విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన విడుదల పార్ట్ 2 డిసెంబర్ 20న థియేటర్లలో అడుగు పెట్టనుంది. మొదటి భాగం తమిళంలో ఘనవిజయం సాధించింది కానీ తెలుగులో కమర్షియల్ అద్భుతాలు చేయలేదు. కాకపోతే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ ని అత్యంత సహజంగా చూపించే క్రమంలో వెట్రిమారన్ ఎంచుకున్న బోల్డ్ స్టైల్ మన సామాన్య మాస్ జనాలకు అంతగా కనెక్ట్ కాలేదు. కానీ పార్ట్ 2 మాత్రం దానికి భిన్నంగా అసలైన కంటెంట్ ఇప్పుడు చూస్తారనేలా ఉంది. నిన్న లాంచ్ చేసిన ట్రైలర్ అంచనాలు పెంచేసింది.
విడుదల పార్ట్ 1 అధిక శాతం సూరి మీద నడవగా సీక్వెల్ మొత్తం విజయ్ సేతుపతి చేతిలో పెట్టారు. అణగారిన వర్గాలకు చెందిన ఒక యువకుడు జనంలో చైతన్యం రప్పించడం కోసం తుపాకీ పట్టి ఎంతటి విధ్వంసానికి పాల్పడ్డాడో కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు. దశాబ్దాల వెనుకటి కథే అయినప్పటికీ ఇప్పటి ఆడియన్స్ కి అర్థమయ్యేలా వెట్రిమారన్ ఎంచుకున్న మేకింగ్ స్టైల్ ఆద్యంతం ఆసక్తిగా అనిపిస్తోంది. దానికి తోడు ఇళయరాజా సంగీతం హైప్ ని ఇంకా పైకి తీసుకెళ్తోంది. మంజు వారియర్ లాంటి ఆర్టిస్టులు ఈసారి తోడవ్వడంతో క్యాస్టింగ్ పరంగానూ విడుదల పార్ట్ 2 మీద బజ్ పెరుగుతోంది.
విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ వెట్రిమారన్ టీమ్ డేట్ మార్చుకునే ఉద్దేశంలో లేదు. ఇప్పటికీ కొంచం ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉందట. అన్ని భాషలు కలిపి పన్నెండుకి పైగా సినిమాలు క్రిస్మస్ బరిలో ఉన్నాయి. అయినా సరే వెనక్కు తగ్గేదే లేదంటున్నారు. ముఖ్యంగా పుష్ప 2 ది రూల్ వచ్చిన రెండు వారాలకే రిలీజ్ చేయడం రిస్కని పలువురు వారించినప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు వెనుకడుగు వేయడం లేదు. పార్ట్ 2 ఈసారి టాలీవుడ్ జనాలకు ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. తెలుగు ట్రైలర్ తో పాటు ఇతరత్రా ప్రమోషన్లను త్వరలోనే ప్రారంభించేందుకు ప్లానింగ్ జరుగుతోంది.
This post was last modified on November 27, 2024 11:01 am
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. సమావేశాలను వారు ప్రత్యక్షంగా…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…