ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాల్లో ఏది ముందు రిలీజనే అయోమయం కొద్దిరోజులుగా ఫ్యాన్స్ ని వెంటాడుతోంది. హరిహర వీరమల్లు మార్చి 28 తేదీని అధికారికంగా ప్రకటించినప్పటికీ హఠాత్తుగా దాని స్థానంలో ఓజి రావొచ్చనే ప్రచారం కన్ఫ్యూజన్ కి దారి తీసింది. ఫైనల్ గా దీనికి చెక్ పెట్టబోతున్నారు. ఈ నెలాఖరు నుంచి విజయవాడలో హరిహర వీరమల్లు చివరి షెడ్యూల్ ని ఏకధాటిగా తీయబోతున్నారు. రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ ఎత్తున యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. దీని కోసమే పవన్ పొడవాటి హెయిర్ స్టైల్ అలాగే కొనసాగిస్తున్నారు.
ఎలా చూసుకున్నా హరిహర వీరమల్లు రావడమే అన్ని విధాలా రైటు. ఎందుకంటే నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే దీని మీద విపరీతమైన భారాన్ని మోస్తున్నారు. వంద కోట్లకు పైగా పెట్టుబడి దీని మీద పెట్టారు. దర్శకుడు క్రిష్ అధిక శాతం పూర్తి చేశాక బ్యాలన్స్ బాధ్యతలు జ్యోతికృష్ణ తీసుకున్నారు. కీరవాణి ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాల్సి ఉంది. ఫైనల్ కాపీ సిద్ధం కాగానే మొదలుపెడతారు. అమెజాన్ ప్రైమ్ తో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడలేని పరిస్థితి వీరమల్లు డేట్ పలుమార్లు మారుతూ వచ్చింది. ఇప్పుడు ఓజి కోసమో ఇంకో కారణం కోసమో పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ లేదని సమాచారం.
సో చెప్పిన ప్రకారం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ రిలీజ్ లో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఆలస్యం వల్ల హైప్ తగ్గినట్టు అనిపించినా సరైన ప్రమోషన్లతో దాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు సూర్య మూవీస్ టీమ్ ప్రణాళికలు వేస్తోంది. మొత్తం పూర్తయ్యాక ఓజి పబ్లిసిటీకి కాసింత బ్రేక్ ఇవ్వమని డివివి బృందాన్ని కోరతారట. అక్కడి నుంచి వీరమల్లు సందడి మొదలుపెడతారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ హిస్టారిక్ డ్రామా బాబీ డియోల్ కీలక పాత్ర పోషించాడు. పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ ఇది. రెండో భాగం వచ్చే ఏడాదే పూర్తి చేస్తారట.
This post was last modified on November 28, 2024 12:09 pm
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…