ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప: ది రూల్’ ఇంకో తొమ్మిది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. రిలీజ్ ముంగిట టీం ప్రమోషన్లు కొంచెం గట్టిగానే చేస్తోంది. ఐతే టీం పనిగట్టుకుని చేస్తున్న ప్రమోషన్ల కంటే.. ఓ వివాదం వల్ల ఈ చిత్రానికి వచ్చిన పబ్లిసిటీ ఎక్కువ. తన ఆస్థాన సంగీత దర్శకుడైన దేవిశ్రీ ఉండగా.. బీజీఎం బాధ్యతలను వేరే సంగీత దర్శకులకు అప్పగించడానికి డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించుకోవడం పెద్ద షాక్. తమన్తో పాటు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్, కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ లోక్నాథ్లను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. అలా అని దేవిశ్రీనేమీ పక్కన పెట్టేయలేదు. అతనూ బీజీఎం మీద వర్క్ చేస్తున్నాడు. వీళ్లకూ కొన్ని సీన్లు పంచారు. అందరి పనితనం చూసి ఏ సన్నివేశానికి ఏది బాగుందనిపిస్తే అది తీసుకోవాలన్నది సుకుమార్ ఆలోచన. ఐతే మిగతా వాళ్ల సంగతి పట్టించుకోకుండా దేవి అయితే మొత్తం సినిమాకు తన స్కోర్ దాదాపుగా పూర్తి చేశాడు.
సినిమాలో మెజారిటీ సీన్లలో దేవి బీజీఎంనే వాడుతున్నారు. సామ్ సీఎస్ తనకు అప్పగించిన సీన్లకు బీజీఎం పూర్తి చేసి టీంకు అప్పగించేశాడు. అందులో ఒక ఎపిసోడ్కు అతను అదిరిపోయే స్కోర్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో పాటు మరో సన్నివేశానికి సామ్ స్కోర్ను లాక్ చేశాడట సుకుమార్. సామ్ సైతం సోషల్ మీడియాలో పుష్ప-2 పోస్టర్ పెట్టి తన ఆనందాన్ని ప్రకటించాడు. అజనీష్ లోక్నాథ్ తన వర్క్ కోసం కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడు. మంగళవారమే అతను స్కోర్తో హైదరాబాద్ చేరుకున్నాడు. రాత్రికి తన స్కోర్లో ఏది వాడుకుంటారో ఫైనలైజ్ అవుతుంది. ఇక తమన్ విషయానికి వస్తే.. అతడి బీజీఎం సినిమాలో పెద్దగా వినిపించకపోవచ్చని సమాచారం. తమన్ వర్క్ విషయంలో సుకుమార్ అంత సంతృప్తిగా ఏమీ లేడట. మొత్తంగా తమన్ వర్క్ పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదని.. ఒకవేళ వాడినా నామమాత్రంగా మాత్రమే ఉంటుందని పుష్ప-2 టీం వర్గాల సమాచారం.
This post was last modified on November 26, 2024 3:36 pm
భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరే మారుమోగిపోతోంది. ఇన్నాళ్లూ అతను ఆడుతున్న…
ఫిబ్రవరి 28: ప్రపంచం నిద్రలేచి కళ్లు నలుముకుంటున్న సమయం.. ఇంతలో ఏ టీవీ పెట్టినా.. ఒకటే బ్రేకింగ్ న్యూస్. ఇరాన్పై…
బలవంతుడు బలవంతుడే అన్నట్టు.. రాజకీయం.. రాజకీయమే!. ఈ మాట పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రె స్ పార్టీ అధినేత్రి…
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…