Movie News

పుష్ప 2 జాతర సీన్ శ్యామ్ చేతికే నా??

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప: ది రూల్’ ఇంకో తొమ్మిది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. రిలీజ్ ముంగిట టీం ప్రమోషన్లు కొంచెం గట్టిగానే చేస్తోంది. ఐతే టీం పనిగట్టుకుని చేస్తున్న ప్రమోషన్ల కంటే.. ఓ వివాదం వల్ల ఈ చిత్రానికి వచ్చిన పబ్లిసిటీ ఎక్కువ. తన ఆస్థాన సంగీత దర్శకుడైన దేవిశ్రీ ఉండగా.. బీజీఎం బాధ్యతలను వేరే సంగీత దర్శకులకు అప్పగించడానికి డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించుకోవడం పెద్ద షాక్. తమన్‌తో పాటు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్, కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్‌లను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. అలా అని దేవిశ్రీనేమీ పక్కన పెట్టేయలేదు. అతనూ బీజీఎం మీద వర్క్ చేస్తున్నాడు. వీళ్లకూ కొన్ని సీన్లు పంచారు. అందరి పనితనం చూసి ఏ సన్నివేశానికి ఏది బాగుందనిపిస్తే అది తీసుకోవాలన్నది సుకుమార్ ఆలోచన. ఐతే మిగతా వాళ్ల సంగతి పట్టించుకోకుండా దేవి అయితే మొత్తం సినిమాకు తన స్కోర్ దాదాపుగా పూర్తి చేశాడు.

సినిమాలో మెజారిటీ సీన్లలో దేవి బీజీఎంనే వాడుతున్నారు. సామ్ సీఎస్ తనకు అప్పగించిన సీన్లకు బీజీఎం పూర్తి చేసి టీంకు అప్పగించేశాడు. అందులో ఒక ఎపిసోడ్‌కు అతను అదిరిపోయే స్కోర్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో పాటు మరో సన్నివేశానికి సామ్ స్కోర్‌ను లాక్ చేశాడట సుకుమార్. సామ్ సైతం సోషల్ మీడియాలో పుష్ప-2 పోస్టర్ పెట్టి తన ఆనందాన్ని ప్రకటించాడు. అజనీష్ లోక్‌నాథ్ తన వర్క్ కోసం కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడు. మంగళవారమే అతను స్కోర్‌తో హైదరాబాద్ చేరుకున్నాడు. రాత్రికి తన స్కోర్‌లో ఏది వాడుకుంటారో ఫైనలైజ్ అవుతుంది. ఇక తమన్ విషయానికి వస్తే.. అతడి బీజీఎం సినిమాలో పెద్దగా వినిపించకపోవచ్చని సమాచారం. తమన్ వర్క్ విషయంలో సుకుమార్ అంత సంతృప్తిగా ఏమీ లేడట. మొత్తంగా తమన్ వర్క్ పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదని.. ఒకవేళ వాడినా నామమాత్రంగా మాత్రమే ఉంటుందని పుష్ప-2 టీం వర్గాల సమాచారం.

Kumar

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

37 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

1 hour ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

7 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

9 hours ago