పుష్ప-2 సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ సినిమా నేపథ్య సంగీతం విషయంలో పెద్ద వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. తన ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వర్క్ నచ్చక.. వేరే సంగీత దర్శకులతో సుకుమార్ కొన్ని ఎపిసోడ్లకు బీజీఎం చేయిస్తున్నాడు. తమన్తో పాటు సామ్ సీఎస్, అజనీష్ లోక్నాథ్లను ఇందుకోసం తీసుకున్నారు. ఈ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ ఎంతగా హర్ట్ అయ్యాడో ఇటీవల చెన్నైలో జరిగిన ‘పుష్ప-2’ ప్రి రిలీజ్ ఈవెంట్లో స్పష్టంగా తెలిసిపోయింది.
సుకుమార్ మీద ఉన్న కోపాన్ని ఇన్డైరెక్ట్గా నిర్మాతల మీద చూపించేశాడు దేవి. తాను మ్యూజిక్ విషయంలో ఆలస్యం చేస్తానంటూ ‘పుష్ప-2’ నిర్మాతలు తనను నిందిస్తారంటూ అతను కౌంటర్లు వేశాడు. అంతే కాక మనకు కావాల్సింది మనం అడిగి తీసేసుకోవాలి పేమెంట్ అయినా, క్రెడిట్ అయినా.. అంటూ అతను చేసిన వ్యాఖ్యలపై పెద్ద చర్చే జరిగింది.ఈ ప్రసంగంలోనే తాను ‘పుష్ప-2’లో ప్రతి రీల్కూ నేపథ్య సంగీతం అందించానని దేవి ఓ కామెంట్ చేశాడు. మరి మిగతా ముగ్గురు సంగీత దర్శకుల మాటేంటి అనే చర్చ నడిచింది. ఐతే దేవి తన వరకు మొత్తం సినిమాకు నేపథ్య సంగీతం అందించగా.. అందులో ఏది వాడుకుంటారో, ఏది వేరే వాళ్లతో రీప్లేస్ చేస్తారో తనకు సంబంధం లేదని భావిస్తున్నాడు.
అందుకే తనకు రావాల్సిన ఫుల్ పేమెంట్ తీసుకోవడంతో పాటు టైటిల్ క్రెడిట్స్ కూడా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడట. తన పేరు ముందు కేవలం సంగీతం అని కాకుండా, నేపథ్య సంగీతం కూడా అని వేయాలని అతను పట్టుబడుతున్నట్లు సమాచారం. మిగతా ముగ్గురు సంగీత దర్శకులకు క్రెడిట్ ఇచ్చేట్లున్నా.. వాళ్లతో కలిపి తన పేరు వేయొద్దని, తనకు వేరే క్రెడిట్ ఉండాలని అతను తేల్చి చెప్పాడట. సుకుమార్ సహా చాలామంది దర్శకులు ముందు స్క్రీన్ ప్లే, మాటలు అంటూ వేరే పేర్లు వేసి.. చివరికి రచన-దర్శకత్వం అని తమ పేరు వేసుకుంటారు. దేవి సైతం ఇదే తరహాలో తనకు సంగీతం, నేపథ్య సంగీతం అని ప్రత్యేకంగా క్రెడిట్ ఇవ్వాలని నిర్మాతలకు కండిషన్ పెట్టినట్లు సమాచారం.
This post was last modified on November 27, 2024 10:24 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…