తమిళ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకప్పుడు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘యారుడీ నీ మోహిని’ అనే సినిమాలో కలిసి నటించారు. వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు. ధనుష్ ప్రొడక్షన్లో వచ్చిన ‘ఎదిరి నీచ్చిల్’ అనే సినిమాలో ఉచితంగా నయన్ ఐటెం సాంగ్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ (పస్తుతం భర్త) విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నటించిన ‘నానుం రౌడీ దా’ సినిమాను ధనుషే ప్రొడ్యూస్ చేశాడు. అలాంటి వాళ్లు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ.. తన లైఫ్ డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ద ఫేరీ టేల్’ కోసం ‘నానుం రౌడీ దా’ నుంచి ఫుటేజ్ ఇవ్వడానికి ధనుష్ అంగీకరించలేదని, పైగా 3 సెకన్ల ఫుటేజ్ వాడుకున్నందుకు పది కోట్ల పరిహారం డిమాండ్ చేశాడని నయన్ ఇటీవల బహిరంగ లేఖలో ధనుష్ మీద విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.
ఐతే ఆ లేఖ గురించి ధనుష్ వెంటనే స్పందించలేదు. తన మీద విమర్శలు వచ్చినా సైలెంట్గా ఉన్నాడు. ధనుష్ ఫ్యాన్స్ మాత్రం నయనతారను ఎటాక్ చేశారు. ఈ వివాదాన్ని ధనుష్కు సాగదీయడం ఇష్టం లేక సైలెంటుగా ఉన్ానడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడతను నయనతార మీద దావా వేయడం గమనార్హం. అనుమతి లేకుండా డాక్యుమెంటరీ కోసం ఫుటేజ్ వాడుకున్నందుకు నయన్, విఘ్నేష్ దంపతులతో పాటు వారికి చెందిన ‘రౌడీ పిక్చర్స్’ మీద ధనుష్ కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అంగీకరించింది. మరి విచారణ అనంతరం కోర్టు ఏమంటుందో చూడాలి. మరోవైపు ధనుష్ను ఇప్పటికే ఎటాక్ చేస్తున్న నయనతార.. ఇప్పుడు అతను కోర్టు మెట్లు ఎక్కిన నేపథ్యంలో ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరం. చూస్తుంటే ఇద్దరి మధ్య పీటముడి మరింత బిగుసుకునేలా కనిపిస్తోంది.
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…