గీత రచయిత కులశేఖర్ ఇవాళ అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్ను మూశారు. సినిమా పాటల సాహిత్య ప్రియులకు ఈయన పరిచయం అక్కర్లేదు. దర్శకుడు తేజతో కలిసి పని చేసిన తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న కులశేఖర్ కెరీర్ ప్రారంభంలో ఈనాడులో పని చేశారు. భాస్కరభట్ల రవికుమార్ ఈయన సహోద్యోగి. పుట్టిపెరిగిన ఊరు సింహాచలం. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి దగ్గర కొంత కాలం శిష్యరికం చేశాక పాటల రచన కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉషాకిరణ్ సంస్థలో ఉన్నప్పుడే తేజతో ఏర్పడిన పరిచయం ఉదయ్ కిరణ్ చిత్రం ద్వారా తొలి ఛాన్స్ వచ్చేలా చేసింది.
డెబ్యూతోనే అదిరిపోయే ఆల్బమ్ పడటంతో కులశేఖర్ కొంతకాలం వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. ఆర్పి పట్నాయక్ ప్రోత్సాహం ఎక్కువగా ఉండేది. దాని వల్లే మణిశర్మ చిరంజీవి మృగరాజు లాంటి అవకాశాలు ఇచ్చారు. వెంకటేష్ ఘర్షణ – వసంతంలో మంచి పాటలు పడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ సుబ్బుకి రాశారు. సుమారు వంద సినిమాలకు కులశేఖర్ పని చేశారు. కెరీర్ మసకబారుతున్న టైంలో హఠాత్తుగా మాయమైన కులశేఖర్ 2013లో ఒక గుడిలో దొంగతనం నేరం మీద జైలుకు వెళ్లి వచ్చారు. అంతకు ముందే 2008లో జ్ఞాపకశక్తి పోయిందని స్నేహితులు అంటుండేవారు.
ఇద్దరు పిల్లలు సంతానం కలిగిన కులశేఖర్ కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాడు. కొంచెం కుదుటపడ్డాక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. మాములు మనిషి అవుతాడనుకుంటున్న టైంలో ఇలా విషాద వార్త వినాల్సి వచ్చింది. ఈయన ప్రేమలేఖ రాశా అనే సినిమాకు దర్శకత్వం వహించగా విపరీతమైన జాప్యం తర్వాత రిలీజయ్యింది. ఫ్లాప్ కావడం మానసికంగా కృంగదీసిందని సన్నిహితుల మాట. సినిమాలో చూసే డ్రామాకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ముగిసిన కులశేఖర్ భౌతికంగా లేకపోయినా ఆయన రాసిన పాటల ద్వారా ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటారు.
రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది.. రెండేళ్ల కాలంలో వారి పనితీరు ఏ విధంగా సాగింది.…
గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…