హీరోయిన్లకు పెళ్లయిందంటే వాళ్ల కెరీర్ ముందుకు సాగడం కష్టమే. ఒకవేళ సినిమాలు చేసినా.. ముందులా లీడ్ రోల్స్ చేయడం, గ్లామరస్గా కనిపించడం.. పెద్ద చిత్రాల్లో అవకాశాలు దక్కించుకోవడం కష్టమే. ఐతే గతంతో పోలిస్తే ఈ విషయంలో ఈ మధ్య మార్పు కనిపిస్తోంది. పెళ్లయిన తారలు కూడా పెద్ద సినిమాల్లో లీడ్ రోల్స్లో కొనసాగుతున్నారు.
సమంత, శ్రియ, రాధికా ఆప్టే, కరీనా కపూర్, శకుంతలా దేవి లాంటి హీరోయిన్లు ఇందుకు ఉదాహరణ. ఐతే పై జాబితాలోని వాళ్లందరూ మంచి పెర్ఫామర్లుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లే. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటారు. వీళ్లతో పోలిస్తే కాజల్ అగర్వాల్ భిన్నమైన హీరోయిన్గా చెప్పొచ్చు. ఆమె కెరీర్ అంతా గ్లామర్ రోల్స్తోనే సాగిపోయింది. కొన్ని పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసినా.. అవి పెద్దగా గుర్తింపు తేలేదు. కానీ ఆమెకు అవకాశాలకు మాత్రం లోటు లేదు.
తన పెళ్లి గురించి జరుగుతున్న ఊహాగానాలకు తెర దించుతూ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడబోతున్నట్లు కాజల్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 30న ఆమె పెళ్లి జరగబోతోంది. మరి పెళ్లి చేసుకున్నాక కాజల్ సినీ కెరీర్ సంగతేంటి అని అందరిలోనూ ప్రశ్న ఉదయిస్తోంది. కాజల్ చేతిలో ప్రస్తుతం రెండు భారీ సినిమాలున్నాయి. ఒకటి.. ఆచార్య కాగా, ఇంకోటి ఇండియన్-2. పెళ్లయిన వెంటనే కాజల్ ‘ఆచార్య’ కోసం పని చేయాల్సి ఉంది. ‘ఇండియన్-2’ కోసం కూడా ఇంకా చాలా కాల్ షీట్లే ఇవ్వాల్సి ఉంది. కాబట్టి వచ్చే ఆరు నెలల్లో ఆమె వ్యక్తిగత జీవితానికి పెద్దగా సమయం కేటాయించే అవకాశం లేనట్లే.
ఇది కాక కాజల్ కోసం రెండు మూడు సినిమాలు ఎదురు చూస్తున్నాయి. కానీ వాటిని క్యాన్సిల్ చేస్తుందేమో చూడాలి. బడా వ్యాపారవేత్తల్ని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు చాలా వరకు సినిమాలకు దూరం అయిన వాళ్లే. అసలే పెళ్లవుతోంది. పైగా కాజల్ లాంటి గ్లామ్ హీరోయిన్లకు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ రావడం కష్టమే. ఆమె అక్క, వదిన, తల్లి తరహా పాత్రలు చేయడమూ సందేహమే. కాబట్టి ఎంతో కాలం ఈ చందమామను సినిమాల్లో చూసే అవకాశం లేనట్లే.
This post was last modified on October 6, 2020 2:41 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…