Movie News

పట్టుబట్టి పేరు టైటిలేయించుకుంటున్న దేవి

పుష్ప-2 సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ సినిమా నేపథ్య సంగీతం విషయంలో పెద్ద వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. తన ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వర్క్ నచ్చక.. వేరే సంగీత దర్శకులతో సుకుమార్ కొన్ని ఎపిసోడ్లకు బీజీఎం చేయిస్తున్నాడు. తమన్‌తో పాటు సామ్ సీఎస్, అజనీష్ లోక్‌నాథ్‌లను ఇందుకోసం తీసుకున్నారు. ఈ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ ఎంతగా హర్ట్ అయ్యాడో ఇటీవల చెన్నైలో జరిగిన ‘పుష్ప-2’ ప్రి రిలీజ్ ఈవెంట్లో స్పష్టంగా తెలిసిపోయింది.

సుకుమార్ మీద ఉన్న కోపాన్ని ఇన్‌డైరెక్ట్‌గా నిర్మాతల మీద చూపించేశాడు దేవి. తాను మ్యూజిక్ విషయంలో ఆలస్యం చేస్తానంటూ ‘పుష్ప-2’ నిర్మాతలు తనను నిందిస్తారంటూ అతను కౌంటర్లు వేశాడు. అంతే కాక మనకు కావాల్సింది మనం అడిగి తీసేసుకోవాలి పేమెంట్ అయినా, క్రెడిట్ అయినా.. అంటూ అతను చేసిన వ్యాఖ్యలపై పెద్ద చర్చే జరిగింది.ఈ ప్రసంగంలోనే తాను ‘పుష్ప-2’లో ప్రతి రీల్‌కూ నేపథ్య సంగీతం అందించానని దేవి ఓ కామెంట్ చేశాడు. మరి మిగతా ముగ్గురు సంగీత దర్శకుల మాటేంటి అనే చర్చ నడిచింది. ఐతే దేవి తన వరకు మొత్తం సినిమాకు నేపథ్య సంగీతం అందించగా.. అందులో ఏది వాడుకుంటారో, ఏది వేరే వాళ్లతో రీప్లేస్ చేస్తారో తనకు సంబంధం లేదని భావిస్తున్నాడు.

అందుకే తనకు రావాల్సిన ఫుల్ పేమెంట్ తీసుకోవడంతో పాటు టైటిల్ క్రెడిట్స్ కూడా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడట. తన పేరు ముందు కేవలం సంగీతం అని కాకుండా, నేపథ్య సంగీతం కూడా అని వేయాలని అతను పట్టుబడుతున్నట్లు సమాచారం. మిగతా ముగ్గురు సంగీత దర్శకులకు క్రెడిట్ ఇచ్చేట్లున్నా.. వాళ్లతో కలిపి తన పేరు వేయొద్దని, తనకు వేరే క్రెడిట్ ఉండాలని అతను తేల్చి చెప్పాడట. సుకుమార్ సహా చాలామంది దర్శకులు ముందు స్క్రీన్ ప్లే, మాటలు అంటూ వేరే పేర్లు వేసి.. చివరికి రచన-దర్శకత్వం అని తమ పేరు వేసుకుంటారు. దేవి సైతం ఇదే తరహాలో తనకు సంగీతం, నేపథ్య సంగీతం అని ప్రత్యేకంగా క్రెడిట్ ఇవ్వాలని నిర్మాతలకు కండిషన్ పెట్టినట్లు సమాచారం.

This post was last modified on November 27, 2024 10:24 am

Share
Show comments
Published by
Kumar
Tags: #DSP#Pushpa2

Recent Posts

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

1 hour ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

2 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

5 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

7 hours ago