సూర్య కెరీర్ లోనే అత్యంత ఖరీదైన ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిన కంగువా ఊహించని స్థాయిలో డిజాస్టర్ కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. వసూళ్లు వంద కోట్లు దాటినప్పటికీ దానికిచ్చిన బిల్డప్ కి కనీసం అయిదు వందల కోట్లయినా దాటి ఉండాలి. కానీ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అసాధ్యమనేలా ఎదురీదుతోంది. ఇదిలా ఉండగా కంగువ ఫ్లాప్ ని ఫ్యాన్స్ అంగీకరిస్తున్నారు కానీ టీమ్ మాత్రం ఎప్పటికప్పుడు మేము గొప్ప సినిమా తీశాం, కొన్ని వర్గాలు కావాలని తప్పుడు ప్రచారం చేసి అపజయం కలిగేలా చేశారని ఇప్పటికీ చెప్పుకునే పనిలో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం
తాజాగా కంగువ సహనిర్మాతైన ధనుంజయ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఉద్దేశపూర్వకంగా తమ చిత్రాన్ని నెగటివ్ ప్రచారంతో చంపేశారని, ఇందులో రెండు రాజకీయ పార్టీల ప్రమేయం కూడా ఉందని చెప్పడంతో విన్న వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు, సూర్య ఎదగకూడదనే ఉద్దేశంతో ఇలా చేశారని చెప్పడం మరో ట్విస్టు. నిజానికి సూర్య స్టార్ డం చిన్నదేం కాదు. కాకపోతే ఆయన ఎంచుకుంటున్న కథలు, దర్శకులు తప్పటడుగుల వైపు తీసుకెళ్తున్నారు. అంతే తప్ప ఫలానా వర్గం విషం చిమ్మినంత మాత్రాన చితికిపోయేంత బలహీన మార్కెట్ సూర్యకు లేదు.
ఇది మర్చిపోయి పదే పదే కంగువని గొప్ప సినిమాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఎలాంటి ఫలితం ఇవ్వకపోగా రివర్స్ లో విమర్శలు తెచ్చి పెడుతోంది. ఆ మధ్య సూర్య భార్య జ్యోతిక సైతం ఒక మూవీ లవర్ గా కంగువ చూశాక క్లాసిక్ అనిపించిందని, కొందరు కావాలని బ్యాడ్ చేశారని అనడం పట్ల ఎక్కువ శాతం మద్దతు దక్కలేదు. ఎవరు ఏం చేసినా, ఎన్ని అన్నా చివరికి గెలిచేది బాగున్న మంచి సినిమానే. అమరన్ విజయాన్ని ఎవరు అడ్డుకోలేదు. నెల తిరక్కుండానే విజయ్ గోట్ ని దాటేసింది. కంగువ కూడా నిజంగా అదిరిపోయి ఉంటే బాహుబలి, కెజిఎఫ్ సరసన నిలిచేది. అలా జరగకపోవడమే ఇంత రచ్చకు కారణం.
This post was last modified on November 26, 2024 3:35 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…