మాములుగా స్టార్ హీరోల రెమ్యునరేషన్లు బహిర్గతంగా బయటికి చెప్పరు. మీడియాకు దొరికిన సోర్స్ నుంచి ప్రపంచానికి వెల్లడి చేయడం ఎప్పుడూ జరిగేదే కానీ దానికి చాలా సందర్భాల్లో అధికారిక ధృవీకరణ ఉండదు. కొన్నిసార్లు ఫలానా నటుడు ఇంత మొత్తంలో పన్ను కట్టాడని ఆదాయపు శాఖ వెల్లడి చేస్తేనే అర్థమయ్యేది. తాజాగా ఫోర్బ్స్ ఇండియా పత్రిక టాప్ 10 నటీనటుల జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం ఎవరికి అందనంత ఎత్తులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ కు గాను 300 కోట్ల పారితోషికం అందుకున్నాడని పేర్కొంది. అంటే ఇండియాలోనే అత్యధికం అన్నమాట.
తర్వాత స్థానంలో విజయ్ తన 69వ సినిమా కోసం 275 కోట్లు తీసుకున్నట్టు పేర్కొంది. ఆపై షారుఖ్ ఖాన్, రజనీకాంత్ (150 – 270 కోట్లు), అమీర్ ఖాన్ (100 – 175 కోట్లు), ప్రభాస్ (100 – 200 కోట్లు), అజిత్ (100 – 165 కోట్లు), సల్మాన్ ఖాన్ (100 – 150 కోట్లు), కమల్ హాసన్ (100 – 150 కోట్లు), అక్షయ్ కుమార్ (65 – 145 కోట్లు) లను జాబితాలో ఇచ్చింది. ఫోర్బ్స్ లిస్టు చూస్తే టాలీవుడ్ స్థాయి ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. పుష్ప 2కి బన్నీ ఇంత మొత్తం అందుకోవడం రికార్డే. ఈ లెక్కన బడ్జెట్ తో కలిపి పుష్ప 2కి అయిన ఖర్చు అయిదు వందల కోట్లపై మాటే. థియేటర్, నాన్ థియేటర్ బిజినెస్ రెట్టింపు స్థాయిలో జరుగుతోంది.
డిసెంబర్ 5 విడుదలకు రెడీ అవుతున్న పుష్ప 2 ది రూల్ క్రేజ్ దేశవ్యాప్తంగా ఒకే స్థాయిలో తీవ్రంగా ఉండేలా ఉంది. కిస్సిక్ దెబ్బలు పడతాయి ఐటెం సాంగ్ ఇప్పటికే వ్యూస్ లో రికార్డులు సృష్టించగా ప్రీమియర్ల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు సంగతి పక్కనపెడితే కేరళ, తమిళనాడు, కర్నాటకలో ఇప్పటిదాకా ఏ సౌత్ హీరోకి దక్కనంత భారీ రిలీజ్ కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రికార్డుల ఊచకోత మాములుగా ఉండదు. అన్నీ సరిగా కుదిరితే రాజమౌళి పేరుమీద మైలురాళ్లను అల్లు అర్జున్ సులభంగా దాటేస్తాడు. ఫ్యాన్స్ దానికోసమే వెయిటింగ్.
This post was last modified on November 26, 2024 5:06 pm
చాలా కాలంగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నప్పటికీ.. మాస్ రాజా రవితేజకు అవకాశాల విషయంలో లోటేమీ లేదు. ఇంతకుముందులా…
కరోనా సమయంలో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న వెబ్ సిరీస్ లలో మీర్జాపూర్ ఒకటి. కలీన్ భాయ్, అతని కొడుకుతో పాటు…
చాలా కాలంగా ఫామ్ లో లేని అల్లరి నరేష్ కామెడీ వర్కౌట్ కావడం లేదని భావించి రకరకాల జానర్లు ట్రై…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేసి 164 సీట్లలో విజయభేరి…
ఈ మధ్య తమిళ సీనియర్ హీరోయిన్ త్రిష పెద్దగా సినిమాలు చేస్తున్నట్లు కనిపించట్లేదు. అయినా ఆమె పేరు మాత్రం నిత్యం…
ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ లు చేపట్టిన ఆందోళన ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద ఎంతో తీవ్రమైన ఎఫెక్ట్…