Movie News

ఇంటివాడు కాబోతున్న అఖిల్….ఎవరీ జైనబ్

అక్కినేని ఇంట్లో నాగచైతన్య పెళ్లి బాజాలు వచ్చే వారం మ్రోగబోతున్న తరుణంలో నాగార్జున మరో శుభవార్త పంచుకున్నారు. అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్నట్టు కాబోయే కోడలిని ఫోటోల రూపంలో ట్విట్టర్ ద్వారా అభిమానులకు పరిచయం చేశారు. ఆమె పేరు జైనబ్ రవ్ జీ. 2004లో వచ్చిన మీనాక్షి టేల్ అఫ్ 3 సిటీస్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితురాలు. చిత్రలేఖనంలో గొప్ప ప్రవేశం ఉంది. భాగ్యనగరంతో పాటు పలు నగరాల్లో జైనాబ్ ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్లకు భారీ స్పందన వచ్చేది. పలు పురస్కారాలు దక్కాయి. ప్రస్తుతం ముంబైలో నివాసం ఉన్నప్పటికీ జైనబ్ రవ్ జీ పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే.

అఖిల్ తో పరిచయం పెళ్లిదాకా ఎలా దారి తీసిందన్న వివరాలు ఇంకా బయటికి రాలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త చూసి సర్ప్రైజ్ అవుతున్నారు. ఇది కనీసం లీకుల రూపంలో రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఒక్కసారిగా స్వీట్ షాక్ లా అనిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం జరిగిన అఖిల్ నిశ్చితార్థం పెళ్లి దాకా వెళ్ళకపోవడంతో నాగ్ ఈసారి ఎక్కువ హడావిడి లేకుండా ఇద్దరు పిల్లల వివాహానికి సంబంధించిన వార్తను హడావిడి లేకుండా ప్రపంచానికి చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సంవత్సరంలోనే మనవళ్ల శుభకార్యాలు జరగడం గమనించాల్సిన విషయం.

త్వరలోనే ప్రారంభం కాబోతున్న కొత్త సినిమా కోసం అఖిల్ రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుంది. యువి క్రియేషన్స్ ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీని ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంచారు. ఏజెంట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న అఖిల్ ఈసారి బెస్ట్ స్క్రిప్ట్ కావాలన్న ఉద్దేశంతో సెట్స్ లో అడుగు పెట్టకుండా కథల మీద ఫోకస్ పెట్టాడు. 2025లో ఖచ్చితంగా ఒక రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి కూడా అదే ఏడాది జరుగనుంది.

This post was last modified on November 26, 2024 5:51 pm

Share

Recent Posts

ఓటుకు నోటు తీసుకోవడం మానేయలేమా

ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…

19 minutes ago

సోనియా వందేమాతరాన్ని ఆపమన్నారా

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…

1 hour ago

`కాక్రోచ్‌`లు మ‌ళ్లీ ప‌ని మొద‌లు పెట్టేశారు…

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `పాఠ‌శాల‌ల అభివృద్ధి` కార్య‌క్ర‌మానికి 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌లే…

3 hours ago

జండా పండగ జరుపుకోలేదా జగన్?

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…

4 hours ago

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

11 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

11 hours ago