ఎన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టినా ఒక ప్యాన్ ఇండియా సినిమాని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం ప్రమోషన్ల పరంగా పెద్ద సవాల్. ఇది గుర్తించారు కాబట్టి రాజమౌళి ఆర్ఆర్ఆర్ టైంలో ఇద్దరు హీరోలను వెంటేసుకుని ముంబై నుంచి హైదరాబాద్ దాకా విపరీతంగా తిరిగి మరీ పబ్లిసిటీ చేసుకున్నారు. ఎంత ప్రీ రిలీజ్ హైప్ ఉన్నా సరే తమ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడంలో దర్శక నిర్మాతలు అనుసరించే మార్కెటింగ్ స్ట్రాటజీనే ఓపెనింగ్స్ ని నిర్ధారిస్తుంది. డిసెంబర్ 5 రిలీజ్ కాబోతున్న పుష్ప 2 ది రూల్ దీనికి అత్యుత్తమ ఉదాహరణగా నిలుస్తోంది. అదెలాగో చూద్దాం.
ఇప్పటిదాకా పుష్ప 2 రెండు ఈవెంట్లు చేసింది. ఎవరూ ఆలోచించడానికి కూడా సాహసించని బీహార్ రాష్ట్రం పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేయడం ద్వారా జాతీయ మీడియా దృష్టి దీని వైపు బలంగా పడింది. ఎన్నికల సభలను తలదన్నేలా వచ్చిన జన సందోహం చూసి పోలీసులు షాక్ తిన్నారు. మరుసటి రోజు అక్కడి పేపర్లన్నీ పుష్ప 2 కవరేజ్ తో నిండిపోయాయి. మొన్న చెన్నైలో చేసిన సాంగ్ లాంచ్ మరో బ్లాక్ బస్టర్ వేడుక. అల్లు అర్జున్ తమిళంలో మాట్లాడ్డం, నెల్సన్ దిలీప్ కుమార్ గెస్టుగా రావడం, దేవిశ్రీ ప్రసాద్ వివాదాస్పద స్పీచ్, హీరోయిన్ గ్లామర్ అట్రాక్షన్ వగైరాలు జనంతో నిండిపోయిన స్టేడియంని ఊపేశాయి.
గతంలో ఇతర హీరోలు ఇలా బయట రాష్ట్రాల్లో ప్రమోషన్లు చేశారు కానీ అవన్నీ ప్రెస్ మీట్లకే పరిమితం. కానీ పుష్ప 2 ఒక అడుగు ముందుకు వేసి పబ్లిక్ ప్లేసుల్లో వేడుకలు చేయడం ద్వారా కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. హైప్ ని విపరీతంగా పెంచడంలో విజయం సాధించారు. ఎంత ఖర్చయ్యిందనేది పక్కనపెడితే ఇది ఖచ్చితంగా ఓపెనింగ్స్ మీద సానుకూల ప్రభావం చూపించి అంతకంతా వసూళ్ల రూపంలో వెనక్కు తెస్తుంది. హైదరాబాద్ తో కలిపి ఇంకా దక్షిణాది ప్రమోషన్లు బాకీ ఉన్నాయి. మొదటి రెండు బంతులకే రెండు భారీ సిక్సర్లు కొట్టిన పుష్ప 2 ఇతర ప్యాన్ ఇండియా సినిమాలకు మోడల్ గా నిలుస్తోంది.
This post was last modified on November 26, 2024 11:24 am
భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరే మారుమోగిపోతోంది. ఇన్నాళ్లూ అతను ఆడుతున్న…
ఫిబ్రవరి 28: ప్రపంచం నిద్రలేచి కళ్లు నలుముకుంటున్న సమయం.. ఇంతలో ఏ టీవీ పెట్టినా.. ఒకటే బ్రేకింగ్ న్యూస్. ఇరాన్పై…
బలవంతుడు బలవంతుడే అన్నట్టు.. రాజకీయం.. రాజకీయమే!. ఈ మాట పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రె స్ పార్టీ అధినేత్రి…
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…