నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. పబ్లిక్ స్టేజి మీద నేరుగా నిర్మాతలను ఉద్దేశించి ఒక సంగీత దర్శకుడు స్మూత్ గా అయినా సరే తన అసంతృప్తిని వెళ్లగక్కడం ఇదే మొదటిసారి. బీజీఎమ్ బాధ్యతలు వేరొకరికి అప్పజెప్పడం పట్ల తాను ఎంత రగిలిపోతున్నాడో దేవి నిన్న స్పీచ్ ద్వారా స్పష్టం చేశాడు. సినిమా రిలీజయ్యాక ఎవరి నిర్ణయం రైట్, ఎవరిది రాంగనేది తేలుతుంది కానీ ప్రతి రీల్ ని ఎంజాయ్ చేస్తూ పాటలు, బీజీఎమ్ కంపోజ్ చేశానని దేవి చెప్పడం బట్టి చూస్తే వ్యహహారం అనుకున్న దాని కన్నా సీరియస్ గానే ఉంది.
సరే పుష్ప 2 సంగతి పక్కనపెడితే మైత్రి బ్యానర్ లోనే దేవిశ్రీ ప్రసాద్ ఇంకో రెండు సినిమాలకు పని చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో మొదటిది పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి గబ్బర్ సింగ్ ఫలితాన్ని రిపీట్ చేసే ఉద్దేశంతో కోరి మరీ దేవిని పెట్టుకున్నాడు. రెండోది మైత్రి నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందే రామ్ చరణ్ 17. సుకుమార్ దర్శకత్వంలో వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి డిఎస్పినే పని చేయాలి. ఉస్తాద్ ఇంకా చాలా భాగం పెండింగ్ ఉండగా ఆర్సి 17 సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా టైం ఉంది. మరి మైత్రి అధినేతలు దేవిని కొనసాగిస్తారా అనేదే అసలు ప్రశ్న.
అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీని జివి ప్రకాష్ కుమార్ లేదా అనిరుధ్ కి ఇవ్వొచ్చనే వార్తల నేపథ్యంలో ఒకవేళ ఇదే నిజమైతే దేవికి మరో షాక్ కొట్టినట్టే. ఓపెన్ గా మాట్లాడతా అంటూ నేరుగా చురకలు వేసిన దేవిశ్రీ ప్రసాద్ పట్ల మైత్రి అనుసరించబోయే వైఖరి గురించి ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ పుష్ప 2 ఫలితం మీద ఎలాంటి ప్రభావం చూపబోవు కానీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యి అందులో తమన్, సామ్, అజనీష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కనక ఆయువుపట్టుగా నిలిస్తే అప్పుడు దేవిశ్రీ వాదన పలుచబడిపోతుంది. ఎలాంటి రిజల్ట్ వస్తుందో తెలియాలంటే ఇంకొక్క పది రోజులు ఆగితే చాలు.
This post was last modified on November 25, 2024 11:54 am
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…