ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూ, ప్రతి ప్రాజెక్ట్ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ఫౌజీ కూడా దానిలో ఒకటి. ఈ చిత్రంలో హీరోయిన్గా పరిచయమవుతున్న కొత్త నటి ఇమాన్వి ఇస్మాయిల్కి సంబంధించి కొన్ని ఆసక్తికర వివరాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. హీరోయిన్ ఎంపికలో చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంది.
అన్ని స్క్రీన్ టెస్టులు, పాత్రకు సరిపోయే లుక్స్, పెర్ఫార్మెన్స్ పరీక్షించి చివరికి ఇమాన్విని సెలెక్ట్ చేశారు. ఇక ఫౌజీ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. తమిళనాడులో ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు హను రాఘవపూడి చిత్రీకరించారు. ప్రభాస్ డేట్స్ 2025 సంక్రాంతి తర్వాత అందుబాటులోకి వస్తాయని సమాచారం. ఇక హీరోయిన్ ఇమాన్వి ఎప్పుడైతే ప్రభాస్ తో నతోస్తోంది అనే వార్తలు వచ్చాయో అప్పటి నుంచి ఇంటర్నెట్ వరల్డ్ లో అమ్మడి పేరు తెగ ట్రెండ్ అయ్యింది.
అయితే ఇమాన్వి కి ఇప్పటివరకు అనేక పాన్ ఇండియా చిత్రాల నుంచి ఆఫర్స్ వచ్చాయని టాక్. కానీ ఆమె ఒప్పుకోవడం లేదట. దానికి ప్రధాన కారణం ఫౌజీ నిర్మాతలు పెట్టిన కండిషన్స్. ప్రస్తుతం ప్రభాస్ బిజీ షెడ్యూల్స్ కారణంగా షూటింగ్ లోకి ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి. కాబట్టి హీరోయిన్ డేట్స్ విషయంలో ఇబ్బందులు రాకూడదని ముందే ఫిక్స్ అయ్యారు. ప్రస్తుత పెద్ద హీరోయిన్లు డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని, అందుకే కొత్త నటి ఇమాన్విని తీసుకోవాలని మైత్రీ మూవీ మేకర్స్ మొదట్లోనే నిర్ణయం తీసుకున్నారట.
ఇది ఆమె తొలి సినిమా అయినప్పటికీ, ప్రభాస్ వంటి స్టార్ హీరోతో పనిచేసే అవకాశం ఇమాన్వికి దక్కడం విశేషం. ఈ కారణంగా ఇమాన్వితో ఏడాది కాలం పాటు కాల్ షీట్స్ బ్లాక్ చేసుకున్నారట. ప్రత్యేకంగా, ఆమెకు బిజినెస్ క్లాస్ ప్రయాణం, 5-స్టార్ హోటల్ విడిది వంటి సౌకర్యాలను కూడా అందించబోతున్నారని తెలుస్తోంది. ఇమాన్వి అమెరికాలో నివసిస్తున్న నేపథ్యంలో ఆమె ప్రాజెక్ట్ కోసం ఎప్పుడైతే ప్రభాస్ షూటింగ్ షెడ్యూల్ కి డేట్స్ అందుబాటులో ఉంటాయో, అప్పుడు వెంటనే రప్పించేలా ఏర్పాట్లు చేసుకున్నారని టాక్. అందుకే ఆమె ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా ఒప్పుకోవడం లేదట.
This post was last modified on November 27, 2024 11:30 am
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…