తమిళ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకప్పుడు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘యారుడీ నీ మోహిని’ అనే సినిమాలో కలిసి నటించారు. వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు. ధనుష్ ప్రొడక్షన్లో వచ్చిన ‘ఎదిరి నీచ్చిల్’ అనే సినిమాలో ఉచితంగా నయన్ ఐటెం సాంగ్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ (పస్తుతం భర్త) విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నటించిన ‘నానుం రౌడీ దా’ సినిమాను ధనుషే ప్రొడ్యూస్ చేశాడు. అలాంటి వాళ్లు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ.. తన లైఫ్ డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ద ఫేరీ టేల్’ కోసం ‘నానుం రౌడీ దా’ నుంచి ఫుటేజ్ ఇవ్వడానికి ధనుష్ అంగీకరించలేదని, పైగా 3 సెకన్ల ఫుటేజ్ వాడుకున్నందుకు పది కోట్ల పరిహారం డిమాండ్ చేశాడని నయన్ ఇటీవల బహిరంగ లేఖలో ధనుష్ మీద విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.
ఐతే ఆ లేఖ గురించి ధనుష్ వెంటనే స్పందించలేదు. తన మీద విమర్శలు వచ్చినా సైలెంట్గా ఉన్నాడు. ధనుష్ ఫ్యాన్స్ మాత్రం నయనతారను ఎటాక్ చేశారు. ఈ వివాదాన్ని ధనుష్కు సాగదీయడం ఇష్టం లేక సైలెంటుగా ఉన్ానడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడతను నయనతార మీద దావా వేయడం గమనార్హం. అనుమతి లేకుండా డాక్యుమెంటరీ కోసం ఫుటేజ్ వాడుకున్నందుకు నయన్, విఘ్నేష్ దంపతులతో పాటు వారికి చెందిన ‘రౌడీ పిక్చర్స్’ మీద ధనుష్ కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అంగీకరించింది. మరి విచారణ అనంతరం కోర్టు ఏమంటుందో చూడాలి. మరోవైపు ధనుష్ను ఇప్పటికే ఎటాక్ చేస్తున్న నయనతార.. ఇప్పుడు అతను కోర్టు మెట్లు ఎక్కిన నేపథ్యంలో ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరం. చూస్తుంటే ఇద్దరి మధ్య పీటముడి మరింత బిగుసుకునేలా కనిపిస్తోంది.
This post was last modified on November 27, 2024 4:58 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…