ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ కాలం నిర్మాణం జరుపుకున్నా బడ్జెట్, విఎఫ్ఎక్స్ లాంటివి ఆలస్యానికి కారణంగా నిలిచేవి కానీ ఇప్పుడలా కాదు. అంచనాల బరువుని మోసే క్రమంలో హీరోలు దర్శకులు తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల జాప్యాన్ని నిలువరించడం కష్టమైపోతోంది. పుష్పకూ ఈ సమస్య వచ్చింది. పుష్ప 1 ది రైజ్ మాములు హిట్టయ్యుంటే అల్లు అర్జున్ ఈపాటికి ఇంకో రెండు సినిమాలు చేసేవాడేమో కానీ అది బ్లాక్ బస్టర్ కావడం సీక్వెల్ మీద విపరీతమైన అంచనాలు మోసుకొచ్చింది.
దీంతో స్క్రిప్ట్ మీద సుకుమార్ బృందం ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. ఫలితం పుష్ప 2 ది రూల్ మూడేళ్ళ నిర్మాణం. ఏదైతేనేం ఎట్టకేలకు డిసెంబర్ 5 విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఇవాళ కోచిలో జరిగిన ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతూ అభిమానులను మూడు సంవత్సరాల పాటు వెయిట్ చేయించానని, ఇకపై ఇంత గ్యాప్ రాకుండా చూసుకుంటానని మల్లువుడ్ ఫ్యాన్స్ సాక్షిగా హామీ ఇచ్చేశాడు. మలయాళంలో ఇంత పేరు రావడానికి దర్శకుడు సుకుమారే కారణమని, ఆర్య నుంచి పుష్ప దాకా ఆయనతో చేసిన సినిమాలు తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని పేర్కొన్నాడు.
సో అల్లు అర్జున్ ఇకపై స్పీడ్ పెంచబోతున్నాడనే క్లారిటీ వచ్చేసింది. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే ప్యాన్ ఇండియా మూవీకి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచి మొదలుపెడతారనే దాని గురించి ఇంకా సమాచారం లేదు కానీ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ చేస్తున్నారు. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టు పని మీదే ఉన్నారు. పుష్ప 2కున్న ప్రీ రిలీజ్ బజ్ చూస్తుంటే ప్రభాస్ తర్వాత అంతటి స్టార్ డం వచ్చే అవకాశమున్న హీరోగా అల్లు అర్జున్ నిలుస్తాడని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. బ్లాక్ బస్టరైతే అదే జరిగేలా ఉంది.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…