‘పుష్ప: ది రైజ్’తో పోలిస్తే ‘పుష్ప: ది రూల్’ పాటలు అంచనాలకు తగ్గట్లు లేవన్న అభిప్రాయాలు మెజారిటీ జనాల్లో ఉన్నాయి. ఇందులో పాటలు బాలేవని అనలేం. కానీ ‘పుష్ప-1’ స్థాయిలో మాత్రం వైరల్ కాలేదు. టైటిల్ సాంగ్, చూసేకి, కిసిక్.. మూడు పాటల విషయంలోనూ ఇలాంటి అభిప్రాయాలే కలిగాయి. లేటెస్ట్గా వచ్చిన ఐటెం సాంగ్ ‘కిసిక్’.. ‘పుష్ప’లోని ‘ఊ అంటావా..’ పాట ముందు అస్సలు నిలవలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఐతే ‘ఊ అంటావా..’ పాట కూడా మొదట విన్నపుడు మామూలుగా అనిపించింది. కానీ తర్వాత అది సోషల్ మీడియాను షేక్ చేసేసింది. దేవిశ్రీ ఐటెం సాంగ్స్లో చాలా వాటికి ఇలాగే జరిగింది. ‘కిసిక్..’ సాంగ్ కూడా నెమ్మదిగా జనాలకు బాగా ఎక్కేస్తుందని.. ‘దెబ్బలు పడతాయి..’ అనే హుక్ వర్డ్ చాలా పాపులర్ అవుతుందని టీం భావిస్తోంది.
ఐతే తెలుగు సాంగ్ సంగతి ఏమో కానీ.. దీని హిందీ వెర్షన్ మాత్రం ఆల్రెడీ వైరల్ అవుతున్నట్లే కనిపిస్తోంది. హిందీలో ‘తప్పడ్ మారుంది సాలా..’ అంటూ సాగుతుందీ పాట. అందులోని వర్డ్స్ హిందీ ప్రేక్షకలకు చాలా క్యాచీగా అనిపిస్తున్నాయి. ఇక దేవి పాట అంటే బీట్కు ఢోకా ఉండదు. ఈ పాట మంచి ఊపుతో సాగడంతో హిందీ ఆడియన్స్ ఈ పాటతో అప్పుడే రీల్స్తో మోత మోగించేస్తున్నారు. సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతున్నట్లే కనిపిస్తోందీ సాంగ్. ‘పుష్ప’ సినిమాను తెలుగులో కంటే హిందీలోనే బాగా చూశారు. ఆ సినిమా మేనరిజమ్స్, పాటలు అక్కడే ఎక్కువ వైరల్ అయ్యాయి. ‘పుష్ప-2’ మీద అంచనాలు కూడా అక్కడే ఎక్కువ ఉన్నాయి. బాలీవుడ్లో ఇలాంటి ఊపున్న మాస్ పాటలు రావడం తక్కువ. దీంతో అక్కడి జనం ‘తప్పడ్ మారుంగి సాలా’ అంటూ ఊగిపోతున్నారని సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది.
This post was last modified on November 26, 2024 4:19 pm
భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరే మారుమోగిపోతోంది. ఇన్నాళ్లూ అతను ఆడుతున్న…
ఫిబ్రవరి 28: ప్రపంచం నిద్రలేచి కళ్లు నలుముకుంటున్న సమయం.. ఇంతలో ఏ టీవీ పెట్టినా.. ఒకటే బ్రేకింగ్ న్యూస్. ఇరాన్పై…
బలవంతుడు బలవంతుడే అన్నట్టు.. రాజకీయం.. రాజకీయమే!. ఈ మాట పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రె స్ పార్టీ అధినేత్రి…
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…