Movie News

పుష్ప 2 జాతర సీన్ శ్యామ్ చేతికే నా??

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప: ది రూల్’ ఇంకో తొమ్మిది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. రిలీజ్ ముంగిట టీం ప్రమోషన్లు కొంచెం గట్టిగానే చేస్తోంది. ఐతే టీం పనిగట్టుకుని చేస్తున్న ప్రమోషన్ల కంటే.. ఓ వివాదం వల్ల ఈ చిత్రానికి వచ్చిన పబ్లిసిటీ ఎక్కువ. తన ఆస్థాన సంగీత దర్శకుడైన దేవిశ్రీ ఉండగా.. బీజీఎం బాధ్యతలను వేరే సంగీత దర్శకులకు అప్పగించడానికి డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించుకోవడం పెద్ద షాక్. తమన్‌తో పాటు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్, కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్‌లను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. అలా అని దేవిశ్రీనేమీ పక్కన పెట్టేయలేదు. అతనూ బీజీఎం మీద వర్క్ చేస్తున్నాడు. వీళ్లకూ కొన్ని సీన్లు పంచారు. అందరి పనితనం చూసి ఏ సన్నివేశానికి ఏది బాగుందనిపిస్తే అది తీసుకోవాలన్నది సుకుమార్ ఆలోచన. ఐతే మిగతా వాళ్ల సంగతి పట్టించుకోకుండా దేవి అయితే మొత్తం సినిమాకు తన స్కోర్ దాదాపుగా పూర్తి చేశాడు.

సినిమాలో మెజారిటీ సీన్లలో దేవి బీజీఎంనే వాడుతున్నారు. సామ్ సీఎస్ తనకు అప్పగించిన సీన్లకు బీజీఎం పూర్తి చేసి టీంకు అప్పగించేశాడు. అందులో ఒక ఎపిసోడ్‌కు అతను అదిరిపోయే స్కోర్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో పాటు మరో సన్నివేశానికి సామ్ స్కోర్‌ను లాక్ చేశాడట సుకుమార్. సామ్ సైతం సోషల్ మీడియాలో పుష్ప-2 పోస్టర్ పెట్టి తన ఆనందాన్ని ప్రకటించాడు. అజనీష్ లోక్‌నాథ్ తన వర్క్ కోసం కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడు. మంగళవారమే అతను స్కోర్‌తో హైదరాబాద్ చేరుకున్నాడు. రాత్రికి తన స్కోర్‌లో ఏది వాడుకుంటారో ఫైనలైజ్ అవుతుంది. ఇక తమన్ విషయానికి వస్తే.. అతడి బీజీఎం సినిమాలో పెద్దగా వినిపించకపోవచ్చని సమాచారం. తమన్ వర్క్ విషయంలో సుకుమార్ అంత సంతృప్తిగా ఏమీ లేడట. మొత్తంగా తమన్ వర్క్ పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదని.. ఒకవేళ వాడినా నామమాత్రంగా మాత్రమే ఉంటుందని పుష్ప-2 టీం వర్గాల సమాచారం.

This post was last modified on November 26, 2024 3:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

27 minutes ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

9 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

9 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

10 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

10 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

13 hours ago