ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ కాలం నిర్మాణం జరుపుకున్నా బడ్జెట్, విఎఫ్ఎక్స్ లాంటివి ఆలస్యానికి కారణంగా నిలిచేవి కానీ ఇప్పుడలా కాదు. అంచనాల బరువుని మోసే క్రమంలో హీరోలు దర్శకులు తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల జాప్యాన్ని నిలువరించడం కష్టమైపోతోంది. పుష్పకూ ఈ సమస్య వచ్చింది. పుష్ప 1 ది రైజ్ మాములు హిట్టయ్యుంటే అల్లు అర్జున్ ఈపాటికి ఇంకో రెండు సినిమాలు చేసేవాడేమో కానీ అది బ్లాక్ బస్టర్ కావడం సీక్వెల్ మీద విపరీతమైన అంచనాలు మోసుకొచ్చింది.
దీంతో స్క్రిప్ట్ మీద సుకుమార్ బృందం ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. ఫలితం పుష్ప 2 ది రూల్ మూడేళ్ళ నిర్మాణం. ఏదైతేనేం ఎట్టకేలకు డిసెంబర్ 5 విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఇవాళ కోచిలో జరిగిన ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతూ అభిమానులను మూడు సంవత్సరాల పాటు వెయిట్ చేయించానని, ఇకపై ఇంత గ్యాప్ రాకుండా చూసుకుంటానని మల్లువుడ్ ఫ్యాన్స్ సాక్షిగా హామీ ఇచ్చేశాడు. మలయాళంలో ఇంత పేరు రావడానికి దర్శకుడు సుకుమారే కారణమని, ఆర్య నుంచి పుష్ప దాకా ఆయనతో చేసిన సినిమాలు తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని పేర్కొన్నాడు.
సో అల్లు అర్జున్ ఇకపై స్పీడ్ పెంచబోతున్నాడనే క్లారిటీ వచ్చేసింది. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే ప్యాన్ ఇండియా మూవీకి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచి మొదలుపెడతారనే దాని గురించి ఇంకా సమాచారం లేదు కానీ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ చేస్తున్నారు. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టు పని మీదే ఉన్నారు. పుష్ప 2కున్న ప్రీ రిలీజ్ బజ్ చూస్తుంటే ప్రభాస్ తర్వాత అంతటి స్టార్ డం వచ్చే అవకాశమున్న హీరోగా అల్లు అర్జున్ నిలుస్తాడని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. బ్లాక్ బస్టరైతే అదే జరిగేలా ఉంది.
This post was last modified on November 28, 2024 10:30 am
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…