తమిళ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకప్పుడు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘యారుడీ నీ మోహిని’ అనే సినిమాలో కలిసి నటించారు. వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు. ధనుష్ ప్రొడక్షన్లో వచ్చిన ‘ఎదిరి నీచ్చిల్’ అనే సినిమాలో ఉచితంగా నయన్ ఐటెం సాంగ్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ (పస్తుతం భర్త) విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నటించిన ‘నానుం రౌడీ దా’ సినిమాను ధనుషే ప్రొడ్యూస్ చేశాడు. అలాంటి వాళ్లు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ.. తన లైఫ్ డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ద ఫేరీ టేల్’ కోసం ‘నానుం రౌడీ దా’ నుంచి ఫుటేజ్ ఇవ్వడానికి ధనుష్ అంగీకరించలేదని, పైగా 3 సెకన్ల ఫుటేజ్ వాడుకున్నందుకు పది కోట్ల పరిహారం డిమాండ్ చేశాడని నయన్ ఇటీవల బహిరంగ లేఖలో ధనుష్ మీద విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.
ఐతే ఆ లేఖ గురించి ధనుష్ వెంటనే స్పందించలేదు. తన మీద విమర్శలు వచ్చినా సైలెంట్గా ఉన్నాడు. ధనుష్ ఫ్యాన్స్ మాత్రం నయనతారను ఎటాక్ చేశారు. ఈ వివాదాన్ని ధనుష్కు సాగదీయడం ఇష్టం లేక సైలెంటుగా ఉన్ానడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడతను నయనతార మీద దావా వేయడం గమనార్హం. అనుమతి లేకుండా డాక్యుమెంటరీ కోసం ఫుటేజ్ వాడుకున్నందుకు నయన్, విఘ్నేష్ దంపతులతో పాటు వారికి చెందిన ‘రౌడీ పిక్చర్స్’ మీద ధనుష్ కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అంగీకరించింది. మరి విచారణ అనంతరం కోర్టు ఏమంటుందో చూడాలి. మరోవైపు ధనుష్ను ఇప్పటికే ఎటాక్ చేస్తున్న నయనతార.. ఇప్పుడు అతను కోర్టు మెట్లు ఎక్కిన నేపథ్యంలో ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరం. చూస్తుంటే ఇద్దరి మధ్య పీటముడి మరింత బిగుసుకునేలా కనిపిస్తోంది.
This post was last modified on November 27, 2024 4:58 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…