అక్కినేని నాగచైతన్య మళ్లీ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. సమంత నుంచి విడిపోయాక కొన్నేళ్లు సింగిల్గా ఉన్న అతను.. బాలీవుడ్లో స్థిరపడ్డ తెలుగు నటి శోభిత ధూళిపాళ్ళతో ప్రేమలో పడడం.. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టులో ఈ జంట నిశ్చితార్థం చేసుకోవడం తెలిసిందే. డిసెంబరు 4న పెళ్లి వేడుక జరగబోతోంది. అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్లోనే వివాహం జరిపించబోతున్నారు. ఇందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ పెళ్లిని డాక్యుమెంటరీగా తీసి నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమ్ చేయబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడా వార్తలు నిజమేనని రూఢి అయింది. చైతూ-శోభితల పెళ్లి డాక్యుమెంటరీ కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.50 కోట్ల చెల్లించబోతోందట. ఈ రేటు గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చైతూ-శోభిత పెళ్లికి మీడియాకు ప్రవేశం ఉండట్లేదు. చాలా కొద్దిమంది సెలబ్రెటీలను మాత్రమే పిలుస్తున్నారు. సెలబ్రెటీలు తమ పెళ్లి వీడియోలను స్ట్రీమింగ్ సంస్థలకు అమ్ముకోవడం ఇది తొలిసారేమీ కాదు. బాలీవుడ్లో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు సౌత్కూ విస్తరిస్తోంది. ఇటీవలే నయనతార-విఘ్నేష్ శివన్ల పెళ్లి డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ చేయడం తెలిసిందే. దానికి రూ.25 కోట్ల రేటు పలికినట్లు వార్తలు వచ్చాయి.
నయన్ డాక్యుమెంటరీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే రావడంతో చైతూ-శోభిత మ్యారేజ్ వీడియోకు డబుల్ రేటు ఇస్తోందట నెట్ ఫ్లిక్స్. అక్కినేని కుటుంబంలో పెళ్లి, పైగా శోభితకు బాలీవుడ్లో మంచి పేరుంది. హిందీ ఆడియన్స్ కూడా బాగా చూస్తారు. అందుకే ఈ రేటు కావచ్చు. నయన్ డాక్యుమెంటరీ కోసం బైట్ ఇచ్చిన నాగ్.. కొడుకు పెళ్లి డాక్యుమెంటరీకి అదిరిపోయే డీల్ తెచ్చాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
This post was last modified on November 26, 2024 2:41 pm
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…
నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా…