సాధారణంగా సినిమా నిడివి రెండున్నర నుంచి మూడు గంటల మధ్యలో ఉండటం ఎప్పటి నుంచో చూస్తున్నదే. ప్రేక్షకులు దీనికే అలవాటు పడ్డారు. ఇంతకన్నా ఎక్కువ ఉంటే అధికశాతం చూసేవాళ్ల ఓపిక మీద ప్రభావం చూపించడంతో పాటు థియేటర్ నిర్వహణ పరంగా కూడా భారం అవుతుంది కాబట్టి దర్శక నిర్మాతలు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని లెన్త్ ప్లాన్ చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం దానికి అతీతంగా తాము ఆడియన్స్ కి ఏం ఇవ్వాలని స్క్రిప్ట్ రాసుకున్నారో దాన్ని పూర్తిగా చూపించేవరకు రాజీపడరు. పుష్ప 2 ది రూల్ అదే కోవలోకి చేరబోతోంది. మరి అన్నగారి టాపిక్ ఎందుకు వచ్చిందో చూద్దాం.
టాలీవుడ్ చరిత్రలో అత్యధిక నిడివి కలిగిన సినిమాల్లో మొదటి స్థానం దానవీరశూరకర్ణది. 3 గంటల 44 నిమిషాలతోనూ బ్లాక్ బస్టర్ సాధించింది. ఎన్టీఆర్ నటన, దర్శకత్వానికి జనాలు నీరాజనం పట్టారు. రెండు ఇంటర్వెల్స్ ఇచ్చేవారు. తర్వాతి స్థానం లవకుశది. దీని నిడివి 3 గంటల 28 నిముషాలు. ఈ రెండు అన్నగారివే కావడం, ఇండస్ట్రీ రికార్డులు సృష్టించినవి కావడం గమనార్షం. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ మూడో ప్లేస్ తీసుకోబోతోంది. 3 గంటల 21 నిమిషాలతో తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో ఒక అరుదైన ఘనత సాధించనుంది. ఇప్పటి జనరేషన్ స్టార్లలో ఎవరూ తీసుకోని అతి పెద్ద రిస్క్ ఇది.
హిందీలో ఇలాంటివి బోలెడున్నాయి. మేరా నామ్ జోకర్, ఎల్ఓసి కార్గిల్, లగాన్, సంగం, ఖతర్నాక్, హే రామ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాండంత లిస్టు ఉంది. కానీ తెలుగులో మాత్రం చాలా తక్కువ. ఆర్ఆర్ఆర్ సైతం 3 గంటల 5 నిమిషాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఒక కమర్షియల్ చిత్రంలో సుకుమార్ ఇంత లెన్త్ పెట్టడం చిన్న విషయం కాదు. రేపు బ్లాక్ బస్టర్ సాధిస్తే ఇతర దర్శకులూ దీన్ని ఫాలో అయ్యే అవకాశం లేకపోలేదు. కత్తెర వేసేందుకు అవకాశం లేకుండా టైటిల్ నుంచి శుభం కార్డు దాకా ఊర మాస్ కంటెంట్ తో పుష్ప 2 ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఖచ్చితంగా అలరిస్తుందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…
రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…