చియాన్ విక్రమ్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. అపరిచితుడు తర్వాత టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్న ఈ విలక్షణ నటుడు ఆ తర్వాత వరస ఫ్లాపులతో దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కానీ అతను పడే కష్టానికి విపరీతమైన అభిమానం చూపించే వాళ్ళు ఏపీ, తెలంగాణలో బోలెడున్నారు. పొన్నియిన్ సెల్వన్ కు మన దగ్గర క్రేజ్ రావడంలో మణిరత్నం బ్రాండ్ కన్నా ముందు పని చేసింది విక్రమ్ పేరే. తంగలాన్ ఫ్లాప్ అయినా సరే మొదటి నాలుగైదు రోజు డీసెంట్ వసూళ్లు దక్కాయంటే విక్రమ్ మీద గౌరవంతో చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి.
ఇక అసలు విషయానికి వస్తే విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ తెలుగు ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందని లేటెస్ట్ అప్డేట్. తొలుత మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు ఉంటుందని టాక్ వచ్చింది. కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడమో మరే ఇతర కారణమో కానీ ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త దర్శకుడు దీపక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మనసాయనమః షార్ట్ ఫిలింతో ప్రశంసలు, అవార్డులు దక్కించుకున్న దీపక్ కు ఇది డెబ్యూ. అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాధమిక దశలో దీనికి సంబంధించిన అంగీకారం జరిగిపోయిందని సమాచారం.
తెలుగు తమిళం రెండు భాషల్లో సమాంతరంగా షూట్ చేస్తారని తెలిసింది. ఇటీవలి కాలంలో పక్క రాష్ట్రాల హీరోలు టాలీవుడ్ మీద కన్నేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ఇప్పటికే తనకంటూ మార్కెట్ సృష్టించుకోగా సార్ తో ధనుష్ మొదటి మెట్టు విజయవంతంగా ఎక్కాడు. వీళ్ళందరూ లేట్ గా ఎంట్రీ ఇచ్చినవాళ్లు. కానీ ధృవ్ తెలివిగా ముందే అడుగులు వేస్తున్నాడు. అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇంకొద్దిరోజులు వెయిట్ చేయాలి. మహాన్ లో తండ్రితో కలిసి నటించి మెప్పించిన ధృవ్ అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బైసన్ అనే ప్యాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.
This post was last modified on November 29, 2024 9:05 am
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…
మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్…
ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో…
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ.. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్.…
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…
వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాపై తరచుగా విమర్శలు చేయడంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయన…