‘పుష్ప: ది రైజ్’తో పోలిస్తే ‘పుష్ప: ది రూల్’ పాటలు అంచనాలకు తగ్గట్లు లేవన్న అభిప్రాయాలు మెజారిటీ జనాల్లో ఉన్నాయి. ఇందులో పాటలు బాలేవని అనలేం. కానీ ‘పుష్ప-1’ స్థాయిలో మాత్రం వైరల్ కాలేదు. టైటిల్ సాంగ్, చూసేకి, కిసిక్.. మూడు పాటల విషయంలోనూ ఇలాంటి అభిప్రాయాలే కలిగాయి. లేటెస్ట్గా వచ్చిన ఐటెం సాంగ్ ‘కిసిక్’.. ‘పుష్ప’లోని ‘ఊ అంటావా..’ పాట ముందు అస్సలు నిలవలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఐతే ‘ఊ అంటావా..’ పాట కూడా మొదట విన్నపుడు మామూలుగా అనిపించింది. కానీ తర్వాత అది సోషల్ మీడియాను షేక్ చేసేసింది. దేవిశ్రీ ఐటెం సాంగ్స్లో చాలా వాటికి ఇలాగే జరిగింది. ‘కిసిక్..’ సాంగ్ కూడా నెమ్మదిగా జనాలకు బాగా ఎక్కేస్తుందని.. ‘దెబ్బలు పడతాయి..’ అనే హుక్ వర్డ్ చాలా పాపులర్ అవుతుందని టీం భావిస్తోంది.
ఐతే తెలుగు సాంగ్ సంగతి ఏమో కానీ.. దీని హిందీ వెర్షన్ మాత్రం ఆల్రెడీ వైరల్ అవుతున్నట్లే కనిపిస్తోంది. హిందీలో ‘తప్పడ్ మారుంది సాలా..’ అంటూ సాగుతుందీ పాట. అందులోని వర్డ్స్ హిందీ ప్రేక్షకలకు చాలా క్యాచీగా అనిపిస్తున్నాయి. ఇక దేవి పాట అంటే బీట్కు ఢోకా ఉండదు. ఈ పాట మంచి ఊపుతో సాగడంతో హిందీ ఆడియన్స్ ఈ పాటతో అప్పుడే రీల్స్తో మోత మోగించేస్తున్నారు. సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతున్నట్లే కనిపిస్తోందీ సాంగ్. ‘పుష్ప’ సినిమాను తెలుగులో కంటే హిందీలోనే బాగా చూశారు. ఆ సినిమా మేనరిజమ్స్, పాటలు అక్కడే ఎక్కువ వైరల్ అయ్యాయి. ‘పుష్ప-2’ మీద అంచనాలు కూడా అక్కడే ఎక్కువ ఉన్నాయి. బాలీవుడ్లో ఇలాంటి ఊపున్న మాస్ పాటలు రావడం తక్కువ. దీంతో అక్కడి జనం ‘తప్పడ్ మారుంగి సాలా’ అంటూ ఊగిపోతున్నారని సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది.
This post was last modified on November 26, 2024 4:19 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…