ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాల్లో ఏది ముందు రిలీజనే అయోమయం కొద్దిరోజులుగా ఫ్యాన్స్ ని వెంటాడుతోంది. హరిహర వీరమల్లు మార్చి 28 తేదీని అధికారికంగా ప్రకటించినప్పటికీ హఠాత్తుగా దాని స్థానంలో ఓజి రావొచ్చనే ప్రచారం కన్ఫ్యూజన్ కి దారి తీసింది. ఫైనల్ గా దీనికి చెక్ పెట్టబోతున్నారు. ఈ నెలాఖరు నుంచి విజయవాడలో హరిహర వీరమల్లు చివరి షెడ్యూల్ ని ఏకధాటిగా తీయబోతున్నారు. రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ ఎత్తున యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. దీని కోసమే పవన్ పొడవాటి హెయిర్ స్టైల్ అలాగే కొనసాగిస్తున్నారు.
ఎలా చూసుకున్నా హరిహర వీరమల్లు రావడమే అన్ని విధాలా రైటు. ఎందుకంటే నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే దీని మీద విపరీతమైన భారాన్ని మోస్తున్నారు. వంద కోట్లకు పైగా పెట్టుబడి దీని మీద పెట్టారు. దర్శకుడు క్రిష్ అధిక శాతం పూర్తి చేశాక బ్యాలన్స్ బాధ్యతలు జ్యోతికృష్ణ తీసుకున్నారు. కీరవాణి ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాల్సి ఉంది. ఫైనల్ కాపీ సిద్ధం కాగానే మొదలుపెడతారు. అమెజాన్ ప్రైమ్ తో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడలేని పరిస్థితి వీరమల్లు డేట్ పలుమార్లు మారుతూ వచ్చింది. ఇప్పుడు ఓజి కోసమో ఇంకో కారణం కోసమో పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ లేదని సమాచారం.
సో చెప్పిన ప్రకారం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ రిలీజ్ లో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఆలస్యం వల్ల హైప్ తగ్గినట్టు అనిపించినా సరైన ప్రమోషన్లతో దాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు సూర్య మూవీస్ టీమ్ ప్రణాళికలు వేస్తోంది. మొత్తం పూర్తయ్యాక ఓజి పబ్లిసిటీకి కాసింత బ్రేక్ ఇవ్వమని డివివి బృందాన్ని కోరతారట. అక్కడి నుంచి వీరమల్లు సందడి మొదలుపెడతారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ హిస్టారిక్ డ్రామా బాబీ డియోల్ కీలక పాత్ర పోషించాడు. పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ ఇది. రెండో భాగం వచ్చే ఏడాదే పూర్తి చేస్తారట.
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…