దేశం మొత్తం ఎదురు చూసేలా చేసే సినిమాలు కొన్నే వస్తాయి. అందులో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’ తర్వాత ఆ స్థాయిలో ఇండియా వైడ్ హైప్ క్రియేట్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా విడుదలకు ఇంకో వారం రోజులే సమయం మిగిలుంది. ఐతే ఎప్పట్లాగే సుకుమార్ షూటింగ్ ఆలస్యం చేయడంతో నిన్నటి వరకు కూడా టీం ఆ పనిలోనే బిజీగా ఉంది. నిన్న మధ్యాహ్నం గుమ్మడికాయ కొట్టేయడంతో టీం అంతా ఊపిరి పీల్చుకుంది. వెంటనే రాత్రికే ఎడిటింగ్, మిక్సింగ్ కూడా పూర్తి చేసి.. ఈ రోజు ఫస్ట్ కాపీ తీసేశారు. సెన్సార్ చేయించడానికి మూడు రోజుల నుంచి స్లాట్ తీసుకుంటూనే ఉన్న టీం.. చివరికి ఈ రోజు కాపీ ఇస్తోంది.
ఐతే అక్కడికి కాపీ వెళ్లడానికి ముందే టీంలోని ముఖ్యుల కోసం స్పెషల్ షో వేశారు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలతో పాటు బన్నీ తండ్రి అల్లు అరవింద్ కూడా ఈ షో చూడడం విశేషం.అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం పదిన్నర ప్రాంతంలో ‘పుష్ప-2’ షో మొదలైంది. నిడివి ఎక్కువ కావడంతో షో పూర్తయ్యేసరికి 2 గంటలైంది. ఈ షోను టీంతో పాటు అల్లు అరవింద్ కూడా బాగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా అల్లు అరవింద్ మూవీ విషయంలో బాగా ఇంప్రెస్ అయ్యారట. షో అయ్యాక బన్నీ, సుకుమార్, అల్లు అరవింద్ పరస్పరం కౌగిలించుకున్నారు.
సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి అల్లు అరవింద్ అక్కడి నుంచి చాలా సంతోషంగా బయల్దేరినట్లు తెలిసింది. సినిమాలో ప్రతి పావుగంటకూ హైప్ ఇచ్చే ఎపిసోడ్ ఉంటుందని సమాచారం. టీం అంతా కూడా ఔట్ పుట్ విషయంలో ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ షో పూర్తయ్యాక సెన్సార్ కోసం కాపీని పంపించారు. ఈ రోజు రాత్రికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేస్తుందని తెలుస్తోంది. డిసెంబరు 5న పుష్ప-2 ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 27, 2024 5:22 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…