్నా ముందు పని చేసింది విక్రమ్ పేరే. తంగలాన్ ఫ్లాప్ అయినా సరే మొదటి నాలుగైదు రోజు డీసెంట్ వసూళ్లు దక్కాయంటే విక్రమ్ మీద గౌరవంతో చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి.
ఇక అసలు విషయానికి వస్తే విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ తెలుగు ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందని లేటెస్ట్ అప్డేట్. తొలుత మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు ఉంటుందని టాక్ వచ్చింది. కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడమో మరే ఇతర కారణమో కానీ ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త దర్శకుడు దీపక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మనసాయనమః షార్ట్ ఫిలింతో ప్రశంసలు, అవార్డులు దక్కించుకున్న దీపక్ కు ఇది డెబ్యూ. అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాధమిక దశలో దీనికి సంబంధించిన అంగీకారం జరిగిపోయిందని సమాచారం.
తెలుగు తమిళం రెండు భాషల్లో సమాంతరంగా షూట్ చేస్తారని తెలిసింది. ఇటీవలి కాలంలో పక్క రాష్ట్రాల హీరోలు టాలీవుడ్ మీద కన్నేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ఇప్పటికే తనకంటూ మార్కెట్ సృష్టించుకోగా సార్ తో ధనుష్ మొదటి మెట్టు విజయవంతంగా ఎక్కాడు. వీళ్ళందరూ లేట్ గా ఎంట్రీ ఇచ్చినవాళ్లు. కానీ ధృవ్ తెలివిగా ముందే అడుగులు వేస్తున్నాడు. అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇంకొద్దిరోజులు వెయిట్ చేయాలి. మహాన్ లో తండ్రితో కలిసి నటించి మెప్పించిన ధృవ్ అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బైసన్ అనే ప్యాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.
This post was last modified on November 29, 2024 9:05 am
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…