ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాల్లో ఏది ముందు రిలీజనే అయోమయం కొద్దిరోజులుగా ఫ్యాన్స్ ని వెంటాడుతోంది. హరిహర వీరమల్లు మార్చి 28 తేదీని అధికారికంగా ప్రకటించినప్పటికీ హఠాత్తుగా దాని స్థానంలో ఓజి రావొచ్చనే ప్రచారం కన్ఫ్యూజన్ కి దారి తీసింది. ఫైనల్ గా దీనికి చెక్ పెట్టబోతున్నారు. ఈ నెలాఖరు నుంచి విజయవాడలో హరిహర వీరమల్లు చివరి షెడ్యూల్ ని ఏకధాటిగా తీయబోతున్నారు. రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ ఎత్తున యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. దీని కోసమే పవన్ పొడవాటి హెయిర్ స్టైల్ అలాగే కొనసాగిస్తున్నారు.
ఎలా చూసుకున్నా హరిహర వీరమల్లు రావడమే అన్ని విధాలా రైటు. ఎందుకంటే నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే దీని మీద విపరీతమైన భారాన్ని మోస్తున్నారు. వంద కోట్లకు పైగా పెట్టుబడి దీని మీద పెట్టారు. దర్శకుడు క్రిష్ అధిక శాతం పూర్తి చేశాక బ్యాలన్స్ బాధ్యతలు జ్యోతికృష్ణ తీసుకున్నారు. కీరవాణి ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాల్సి ఉంది. ఫైనల్ కాపీ సిద్ధం కాగానే మొదలుపెడతారు. అమెజాన్ ప్రైమ్ తో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడలేని పరిస్థితి వీరమల్లు డేట్ పలుమార్లు మారుతూ వచ్చింది. ఇప్పుడు ఓజి కోసమో ఇంకో కారణం కోసమో పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ లేదని సమాచారం.
సో చెప్పిన ప్రకారం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ రిలీజ్ లో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఆలస్యం వల్ల హైప్ తగ్గినట్టు అనిపించినా సరైన ప్రమోషన్లతో దాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు సూర్య మూవీస్ టీమ్ ప్రణాళికలు వేస్తోంది. మొత్తం పూర్తయ్యాక ఓజి పబ్లిసిటీకి కాసింత బ్రేక్ ఇవ్వమని డివివి బృందాన్ని కోరతారట. అక్కడి నుంచి వీరమల్లు సందడి మొదలుపెడతారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ హిస్టారిక్ డ్రామా బాబీ డియోల్ కీలక పాత్ర పోషించాడు. పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ ఇది. రెండో భాగం వచ్చే ఏడాదే పూర్తి చేస్తారట.
This post was last modified on November 28, 2024 12:09 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…