అక్కినేని ఇంట్లో నాగచైతన్య పెళ్లి బాజాలు వచ్చే వారం మ్రోగబోతున్న తరుణంలో నాగార్జున మరో శుభవార్త పంచుకున్నారు. అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్నట్టు కాబోయే కోడలిని ఫోటోల రూపంలో ట్విట్టర్ ద్వారా అభిమానులకు పరిచయం చేశారు. ఆమె పేరు జైనబ్ రవ్ జీ. 2004లో వచ్చిన మీనాక్షి టేల్ అఫ్ 3 సిటీస్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితురాలు. చిత్రలేఖనంలో గొప్ప ప్రవేశం ఉంది. భాగ్యనగరంతో పాటు పలు నగరాల్లో జైనాబ్ ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్లకు భారీ స్పందన వచ్చేది. పలు పురస్కారాలు దక్కాయి. ప్రస్తుతం ముంబైలో నివాసం ఉన్నప్పటికీ జైనబ్ రవ్ జీ పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే.
అఖిల్ తో పరిచయం పెళ్లిదాకా ఎలా దారి తీసిందన్న వివరాలు ఇంకా బయటికి రాలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త చూసి సర్ప్రైజ్ అవుతున్నారు. ఇది కనీసం లీకుల రూపంలో రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఒక్కసారిగా స్వీట్ షాక్ లా అనిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం జరిగిన అఖిల్ నిశ్చితార్థం పెళ్లి దాకా వెళ్ళకపోవడంతో నాగ్ ఈసారి ఎక్కువ హడావిడి లేకుండా ఇద్దరు పిల్లల వివాహానికి సంబంధించిన వార్తను హడావిడి లేకుండా ప్రపంచానికి చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సంవత్సరంలోనే మనవళ్ల శుభకార్యాలు జరగడం గమనించాల్సిన విషయం.
త్వరలోనే ప్రారంభం కాబోతున్న కొత్త సినిమా కోసం అఖిల్ రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుంది. యువి క్రియేషన్స్ ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీని ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంచారు. ఏజెంట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న అఖిల్ ఈసారి బెస్ట్ స్క్రిప్ట్ కావాలన్న ఉద్దేశంతో సెట్స్ లో అడుగు పెట్టకుండా కథల మీద ఫోకస్ పెట్టాడు. 2025లో ఖచ్చితంగా ఒక రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి కూడా అదే ఏడాది జరుగనుంది.
This post was last modified on November 26, 2024 5:51 pm
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
ఇంట్లో బైక్ను స్టార్ట్లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన…
క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయడం తెలుగులో అయితే ఎంతో కొంత రిస్కుతో కూడుకున్నదే. జెర్సీకి ఎంత గొప్ప పేరు వచ్చినా…
కొన్ని వారాల క్రితం జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒక పెద్ద…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…
వైసీపీ అధినేత జగన్కు జనసేన పార్టీముఖ్య నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. కీలక సూచనలు చేశారు. అయితే.. జగన్ ఎవరి మాటా…