ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప: ది రూల్’ ఇంకో తొమ్మిది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. రిలీజ్ ముంగిట టీం ప్రమోషన్లు కొంచెం గట్టిగానే చేస్తోంది. ఐతే టీం పనిగట్టుకుని చేస్తున్న ప్రమోషన్ల కంటే.. ఓ వివాదం వల్ల ఈ చిత్రానికి వచ్చిన పబ్లిసిటీ ఎక్కువ. తన ఆస్థాన సంగీత దర్శకుడైన దేవిశ్రీ ఉండగా.. బీజీఎం బాధ్యతలను వేరే సంగీత దర్శకులకు అప్పగించడానికి డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించుకోవడం పెద్ద షాక్. తమన్తో పాటు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్, కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ లోక్నాథ్లను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. అలా అని దేవిశ్రీనేమీ పక్కన పెట్టేయలేదు. అతనూ బీజీఎం మీద వర్క్ చేస్తున్నాడు. వీళ్లకూ కొన్ని సీన్లు పంచారు. అందరి పనితనం చూసి ఏ సన్నివేశానికి ఏది బాగుందనిపిస్తే అది తీసుకోవాలన్నది సుకుమార్ ఆలోచన. ఐతే మిగతా వాళ్ల సంగతి పట్టించుకోకుండా దేవి అయితే మొత్తం సినిమాకు తన స్కోర్ దాదాపుగా పూర్తి చేశాడు.
సినిమాలో మెజారిటీ సీన్లలో దేవి బీజీఎంనే వాడుతున్నారు. సామ్ సీఎస్ తనకు అప్పగించిన సీన్లకు బీజీఎం పూర్తి చేసి టీంకు అప్పగించేశాడు. అందులో ఒక ఎపిసోడ్కు అతను అదిరిపోయే స్కోర్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో పాటు మరో సన్నివేశానికి సామ్ స్కోర్ను లాక్ చేశాడట సుకుమార్. సామ్ సైతం సోషల్ మీడియాలో పుష్ప-2 పోస్టర్ పెట్టి తన ఆనందాన్ని ప్రకటించాడు. అజనీష్ లోక్నాథ్ తన వర్క్ కోసం కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడు. మంగళవారమే అతను స్కోర్తో హైదరాబాద్ చేరుకున్నాడు. రాత్రికి తన స్కోర్లో ఏది వాడుకుంటారో ఫైనలైజ్ అవుతుంది. ఇక తమన్ విషయానికి వస్తే.. అతడి బీజీఎం సినిమాలో పెద్దగా వినిపించకపోవచ్చని సమాచారం. తమన్ వర్క్ విషయంలో సుకుమార్ అంత సంతృప్తిగా ఏమీ లేడట. మొత్తంగా తమన్ వర్క్ పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదని.. ఒకవేళ వాడినా నామమాత్రంగా మాత్రమే ఉంటుందని పుష్ప-2 టీం వర్గాల సమాచారం.
This post was last modified on November 26, 2024 3:36 pm
మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…
టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…
మహిళలు మీసాలు పెంచలేరని.. పురుషులు గర్భాన్ని దాల్చలేరని సామెత!. అయితే.. ఇటీవల కాలంలో రష్యాకు చెందిన ఓ మహిళ మీసాలు…
విశ్వాసం..అతి విశ్వాసం…ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది రాజకీయ నేతలు తొందరపడుతుంటారు…
ఇంకో 15 రోజుల్లో విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ టికెట్ రేట్లకు సంబంధించి ట్రేడ్ వర్గాల్లో చర్చలు మొదలైపోయాయి. పెంచాలా…
వైసీపీ హయాంలో మూడేళ్ల క్రితం జరిగిన తన అరెస్టు ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నాడు జరిగిన ఘటనలను…