దేశం మొత్తం ఎదురు చూసేలా చేసే సినిమాలు కొన్నే వస్తాయి. అందులో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’ తర్వాత ఆ స్థాయిలో ఇండియా వైడ్ హైప్ క్రియేట్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా విడుదలకు ఇంకో వారం రోజులే సమయం మిగిలుంది. ఐతే ఎప్పట్లాగే సుకుమార్ షూటింగ్ ఆలస్యం చేయడంతో నిన్నటి వరకు కూడా టీం ఆ పనిలోనే బిజీగా ఉంది. నిన్న మధ్యాహ్నం గుమ్మడికాయ కొట్టేయడంతో టీం అంతా ఊపిరి పీల్చుకుంది. వెంటనే రాత్రికే ఎడిటింగ్, మిక్సింగ్ కూడా పూర్తి చేసి.. ఈ రోజు ఫస్ట్ కాపీ తీసేశారు. సెన్సార్ చేయించడానికి మూడు రోజుల నుంచి స్లాట్ తీసుకుంటూనే ఉన్న టీం.. చివరికి ఈ రోజు కాపీ ఇస్తోంది.
ఐతే అక్కడికి కాపీ వెళ్లడానికి ముందే టీంలోని ముఖ్యుల కోసం స్పెషల్ షో వేశారు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలతో పాటు బన్నీ తండ్రి అల్లు అరవింద్ కూడా ఈ షో చూడడం విశేషం.అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం పదిన్నర ప్రాంతంలో ‘పుష్ప-2’ షో మొదలైంది. నిడివి ఎక్కువ కావడంతో షో పూర్తయ్యేసరికి 2 గంటలైంది. ఈ షోను టీంతో పాటు అల్లు అరవింద్ కూడా బాగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా అల్లు అరవింద్ మూవీ విషయంలో బాగా ఇంప్రెస్ అయ్యారట. షో అయ్యాక బన్నీ, సుకుమార్, అల్లు అరవింద్ పరస్పరం కౌగిలించుకున్నారు.
సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి అల్లు అరవింద్ అక్కడి నుంచి చాలా సంతోషంగా బయల్దేరినట్లు తెలిసింది. సినిమాలో ప్రతి పావుగంటకూ హైప్ ఇచ్చే ఎపిసోడ్ ఉంటుందని సమాచారం. టీం అంతా కూడా ఔట్ పుట్ విషయంలో ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ షో పూర్తయ్యాక సెన్సార్ కోసం కాపీని పంపించారు. ఈ రోజు రాత్రికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేస్తుందని తెలుస్తోంది. డిసెంబరు 5న పుష్ప-2 ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 27, 2024 5:22 pm
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా…