చాలా ఏళ్లుగా బ్లాక్ బస్టర్ లేని కొరతను తీరుస్తూ రజనీకాంత్ కు జైలర్ ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. ఎప్పుడో మార్కెట్ పడిపోయిన తెలుగు రాష్ట్రాల్లో సైతం నలభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం మాటలు కాదు. తలైవర్ మ్యానరిజం, అనిరుద్ రవిచందర్ సంగీతం, సీనియర్ స్టార్ల క్యామియోలు ఒకటా రెండా ఎన్నో ఆకర్షణలు సినిమాకు రిపీట్ రన్ తీసుకొచ్చాయి. తర్వాత లాల్ సలాంతో డిజాస్టర్ అందుకున్న రజని ఇటీవలే వేట్టయన్ రూపంలో ఆశించిన ఫలితం అందుకోలేదు. అందుకే లోకేష్ కనగరాజ్ కూలి మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు మరో కిక్కిచ్చే న్యూస్ ఫ్యాన్స్ కోసం వచ్చింది.
జైలర్ 2 కోసం రంగం సిద్ధమవుతోందని చెన్నై అప్డేట్. దీనికి సంబంధించిన వీడియో ప్రోమోని డిసెంబర్ 2న షూట్ చేసి రజనీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12 ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. దానికి తగ్గట్టే సన్ నెట్ వర్క్ తమ నెట్ వర్క్ హ్యాండిల్స్ జైలర్ మొదటి భాగానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ మెమోరీస్ ని తవ్వి తీస్తోంది. జైలర్ 2 స్క్రిప్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఇటీవలే పూర్తి చేశాడు. ధనుష్ కూడా ఇందులో ఉంటాడనే ప్రచారం జోరుగా ఉంది కానీ కూతురికి విడాకులు ఇచ్చిన అల్లుడితో మావయ్య నటిస్తాడా లేదా అనే దాని మీద ఇంకా సందేహాలు తొలగిపోలేదు.
ఫస్ట్ పార్ట్ లాగే జైలర్ 2 ని వేగవంతంగా పూర్తి చేయబోతున్నారు. అయితే ఇందులో ఏం చూపిస్తారనే డౌట్ రావడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ముత్తువేల్ పాండియన్ ఫ్లాష్ బ్యాక్ ని ఎక్కువగా చూపిస్తారని తెలిసింది. జైలర్ 1లో కేవలం జైలు ఎపిసోడ్లకు పరిమితమైన యంగ్ లుక్ ని ఈసారి పూర్తి స్థాయిలో వాడబోతున్నారట. కొడుకు, విలన్ ఇద్దరూ చనిపోయారు కాబట్టి ఈసారి కొత్త ప్రతినాయకుడు కావాలి. దానికోసం క్రేజీ బాలీవుడ్ నటుడిని సెట్ చేస్తారని అంటున్నారు. అనౌన్స్ మెంట్ రాకుండానే జైలర్ 2 మీద ఇంత ఆసక్తి రేగుతోందంటే సెట్స్ పైకి వెళ్లి అప్డేట్స్ వచ్చాక ఇంకెంత రచ్చ జరుగుతుందో.
This post was last modified on November 28, 2024 5:23 pm
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…
మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్…
ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో…
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ.. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్.…
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…
వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాపై తరచుగా విమర్శలు చేయడంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయన…