ఎన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టినా ఒక ప్యాన్ ఇండియా సినిమాని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం ప్రమోషన్ల పరంగా పెద్ద సవాల్. ఇది గుర్తించారు కాబట్టి రాజమౌళి ఆర్ఆర్ఆర్ టైంలో ఇద్దరు హీరోలను వెంటేసుకుని ముంబై నుంచి హైదరాబాద్ దాకా విపరీతంగా తిరిగి మరీ పబ్లిసిటీ చేసుకున్నారు. ఎంత ప్రీ రిలీజ్ హైప్ ఉన్నా సరే తమ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడంలో దర్శక నిర్మాతలు అనుసరించే మార్కెటింగ్ స్ట్రాటజీనే ఓపెనింగ్స్ ని నిర్ధారిస్తుంది. డిసెంబర్ 5 రిలీజ్ కాబోతున్న పుష్ప 2 ది రూల్ దీనికి అత్యుత్తమ ఉదాహరణగా నిలుస్తోంది. అదెలాగో చూద్దాం.
ఇప్పటిదాకా పుష్ప 2 రెండు ఈవెంట్లు చేసింది. ఎవరూ ఆలోచించడానికి కూడా సాహసించని బీహార్ రాష్ట్రం పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేయడం ద్వారా జాతీయ మీడియా దృష్టి దీని వైపు బలంగా పడింది. ఎన్నికల సభలను తలదన్నేలా వచ్చిన జన సందోహం చూసి పోలీసులు షాక్ తిన్నారు. మరుసటి రోజు అక్కడి పేపర్లన్నీ పుష్ప 2 కవరేజ్ తో నిండిపోయాయి. మొన్న చెన్నైలో చేసిన సాంగ్ లాంచ్ మరో బ్లాక్ బస్టర్ వేడుక. అల్లు అర్జున్ తమిళంలో మాట్లాడ్డం, నెల్సన్ దిలీప్ కుమార్ గెస్టుగా రావడం, దేవిశ్రీ ప్రసాద్ వివాదాస్పద స్పీచ్, హీరోయిన్ గ్లామర్ అట్రాక్షన్ వగైరాలు జనంతో నిండిపోయిన స్టేడియంని ఊపేశాయి.
గతంలో ఇతర హీరోలు ఇలా బయట రాష్ట్రాల్లో ప్రమోషన్లు చేశారు కానీ అవన్నీ ప్రెస్ మీట్లకే పరిమితం. కానీ పుష్ప 2 ఒక అడుగు ముందుకు వేసి పబ్లిక్ ప్లేసుల్లో వేడుకలు చేయడం ద్వారా కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. హైప్ ని విపరీతంగా పెంచడంలో విజయం సాధించారు. ఎంత ఖర్చయ్యిందనేది పక్కనపెడితే ఇది ఖచ్చితంగా ఓపెనింగ్స్ మీద సానుకూల ప్రభావం చూపించి అంతకంతా వసూళ్ల రూపంలో వెనక్కు తెస్తుంది. హైదరాబాద్ తో కలిపి ఇంకా దక్షిణాది ప్రమోషన్లు బాకీ ఉన్నాయి. మొదటి రెండు బంతులకే రెండు భారీ సిక్సర్లు కొట్టిన పుష్ప 2 ఇతర ప్యాన్ ఇండియా సినిమాలకు మోడల్ గా నిలుస్తోంది.
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…
గత ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ తర్వాత పలువురు నేతలు..…
సత్యనారాయణ గారూ.. రేపు సిద్ధాంతం వస్తున్నా.. అక్కడ కలుద్దాం. అంటూ 87 ఏళ్ల వృద్ధుడు సత్యనారాయణకు ఆదివారం సీఎం చంద్రబాబు…
పెద్ది ఫలితం బాగుంది. కలెక్షన్లు చక్కగా వస్తున్నాయి. సోమవారం పరీక్ష కూడా నెగ్గింది. అయితే ఎక్కడో చిన్న అసంతృప్తి అభిమానులను…
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు హిట్లర్ పేరుపై రచ్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల…
ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే…