నితిన్-రష్మి-వెంకీ కుడుముల కలయికలో వచ్చిన ‘భీష్మ’ అప్పట్లో పెద్ద హిట్టే అయింది. మళ్లీ ఈ కలయికలో సినిమాను అనౌన్స్ చేసినపుడు ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. కానీ ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే దశలో రష్మిక తప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది. హిట్ కాంబినేషన్లో సినిమా చేయడానికి రష్మికకు ఏం అభ్యంతరం.. ఆమె సినిమా నుంచి తప్పకుందా, తప్పించారా అనే చర్చ జరిగింది. ఐతే రష్మిక ఈ సినిమా నుంచి వైదొలగడంలో ఏ వివాదం లేదని దర్శకుడు వెంకీ కుడుముల క్లారిటీ ఇచ్చాడు. ‘‘మేం ఈ సినిమా అనౌన్స్ చేసే సమయానికి రష్మిక ఓకే చెప్పారు. కానీ షూట్ మొదలయ్యే సమయానికి ఆమె చాలా బిజీగా ఉన్నారు. అందుకే ఈ సినిమాలో ఆమె భాగం కాలేదు’’ అని వెంకీ క్లారిటీ ఇచ్చాడు.
ఇక ‘రాబిన్ హుడ్’ సినిమా కథ గురించి వెంకీ మాట్లాడుతూ.. ఇదేం పూర్తి కొత్త కథతో తెరకెక్కుతున్న సినిమా ఏమీ కాదని చెప్పాడు. ‘‘ఇలాంటి కథలు చాలా వచ్చాయి. కానీ కానీ కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాం. సినిమా మొదలైన 20 నిమిషాల్లోనే కథలో కీలక మలుపు ఉంటుంది. ఆ మలుపు ఏంటన్నది కూడా ట్రైలర్లో చూపిస్తాం’’ అన్నాడు. నితిన్ ఫ్లాపుల్లో ఉన్న సంగతి ప్రస్తావించగా.. ఈ సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని, నితిన్ కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్తుందని.. ఇది పక్కా కమర్షియల్ సినిమా అని వెంకీ కుడుముల తెలిపాడు. ‘పుష్ప-2’ నిర్మాతలే ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేస్తున్న నేపథ్యంలో ఒకే సంస్థ నుంచి తక్కువ గ్యాప్లో రెండు సినిమాలు వస్తే ఇబ్బంది లేదా అని అడిగితే.. రెండు సినిమాలకు మూడు వారాల గ్యాప్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదని.. రెండు సినిమాలూ మంచి వసూళ్లు సాధిస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on November 27, 2024 5:11 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…