2025 సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీ పండగ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టే. నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ ఈవెంట్ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ పొంగల్ రిలీజ్ అనుకున్న మాట వాస్తవమే కానీ ఇంకా ఏడు రోజుల షూటింగ్ బ్యాలన్స్ తో పాటు బెస్ట్ సినిమా ఇవ్వాలన్న సంకల్పంతో టీమ్ పని చేస్తున్నందున ఖచ్చితంగా ఆ సీజన్ కు వస్తామని గ్యారెంటీగా చెప్పలేమనే రీతిలో సంకేతం ఇవ్వడంతో అజిత్ రావడం అనుమానమే. ఇంకొద్దిరోజుల్లో ప్రకటన చేస్తామన్నారు కానీ ఫలానా సమయం అని ఎలాంటి క్లూస్ ఇవ్వలేదు.
ఇప్పుడీ గుడ్ బ్యాడ్ ఆగ్లీ తప్పుకోవడం ఎవరికి లాభమనే కోణం చూద్దాం. ముందుగా బెనిఫిట్ అయ్యేది ఖచ్చితంగా గేమ్ ఛేంజరే. ఎందుకంటే తమిళ వెర్షన్ ని రామ్ చరణ్ ఇమేజ్ తో పాటు దర్శకుడు శంకర్ బ్రాండ్ మీద మార్కెటింగ్ చేస్తున్నారు. సో అజిత్ కనక పోటీలో ఉంటే థియేటర్ల సమస్య వస్తుంది. ఇప్పుడా స్లాట్ ఖాళీ అయ్యింది కాబట్టి తగినన్ని స్క్రీన్లు దొరికే అవకాశాలు పెరిగాయి. పైగా ఎస్జె సూర్య, జయరాం, కియారా లాంటి క్యాస్టింగ్ కోలీవుడ్ జనాలకు కనెక్ట్ అయ్యేలా ఉంది. అయితే విక్రమ్ వీర ధీర శూరన్ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉండటం గేమ్ ఛేంజర్ కు కొంచెం స్పీడ్ బ్రేకర్ గా మారొచ్చు.
మనవైపు చూస్తే గుడ్ బ్యాడ్ ఆగ్లీ నిర్మాతలు మైత్రి కాబట్టి భారీగా కాకపోయినా సాధ్యమైనన్ని థియేటర్లు, షోలు వచ్చేలా చూసుకుంటారు. ఇప్పుడు తప్పుకుంటే అవన్నీ చరణ్, బాలయ్య, వెంకటేష్ పంచుకుంటారు. కొన్ని షోలు పెరిగినా లక్షల్లో గ్రాస్ పెరుగుతుంది కాబట్టి దీన్నో చిన్న విషయంగా కొట్టి పారేయలేం. అజిత్ సినిమా వాయిదా గురించి నిర్మాత పోస్ట్ పోన్ అనే పదం వాడకపోయినా పరోక్షంగా అన్నారు. ఒకవేళ దీని స్థానంలో అజిత్ మరో సినిమా విదాముయార్చి వస్తే ఇబ్బంది లేదు. తెలుగులో దాని మీద అంత బజ్ లేదు కాబట్టి ఆందోళన అనవసరం. చూడాలి ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.
This post was last modified on November 25, 2024 3:19 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…