మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది కానీ ఏదీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మహేష్ బాబు సర్కారు వారి పాటలో నటించినప్పటికీ దాని ఫలితం యావరేజ్ దగ్గరే ఆగిపోవడంతో మళ్ళీ స్టార్ల సరసన జోడి కట్టే అవకాశం దక్కలేదు. ఇటీవలే తమిళంలో రఘు తాతతో పలకరించినా ఇది కూడా సేమ్ రిజల్ట్. తెలుగులో వేరే ఆర్టిస్టుతో డబ్బింగ్ చేసి ఓటిటిలో రిలీజ్ చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. సరే గ్లామర్ ప్రపంచంలో ఎక్కువ కాలం మడికట్టుకు ఉంటే నెగ్గుకురావడం కష్టం. అందరూ గిరి గీసుకుని సాయిపల్లవిలు కాలేరుగా.
అందుకే కీర్తి సురేష్ రూటు మార్చింది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న బేబీ జాన్ మూవీకి కండీషన్లు తీసేసింది. తాజాగా విడుదలైన నైన్ మటక్క పాటలో కాస్ట్యూమ్స్ విషయంలో మొహమాటం తగ్గించడం వీడియో రూపంలో కనిపిస్తోంది. ఇంత గ్లామరస్ గా గతంలో తను కనిపించలేదన్నది వాస్తవం. విజయ్ బ్లాక్ బస్టర్ తేరి రీమేక్ గా రూపొందుతున్న ఈ పోలీస్ డ్రామాకు అట్లీ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుండగా కలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ లో సమంతా చేసిన పాత్రను హిందీలో కీర్తి సురేష్ తో చేయించారు. కానీ తేరిలో ఇంత ఊర మాస్ టచ్ సామ్ క్యారెక్టర్ కు లేదు.
ఈ లెక్కన మార్పులు గట్టిగా చేసినట్టు ఉన్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ డిసెంబర్ 25 విడుదల కాబోతోంది. పుష్ప 2 వచ్చిన ఇరవై రోజులకే రిలీజ్ చేయడం సేఫ్ కాదని నార్త్ డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నప్పటికీ టీమ్ మాత్రం చాలా నమ్మకంగా ఉంది. ఇది కనక బ్రేక్ ఇస్తే రష్మిక మందన్న తరహాలో తనకూ గుర్తింపు వస్తుందని కీర్తి సురేష్ ఎదురు చూస్తోంది. అయితే సినిమాలో కొంత భాగానికే పరిమితమయ్యే తన పాత్ర ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి. తమన్ సంగీతం సమకూరుస్తున్న బేబీ జాన్ లో జాకీ శ్రోఫ్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. తేరి తెలుగు రీమేక్ ఉస్తాద్ భగత్ సింగన్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 25, 2024 6:12 pm
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…