చియాన్ విక్రమ్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. అపరిచితుడు తర్వాత టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్న ఈ విలక్షణ నటుడు ఆ తర్వాత వరస ఫ్లాపులతో దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కానీ అతను పడే కష్టానికి విపరీతమైన అభిమానం చూపించే వాళ్ళు ఏపీ, తెలంగాణలో బోలెడున్నారు. పొన్నియిన్ సెల్వన్ కు మన దగ్గర క్రేజ్ రావడంలో మణిరత్నం బ్రాండ్ కన్నా ముందు పని చేసింది విక్రమ్ పేరే. తంగలాన్ ఫ్లాప్ అయినా సరే మొదటి నాలుగైదు రోజు డీసెంట్ వసూళ్లు దక్కాయంటే విక్రమ్ మీద గౌరవంతో చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి.
ఇక అసలు విషయానికి వస్తే విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ తెలుగు ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందని లేటెస్ట్ అప్డేట్. తొలుత మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు ఉంటుందని టాక్ వచ్చింది. కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడమో మరే ఇతర కారణమో కానీ ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త దర్శకుడు దీపక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మనసాయనమః షార్ట్ ఫిలింతో ప్రశంసలు, అవార్డులు దక్కించుకున్న దీపక్ కు ఇది డెబ్యూ. అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాధమిక దశలో దీనికి సంబంధించిన అంగీకారం జరిగిపోయిందని సమాచారం.
తెలుగు తమిళం రెండు భాషల్లో సమాంతరంగా షూట్ చేస్తారని తెలిసింది. ఇటీవలి కాలంలో పక్క రాష్ట్రాల హీరోలు టాలీవుడ్ మీద కన్నేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ఇప్పటికే తనకంటూ మార్కెట్ సృష్టించుకోగా సార్ తో ధనుష్ మొదటి మెట్టు విజయవంతంగా ఎక్కాడు. వీళ్ళందరూ లేట్ గా ఎంట్రీ ఇచ్చినవాళ్లు. కానీ ధృవ్ తెలివిగా ముందే అడుగులు వేస్తున్నాడు. అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇంకొద్దిరోజులు వెయిట్ చేయాలి. మహాన్ లో తండ్రితో కలిసి నటించి మెప్పించిన ధృవ్ అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బైసన్ అనే ప్యాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.
This post was last modified on November 29, 2024 9:05 am
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…