2025 సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీ పండగ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టే. నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ ఈవెంట్ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ పొంగల్ రిలీజ్ అనుకున్న మాట వాస్తవమే కానీ ఇంకా ఏడు రోజుల షూటింగ్ బ్యాలన్స్ తో పాటు బెస్ట్ సినిమా ఇవ్వాలన్న సంకల్పంతో టీమ్ పని చేస్తున్నందున ఖచ్చితంగా ఆ సీజన్ కు వస్తామని గ్యారెంటీగా చెప్పలేమనే రీతిలో సంకేతం ఇవ్వడంతో అజిత్ రావడం అనుమానమే. ఇంకొద్దిరోజుల్లో ప్రకటన చేస్తామన్నారు కానీ ఫలానా సమయం అని ఎలాంటి క్లూస్ ఇవ్వలేదు.
ఇప్పుడీ గుడ్ బ్యాడ్ ఆగ్లీ తప్పుకోవడం ఎవరికి లాభమనే కోణం చూద్దాం. ముందుగా బెనిఫిట్ అయ్యేది ఖచ్చితంగా గేమ్ ఛేంజరే. ఎందుకంటే తమిళ వెర్షన్ ని రామ్ చరణ్ ఇమేజ్ తో పాటు దర్శకుడు శంకర్ బ్రాండ్ మీద మార్కెటింగ్ చేస్తున్నారు. సో అజిత్ కనక పోటీలో ఉంటే థియేటర్ల సమస్య వస్తుంది. ఇప్పుడా స్లాట్ ఖాళీ అయ్యింది కాబట్టి తగినన్ని స్క్రీన్లు దొరికే అవకాశాలు పెరిగాయి. పైగా ఎస్జె సూర్య, జయరాం, కియారా లాంటి క్యాస్టింగ్ కోలీవుడ్ జనాలకు కనెక్ట్ అయ్యేలా ఉంది. అయితే విక్రమ్ వీర ధీర శూరన్ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉండటం గేమ్ ఛేంజర్ కు కొంచెం స్పీడ్ బ్రేకర్ గా మారొచ్చు.
మనవైపు చూస్తే గుడ్ బ్యాడ్ ఆగ్లీ నిర్మాతలు మైత్రి కాబట్టి భారీగా కాకపోయినా సాధ్యమైనన్ని థియేటర్లు, షోలు వచ్చేలా చూసుకుంటారు. ఇప్పుడు తప్పుకుంటే అవన్నీ చరణ్, బాలయ్య, వెంకటేష్ పంచుకుంటారు. కొన్ని షోలు పెరిగినా లక్షల్లో గ్రాస్ పెరుగుతుంది కాబట్టి దీన్నో చిన్న విషయంగా కొట్టి పారేయలేం. అజిత్ సినిమా వాయిదా గురించి నిర్మాత పోస్ట్ పోన్ అనే పదం వాడకపోయినా పరోక్షంగా అన్నారు. ఒకవేళ దీని స్థానంలో అజిత్ మరో సినిమా విదాముయార్చి వస్తే ఇబ్బంది లేదు. తెలుగులో దాని మీద అంత బజ్ లేదు కాబట్టి ఆందోళన అనవసరం. చూడాలి ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.
This post was last modified on November 25, 2024 3:19 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…