దేశం మొత్తం ఎదురు చూసేలా చేసే సినిమాలు కొన్నే వస్తాయి. అందులో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’ తర్వాత ఆ స్థాయిలో ఇండియా వైడ్ హైప్ క్రియేట్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా విడుదలకు ఇంకో వారం రోజులే సమయం మిగిలుంది. ఐతే ఎప్పట్లాగే సుకుమార్ షూటింగ్ ఆలస్యం చేయడంతో నిన్నటి వరకు కూడా టీం ఆ పనిలోనే బిజీగా ఉంది. నిన్న మధ్యాహ్నం గుమ్మడికాయ కొట్టేయడంతో టీం అంతా ఊపిరి పీల్చుకుంది. వెంటనే రాత్రికే ఎడిటింగ్, మిక్సింగ్ కూడా పూర్తి చేసి.. ఈ రోజు ఫస్ట్ కాపీ తీసేశారు. సెన్సార్ చేయించడానికి మూడు రోజుల నుంచి స్లాట్ తీసుకుంటూనే ఉన్న టీం.. చివరికి ఈ రోజు కాపీ ఇస్తోంది.
ఐతే అక్కడికి కాపీ వెళ్లడానికి ముందే టీంలోని ముఖ్యుల కోసం స్పెషల్ షో వేశారు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలతో పాటు బన్నీ తండ్రి అల్లు అరవింద్ కూడా ఈ షో చూడడం విశేషం.అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం పదిన్నర ప్రాంతంలో ‘పుష్ప-2’ షో మొదలైంది. నిడివి ఎక్కువ కావడంతో షో పూర్తయ్యేసరికి 2 గంటలైంది. ఈ షోను టీంతో పాటు అల్లు అరవింద్ కూడా బాగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా అల్లు అరవింద్ మూవీ విషయంలో బాగా ఇంప్రెస్ అయ్యారట. షో అయ్యాక బన్నీ, సుకుమార్, అల్లు అరవింద్ పరస్పరం కౌగిలించుకున్నారు.
సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి అల్లు అరవింద్ అక్కడి నుంచి చాలా సంతోషంగా బయల్దేరినట్లు తెలిసింది. సినిమాలో ప్రతి పావుగంటకూ హైప్ ఇచ్చే ఎపిసోడ్ ఉంటుందని సమాచారం. టీం అంతా కూడా ఔట్ పుట్ విషయంలో ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ షో పూర్తయ్యాక సెన్సార్ కోసం కాపీని పంపించారు. ఈ రోజు రాత్రికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేస్తుందని తెలుస్తోంది. డిసెంబరు 5న పుష్ప-2 ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 27, 2024 5:22 pm
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…